AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ సమీక్ష.. మరణించిన ఏపీ వాసులకు రూ. 10 లక్షల పరిహారం

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి చెందిన వాళ్లు మరణిస్తే కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం అందించాలని,...

Andhra Pradesh: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ సమీక్ష.. మరణించిన ఏపీ వాసులకు రూ. 10 లక్షల పరిహారం
Cm Jagan
Narender Vaitla
|

Updated on: Jun 04, 2023 | 3:07 PM

Share

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి చెందిన వాళ్లు మరణిస్తే కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ప్రకటించిన పరిహారానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందించనుంది.

ఇదిలా ఉంటే రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇక బాలాసోర్‌ పరిస్థితులను మంత్రి అమర్నాథ్‌ సీఎం జగన్‌కు వివరించారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితులను విశాఖ నుంచి పర్యవేక్షిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణీకులను 695 మందిని గుర్తించామన్నారు. 553 మంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.

కోరమండల్‌ రైలులో 480 మంది, యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది ప్రయాణించారు. 22 మంది గాయపడ్డారు. 92 మంది రైలు ప్రయాణం చేయలేదని చెప్ఉపకొచ్చారు. ఇంకా 25 మంది కాంటాక్ట్‌లోకి రాలేదన్న మంత్రి.. గాయపడిన వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విశాఖ ఆసుపత్రిలో ఐదుగురికి చికిత్స అందిస్తున్నామని, స్వల్ప గాయాలైన 11 మందికి చికిత్స అందించి పంపించామని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి