AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గుడిలో పెళ్లి చేసుకున్న ప్రేమ జంట.. ఆ తర్వాత, గడియ పెట్టుకొని..

ఇద్దరూ సచివాలయ ఉద్యోగులు.. కులాలు వేరైనా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. ఊరిలోని రామాలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. అంతా బాగానే ఉంది కానీ.. కులాంతర వివాహం చేసుకోవడంతో పెద్దలు ఏమైనా చేస్తారేమోనన్న భయంతో పెళ్లి చేసుకున్న గుడిలోనే దాక్కున్నారు.

Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: May 02, 2023 | 10:35 AM

Share

ఇద్దరూ సచివాలయ ఉద్యోగులు.. కులాలు వేరైనా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. ఊరిలోని రామాలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. అంతా బాగానే ఉంది కానీ.. కులాంతర వివాహం చేసుకోవడంతో పెద్దలు ఏమైనా చేస్తారేమోనన్న భయంతో పెళ్లి చేసుకున్న గుడిలోనే దాక్కున్నారు. ఆలయంలోనే గడియ పెట్టుకుని ప్రేమ జంట ఉండిపోయిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.

బుద్దాలపాలెం రామాలయంలో పెళ్ళి చేసుకున్న సచివాలయ ఉద్యోగులు.. గడియ పెట్టుకుని ఆలయంలోనే ఉండిపోయారు. కులాంతర వివాహం చేసుకొని పెద్దలకు భయపడుతూ గుడికి పరిమితమయ్యారని స్థానికులు తెలిపారు. తల్లితండ్రులు వారి ప్రేమను అంగీకరించరని.. ఏదైనా చేస్తారని భయంతో ప్రేమ జంట గుడిలోంచి బయటకురాలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత భయంతో ప్రేమికులు పోలీసులకు ఫోన్ చేశారు.

తాము కులాంతర వివాహం చేసుకున్నామని.. కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం పొంచి ఉందంటూ యువతీ, యువకుడు పోలీసు రక్షణ కోరారు. ప్రేమికుల విషయం తెలుసుకుని పోలీసులు.. అక్కడికి చేరుకుని ప్రేమికులతో మాట్లాడారు. రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వటంతో ప్రేమ జంట బయటకు వచ్చారు.

కాగా.. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమికులిద్దరూ సచివాలయ ఉద్యోగులని.. కులాంతర వివాహం చేసుకుని.. ఆ తర్వాత భయంతో గుడిలో గడి పెట్టుకుని ఉండిపోయారని పోలీసులు తెలిపారు. వారికి రక్షణ కల్పిస్తామని.. ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ సైతం ఇస్తామని తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..