AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ కార్యక్రమంపై సీఎం జగన్ రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్లాప్‌ కార్యక్రమం కింద ఇప్పటివరకూ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా రివ్యూ చేశారు సీఎం.

Andhra Pradesh: 'క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌' కార్యక్రమంపై సీఎం జగన్ రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు
Cm Jagan
Ram Naramaneni
| Edited By: |

Updated on: Oct 22, 2021 | 7:27 PM

Share

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్లాప్‌ కార్యక్రమం కింద ఇప్పటివరకూ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా రివ్యూ చేశారు సీఎం. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు.  వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని సూచించారు. కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.  గ్రేడ్‌-2, 3… నగరపంచాయతీలకు క్లాప్‌ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ కూడా ఆయా నగరాలకు, పట్టణాలకు, పంచాయతీలకు చేరవేయాలని, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను వీలైనంత తర్వగా తెప్పించుకోవాలని సీఎం సూచించారు. సంబంధిత కంపెనీలతో మాట్లాడుకుని ఆయా వాహనాలను సత్వరమే తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నగరాలు, పట్టణాల్లో గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి సమీప ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.  ఎప్పటికప్పుడు గార్బేజ్‌ను తొలగించడమే కాకుండా దుర్వాసన ఆ ప్రాంతంలో రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు వ్యర్థాలనుంచి విద్యుత్‌ ఉత్పత్తి కర్మాగారం సిద్ధమైందని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రతిపాదిత ప్రాంతాల్లో కూడా ప్లాంట్లపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మించడంపైనే కాదు, వాటిని పరిశుభ్రంగా ఉంచేలా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల్లో డస్ట్‌బిన్స్‌ లేని వాళ్లకు డస్ట్‌బిన్స్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలని సూచించారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్యంపైనా నివేదికలు తెప్పించుకుని. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా తాగునీటి వాటర్‌ ట్యాంక్‌లను పరిశుభ్రం చేయించాలని సీఎం సూచించారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు.  మురుగునీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. ఎక్కడా కూడా మురుగునీరు నిల్వ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. నివాస ప్రాంతాల్లో మురుగునీటి నిల్వ లేకుండా చేయాలని, దీన్నొక సవాల్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో అత్యాధునిక విధానాలను పాటించాలన్నారు. క్లాప్‌ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ రూపంలో సమర్థులైన అధికారులను పెట్టాలని సీఎం జగన్ సూచించారు. అక్కడికి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి వాటి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read:పేలిన సిలిండర్.. కూలిన బ్రతుకులు.. ఆ పేద రైతు కల చెదిరిపోయింది.. చివరికి కన్నీరే మిగిలింది..

MAA: ‘మా’లో బిగ్ ట్విస్ట్.. ఎన్నికల కేంద్రంలో రౌడీషీట్ ఉన్న వ్యక్తి గుర్తింపు..