AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna Sagar: నాగార్జున డ్యాం వద్ద ఉద్రిక్తత వాతావరణం..కంచె ఏర్పాటు చేసిన ఏపీ పోలీసులు..

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు 500 మందికి పైగా ఏపీ పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 26 గేట్లలో సగభాగం అనగా.. 13వ గేటు వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. దీనిని టీఎస్ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు.

Nagarjuna Sagar: నాగార్జున డ్యాం వద్ద ఉద్రిక్తత వాతావరణం..కంచె ఏర్పాటు చేసిన ఏపీ పోలీసులు..
Srikar T
|

Updated on: Nov 30, 2023 | 6:59 AM

Share

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు 500 మందికి పైగా ఏపీ పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 26 గేట్లలో సగభాగం అనగా.. 13వ గేటు వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. దీనిని టీఎస్ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం తలెత్తింది.

ఈ విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. ఏపీ పోలీసులతో మాట్లడారు. డ్యామ్‌కు సంబంధించిన నిర్వహణ బాధ్యతలు మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుందని, ప్రస్తుతం వేసిన ముళ్ల కంచెను తొలగించాలని తెలిపారు. ఈ విషయంపై ఏపీ పోలీసులు స్పందించకపోవడంతో డీఎస్పీతో సహా అక్కడకు చేరుకున్న సిబ్బంది వెనుతిరిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు.. తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. నీటి విడుదలతో పాటూ భద్రతపై తెలంగాణ ప్రభుత్వమే ఇప్పటి వరకూ అన్ని రకాలా చర్యలను చేపడుతూ వస్తోంది. ప్రస్తుతం అక్కడికి మీడియాను ఉన్నతాధికారులు అనుమతించడం లేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

కోమటి రెడ్డి స్పందన ఇలా..

నాగార్జున సాగర్ ఉద్రిక్త పరిస్థితిపై కాంగ్రెస్ నల్గొండ అభ్యర్థి కోమటి రెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై కృత్రిమ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారన్నారు. ఇప్పుడు వందలమంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. తాగునీటి పేరుతో కేసీఆర్‌ డ్రామాలు ఆడుతున్నారన్నారు కోమటి రెడ్డి. పోలింగ్‌ రోజు తెలంగాణ సెంటిమెంట్‌ పండించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ నాటి దీక్ష ఫొటోలతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌ ఇదంతా చేస్తోందని స్పందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..