AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. స్వర్ణకుప్పం విజన్‌కు శ్రీకారం..!

ఇంటింటికి సౌర విద్యుత్‌ వెలుగులు, ప్రకృతి వ్యవసాయంపై పైలెట్‌ ప్రాజెక్టులతో కుప్పం కొత్త కళను సంతరించుకోనుంది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ నెల ఏడో తేదీన కుప్పం పర్యటన ముగించుకుని 8న విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు.

Chandrababu: మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. స్వర్ణకుప్పం విజన్‌కు శ్రీకారం..!
Chandrababu
Balaraju Goud
|

Updated on: Jan 05, 2025 | 7:38 AM

Share

కుప్పంలో వంద శాతం సోలార్‌ విద్యుత్‌ లక్ష్యంగా ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేశారు. కుప్పం నియోజకవర్గం ఇక సోలార్ విద్యుత్ వెలుగులతో నిండిపోనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇంటింటికి సౌర విద్యుత్‌ అందించేందుకు నడుం బిగించారు. కుప్పం నియోజకవర్గంలో వంద శాతం సోలార్‌ పవర్ అందించే ప్రణాళికకు సంబంధించిన కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి.

ప్రకృతి వ్యవసాయంపై ప్రాజెక్టులకు శ్రీకారం

ఆదివారం(జనవరి 5) నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన సాగుతుంది. ఆదివారం, సోమ, మంగళవారం కుప్పంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. ఇక ప్రకృతి వ్యవసాయం పైనా పలు పైలెట్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు చంద్రబాబు. ఇంటింటికి సౌర విద్యుత్, ప్రకృతి వ్యవసాయం లాంటి పలు పథకాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ప్రభుత్వ పనితీరు, స్థానిక అవసరాలపై నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. తనను ఇన్నిసార్లు గెలిపించిన ప్రజల కోసం…సమస్యలు లేని కుప్పంగా తన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు సీఎం.

స్వర్ణకుప్పం విజన్‌ -2029

కుప్పంలో మూడు రోజుల పర్యటన సందర్భంగా….డ్వాక్రా సంఘాలతో సమావేశం కానున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాటు… యువతతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటలకు ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్-2029 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కుప్పంను 100 శాతం సోలార్ పవర్‌గా మార్చే ప్రణాళికపై ఆ సభలో మాట్లాడనున్నారు బాబు. ఈ నెల ఏడో తేదీన కుప్పం పర్యటన ముగించుకుని 8న విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..