AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నై నుంచి నెల్లూరు వైపు దూసుకొస్తున్న కారు.. ఇంతలోనే అనుమానం వచ్చి ఆపగా..

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో వెంకటాచలం టోల్ గేట్ దగ్గర భారీగా బంగారం పట్టుబడింది. కారులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.. టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ బంగారం అక్రమ రవాణా గుట్టు వెలుగులోకి వచ్చింది.. ఈ తనిఖీల్లో 4.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.

చెన్నై నుంచి నెల్లూరు వైపు దూసుకొస్తున్న కారు.. ఇంతలోనే అనుమానం వచ్చి ఆపగా..
Gold Seize
Shaik Madar Saheb
|

Updated on: Mar 11, 2025 | 1:17 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో వెంకటాచలం టోల్ గేట్ దగ్గర భారీగా బంగారం పట్టుబడింది. కారులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.. టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ బంగారం అక్రమ రవాణా గుట్టు వెలుగులోకి వచ్చింది.. ఈ తనిఖీల్లో 4.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. దీనివిలువ రూ.3.38 కోట్లు ఉంటుందన్నారు.. బిల్లులు లేకుండా చెన్నై నుంచి నెల్లూరులోని ఓ దుకాణానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారం ప్రకారం.. సోమవారం సాయంత్రం వెంకటాచలం టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు.. ఈ క్రమంలో చెన్నై వైపు నుంచి వస్తున్న కారును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కారులో 4 కేజీల బంగారం లభ్యమైంది.. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని బిల్లులు లేకుండా.. చెన్నై నుంచి నెల్లూరు లోని ఒక వ్యాపారికి తరలిస్తూ పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.

వీడియో చూడండి..

ఈ ఘటనలో అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. హర్ష జైన్, అన్న రాం, రంజిత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన బంగారు ఆభరణాలను, కారును తదుపరి చర్యల నిమిత్తం GST అధికారులకు అప్పగించినట్లు నెల్లూరు విజిలెన్స్ SP రాజేంద్ర కుమార్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..