Andhra Pradesh: ఆ ఘటనను మరవకముందే మరోసారి.. రాత్రయితే వింత శబ్దాలు.. ఎలుగుబంటి సంచారంతో భయం భయం

శ్రీకాకుళం (Sirkakulam) జిల్లా ప్రజలను ఎలుగుబంట్ల సంచారం కలవరపెడుతోంది. గతంలో జరిగిన ఘటనలను మరిచిపోకముందే మళ్లీ ఎలుగుబంటి కనిపించడం ఆందోళన రేపుతోంది. జిల్లాలోని మందస మండలం..

Andhra Pradesh: ఆ ఘటనను మరవకముందే మరోసారి.. రాత్రయితే వింత శబ్దాలు.. ఎలుగుబంటి సంచారంతో భయం భయం
Bear Wandering
Follow us

|

Updated on: Sep 04, 2022 | 9:02 AM

శ్రీకాకుళం (Sirkakulam) జిల్లా ప్రజలను ఎలుగుబంట్ల సంచారం కలవరపెడుతోంది. గతంలో జరిగిన ఘటనలను మరిచిపోకముందే మళ్లీ ఎలుగుబంటి కనిపించడం ఆందోళన రేపుతోంది. జిల్లాలోని మందస మండలం మొగిలిపాడు గ్రామంలో ఎలుగుబంటి (Bear) కలకలం సృష్టించింది. రాత్రి పూట గ్రామంలోని వీధుల్లో సంచరిస్తూ గ్రామస్థులకు తారసపడింది. ఎలుగుబంటి స౦చార౦తో స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు. గ్రామస్తులు అరవడ౦తో ఎలుగుబంటి పరారైంది. తిరిగి గ్రామంలోకి వస్తుందేమోననే భయంతో రాత్ర౦తా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అటవీ శాఖ అధికారులు స్పందించి, ఎలుగుబంటిని పట్టుకోవాలని కోరుతున్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు.

గతంలో జరిగిన ఘటనలో ఎలుగుబంటి దాడిలో వజ్రపుకొత్తూరు మండలంలోని కిడిసింగి గ్రామానికి చెందిన ఓ రైతు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మరో ఏడుగురు ఎలుగు దాడిలో గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. దీనిని సవాల్ గా తీసుకున్న అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరికి ఎలుగుబంటిని పట్టుకున్న అటవీ అధికారులు జూకీ తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఎలుగుబంటి చనిపోవడం విషాదం రేపింది.

అయితే.. ఎలుగుబంట్లు తరచూ తమ స్థావరాలు మార్చుకుంటాయి. వీటి సంచారంతో భయపడాల్సిన పనేమీ లేదని, ప్రజలకు రక్షణ కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?