AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Badvel By Poll: రేపటితో ముగియనున్న బద్వేల్‌ ఉప ఎన్నికల ప్రచారం.. సర్వశక్తులు ఒడ్డుతోన్న పార్టీలు

కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈసారి సైలెన్స్

Badvel By Poll: రేపటితో ముగియనున్న బద్వేల్‌ ఉప ఎన్నికల ప్రచారం.. సర్వశక్తులు ఒడ్డుతోన్న పార్టీలు
Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 26, 2021 | 3:04 PM

Share

కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈసారి సైలెన్స్ సమయాన్ని 48గంటల నుంచి 72గంటలకు పెంచడంతో రేపు సాయంత్రం 5గంటలకే మైకులు మూగబోనున్నాయి. దీంతో అధికార వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఉప ఎన్నికలో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని బద్వేల్ ప్రజలకు సీఎం జగన్ బహిరంగ లేఖలు రాశారు. మరోవైపు బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇక కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం నిర్వహిస్తోంది. మొత్తం 272 పోలింగ్ కేంద్రాలు.. బద్వేల్‌ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. అధికార పార్టీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి పనతల సురేశ్‌ పోటీ చేయనుండగా, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నాయి. ఈనెల 30న పోలింగ్ జరగనుండగా. ..నవంబర్‌ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

నియోజకవర్గంలోని ఓటర్ల పూర్తి  వివరాలివే

మొత్తం ఓటర్లు – 2,16,139 మహిళలు – 1,07,340 పురుషులు – 1,08,799 పోలింగ్ కేంద్రాలు – 272 సమస్యాత్మక కేంద్రాలు – 30 50శాతం కేంద్రాల్లో సీసీ కెమెరాలు, లైవ్‌ స్ట్రీమింగ్ ఉండనుంది.

Also Read:

Huzurabad: హుజూరాబాద్, బద్వేల్ బైపోల్స్‌లో వారిదే విజయం.. పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool News: ఉపాధ్యాయుల పొరపాటుతో అగమ్యగోచరంగా విద్యార్థి భవిష్యత్.. HRCని ఆశ్రయించిన బాధితుడు.. ఏమైందంటే..

ఈ 6 వస్తువులను జీవితంలో ఎప్పుడు దానం చేయవద్దు..! ఒకవేళ చేస్తే మొత్తం కష్టాలే..