AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election Commission: ఇలా చేస్తేనే ప్రచారాలకు అనుమతి.. అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కొత్త రూల్స్..

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచార వేడి కనిపిస్తుంది. పోలింగ్‎కి ఇంకా 40 రోజులుపైనే టైం ఉన్నపటికీ అభ్యర్థులు మాత్రం ప్రచారంలో తగ్గేదెలే అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ప్రచారంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఎన్నికలకు ముందు మరో ఎత్తు అనేలా ఎన్నికల కమిషన్ ప్రచారంలో తొలిసారిగా ఆంక్షలు పెట్టింది.

Election Commission: ఇలా చేస్తేనే ప్రచారాలకు అనుమతి.. అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కొత్త రూల్స్..
Suvidha App
Ch Murali
| Edited By: |

Updated on: Mar 30, 2024 | 9:39 PM

Share

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచార వేడి కనిపిస్తుంది. పోలింగ్‎కి ఇంకా 40 రోజులుపైనే టైం ఉన్నపటికీ అభ్యర్థులు మాత్రం ప్రచారంలో తగ్గేదెలే అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ప్రచారంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఎన్నికలకు ముందు మరో ఎత్తు అనేలా ఎన్నికల కమిషన్ ప్రచారంలో తొలిసారిగా ఆంక్షలు పెట్టింది. ప్రచారాలకు సంబంధించి సమాచారం ముందుగా ఇవ్వాలని కొత్త యాప్ రూపొందించింది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థులైనా ప్రచారాలకు సంబంధించి 48 గంటల ముందు సువిధ అనే యాప్‎లో అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న 24 గంటల్లోనే అనుమతి వస్తుంది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారం కోసం అధికారుల నుంచి వేగంగా, ఎటువంటి వ్యయ ప్రయాసలు లేకుండా అనుమతులు పొందేందుకు భారత ఎన్నికల సంఘం సువిధ సింగిల్ విండో యాప్‌ను ప్రవేశపెట్టింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలు, ఊరేగింపులు వంటివి నిర్వహించే పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల సంఘం అనుమతిని తీసుకునేందుకు సువిధ యాప్‎ను వినియోగించుకోవచ్చు. అభ్యర్థులు 48 గంటలకు ముందు దరఖాస్తులు చేసుకుంటే, 24 గంటల్లోనే అధికారులు అనుమతులు జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థులు అనుమతుల కోసం సువిధ యాప్ సింగిల్ విండో పద్దతిలో దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో గానేఅనుమతులను అధికారులు మంజూరు చేస్తున్నారు.

మీటింగ్, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక ఎలక్షన్ ఆఫీస్, లౌడ్ స్పీకర్, హెలికాప్టర్, హెలిప్యాడ్, డోర్ టు డోర్ ప్రచారం, డిస్ ప్లే బ్యానర్స్, ఫ్లాగ్స్, ఎయిర్ బెలూన్స్, హోర్డింగులు, బ్యానర్లు, వీడియో వ్యాన్ మొదలైన అనుమతులు పొందేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా సువిధ పోర్టల్‎లో దరఖాస్తు చేసుకునేలా ఇచ్చే ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. అలాగే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల వద్దనే అనుమతి తీసుకునేందుకు వీలుగా కూడా సువిధ కౌంటర్‎ను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ ప్రచార అనుమతుల కోసం సువిధ ఆన్లైన్ పోర్టల్‎లో దరఖాస్తులు చేసుకుని వేగంగా అనుమతులు పొంది, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో అన్ని విధాల జిల్లా యంత్రాంగానికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
రాహల్ విధ్వంసం.. సొంతగడ్డపై రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఢిల్లీ!
రాహల్ విధ్వంసం.. సొంతగడ్డపై రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఢిల్లీ!
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!