AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్నాళ్లు పెళ్లి చేయకుండా.. సొంత కూతుర్నే కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు.. కట్‌చేస్తే, వెలుగులోకి షాకింగ్ నిజాలు

ఎవరో బయటోళ్లు కాదు.. సొంత తల్లిదండ్రులే ఆ యువతి పట్ల కర్కశంగా వ్యవహరించారు.. ఇంట్లో కుటుంబ పోషణకు డబ్బులు ఇవ్వడం లేదని.. ఏకంగా కూతురిని కిడ్నాప్ చేసి చంపేయాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు.. కూతురికి పెళ్లి చేసి పంపిస్తే.. ఎక్కడ తమ జీవనాధారం పోతుందోనని.. ఇన్నాళ్లు పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకున్నారు..

ఇన్నాళ్లు పెళ్లి చేయకుండా.. సొంత కూతుర్నే కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు.. కట్‌చేస్తే, వెలుగులోకి షాకింగ్ నిజాలు
Teacher Kidnapped by Parents
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jun 18, 2025 | 6:52 PM

Share

ఎవరో బయటోళ్లు కాదు.. సొంత తల్లిదండ్రులే ఆ యువతి పట్ల కర్కశంగా వ్యవహరించారు.. ఇంట్లో కుటుంబ పోషణకు డబ్బులు ఇవ్వడం లేదని.. ఏకంగా కూతురిని కిడ్నాప్ చేసి చంపేయాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు.. కూతురికి పెళ్లి చేసి పంపిస్తే.. ఎక్కడ తమ జీవనాధారం పోతుందోనని.. ఇన్నాళ్లు పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకున్నారు.. ఇక తనకు పెళ్లి చేయరనుకున్న ఆ కూతురు.. ఇంట్లోంచి పారిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు షాక్ ఇచ్చింది. ఇంకేముంది ఇక ఎలాగైనా కూతురిని కిడ్నాప్ చేసి.. ఆమె సంపాదించిన ఆస్తులు రాయించుకోవాలని తల్లిదండ్రులు వేసిన మాస్టర్ స్కెచ్.. క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించింది.

వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం తగ్గుపర్తికి చెందిన మారుతమ్మకు 2016లో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చిన దగ్గరనుంచి మారుతమ్మ కుటుంబానికి ఆర్థికంగా జీవనాధారమైంది. తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లెలు, మరిది కుటుంబాలను మారుతమ్మ పోషిస్తుంది. ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం వచ్చి 9 సంవత్సరాలైనా.. మారుతమ్మ తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయడం లేదు. ఎక్కడ కూతురికి పెళ్లి చేస్తే తమ జీవనాధారం పోతుందోనని. మారుతమ్మను పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకున్నారు తల్లిదండ్రులు.

దీంతో మారుతమ్మ తల్లిదండ్రులు పెళ్లి చేయకపోవడంతో ఎర్రిస్వామి అనే వ్యక్తిని ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకుంది. దీంతో మార్తమ్మ తల్లిదండ్రులు.. సోదరుడు, చెల్లెలు కుటుంబాల పోషణకు ఆధారం పోయిందని… మారుతమ్మ కిడ్నాప్ కు ప్లాన్ చేశారు. భర్త ఎర్రిస్వామితో మోటార్ సైకిల్ పై వెళుతుండగా మారుతమ్మను.. తల్లిదండ్రులు, సోదరుడు, చెల్లెలు, చెల్లెలు భర్త… బొలెరో కారు, ద్విచక్ర వాహనం అడ్డుపెట్టి కిడ్నాప్ చేశారు. బొలెరో కార్లు బెంగళూరు తీసుకెళ్లి.. మారుతమ్మ పేరుతో ఉన్న బంగారం, ఇంటిని బలవంతంగా రాయించుకోవాలనుకున్నారు.

వీడియో చూడండి..

ఈ క్రమంలో తమ పేరుపై బంగారం, ఆస్తిని రాయకపోతే.. మారుతమ్మను చంపేస్తామని బెదిరించి రాయించుకోవాలనుకున్నారు తల్లిదండ్రులు.. ఈ నేపథ్యంలో మారుతమ్మను బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకొస్తుండగా.. పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది. కుటుంబ పోషణకు డబ్బులు ఇవ్వడంలేదని ఆఖరికి కన్న కూతురిని కూడా కిడ్నాప్ చేసి చంపేయాలనుకున్నారని పోలీసుల తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..