Tenth Students: ఏపీ టెన్త్ స్టూడెంట్స్కు గుడ్న్యూస్.. పరీక్ష సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
అన్ని పల్లె వెలుగు, సిటీ ఆర్జినరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది. బస్సు పాస్ లేకున్నా.. హాల్ టికెట్ చూపించి విద్యార్థులు ఉచితంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చు. పరీక్ష పూర్తి అయిన అనంతరం విద్యార్థి తిరిగి తమ గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు అని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఏపీఎస్ఆర్టీసీ. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 3నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టెన్త్ స్టూడెంట్స్ కు గుడ్న్యూస్ చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చునని ప్రకటించింది. అన్ని పల్లె వెలుగు, సిటీ ఆర్జినరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది. బస్సు పాస్ లేకున్నా.. హాల్ టికెట్ చూపించి విద్యార్థులు ఉచితంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చు. పరీక్ష పూర్తి అయిన అనంతరం విద్యార్థి తిరిగి తమ గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు అని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షల సమయంలో ఈ అవకాశం ఉంటుందని పేర్కొంది. మరోవైపు..
పరీక్షల సమయంలో విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులను సిద్ధం చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. హాల్ టిక్కెట్ ఉంటే చాలు అనుమతించాలని ఆర్టీసీ సిబ్బందికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ బ్రహ్మానంద రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 6 లక్షల 50 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..