AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్సార్ నమ్మారు, ఆయన స్ఫూర్తితోనే ముందుకు: సీఎం జగన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత  వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బతికున్నంతకాలం రైతుల గురించే ఆలోచించారని సీఎం జగన్ అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని..

CM Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్సార్ నమ్మారు, ఆయన స్ఫూర్తితోనే ముందుకు: సీఎం జగన్
Ap Farrmers Day
Ram Naramaneni
|

Updated on: Jul 08, 2021 | 4:07 PM

Share

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత  వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బతికున్నంతకాలం రైతుల గురించే ఆలోచించారని సీఎం జగన్ అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని.. రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అనంతలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూట్టారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్సార్ నమ్మారని జగన్ వెల్లడించారు. సాగు రంగంలో విప్లవానికి వైఎస్‌ నాంది పలికారన్నారు. జలయజ్ఞంతో రాష్ట్రం రూపురేఖలు మార్చారని కొనియాడారు. వైఎస్‌ స్ఫూర్తిగా రైతుల పక్షపాత ప్రభుత్వంగా వైసీపీ పాలన సాగిస్తోందన్నారు. కరోనా తదితర సవాళ్లు ఎదురైనా..ఎక్కడా రాజీపడలేదన్నారు.  3,800 కి.మీ. పాదయాత్రలో రైతుల కష్టాలు చూశానని చెప్పిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో రైతుల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. పెట్టుబడి ఖర్చులు ఇచ్చి రైతులకు అండగా నిలిచామని, రైతు భరోసా కింద రూ.13,500 నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. 52.38 లక్షల మంది రైతులకు రూ.17,029 కోట్లు అందజేశామన్నారు. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు సహాయ సహకారాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్‌బీకేల ద్వారా ఈ-క్రాప్‌ చేపడుతున్నామన్న జగన్… పంటలకు సంబంధించి వివరాలను ఆర్‌బీకేల్లో నమోదు చేస్తున్నామని చెప్పారు. ఈ-క్రాప్‌ తర్వాత పంటల బీమా సహా అన్ని రకాల సేవలు అందిస్తున్నట్లు వివరించారు.

ఆర్‌బీకేల ద్వారా తక్కువ అద్దెకు రైతులకు పనిముట్లు పంపిణీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. ఆర్‌బీకేల ద్వారా పంటలకు కనీస గిట్టుబాటు కల్పిస్తామన్నారు. రైతుల ఆదాయం పెంపునకు చేయూత ద్వారా పశువుల కొనుగోళ్లకు సాయం చేస్తున్నామన్నారు. అమూల్‌ ద్వారా పాల ధరలు పెంచి కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పాల విప్లవాన్ని తీసుకొస్తామని.. తక్కువ విద్యుత్‌ ధరలతో ఆక్వా రైతులకు అండగా నిలుస్తున్నామని జగన్ వెల్లడించారు.

తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి  జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ దిగువన చూడండి….

Also Read: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా.. తాజా వివరాలు ఇలా ఉన్నాయి

మళ్లీ కలవరపెడుతున్న కరోనా కేసులు.. 8 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక లేఖలు.. కఠినంగా వ్యవహరించాలని సూచన

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి