AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణ సామగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి: ఏపీ ముఖ్యమంత్రి

రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, ఎంఐజీ లే అవుట్లపై సమీక్ష జరిపారు.

వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణ సామగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి: ఏపీ ముఖ్యమంత్రి
Cm Jagan
Venkata Narayana
|

Updated on: Aug 23, 2021 | 3:22 PM

Share

YS Jagan: రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, ఎంఐజీ లే అవుట్లపై సమీక్ష జరిపారు. అక్టోబర్ 25 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. కాలనీల్లో ఇళ్ల నిర్మాణ సామగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ నెరపిన సమీక్షా సమావేశంలో అధికారులకు అనేక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.

ఇళ్ల నిర్మాణ సామగ్రిలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.5,120 కోట్లు ఆదా చేశామని, ఒక్కో ఇంటి నిర్మాణ సామగ్రి కొనుగోలులో రూ.32 వేలు ఆదా అవుతుందని, లబ్ధిదారుల కోరిక మేరకే నిర్మాణ సామగ్రి పంపిణీ చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. దీని కోసం ప్రత్యేక యాప్‌ రూపొందించామని తెలిపారు. ఫేజ్‌-1లో భాగంగా 85,888 ఇళ్ల పనులు పూర్తి చేశామని సీఎంకు అధికారులు వివరించారు. మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. డిసెంబర్ 2021 నాటికల్లా లబ్దిదారులకు ఇళ్లు అందిస్తామన్నామని అధికారులు చెప్పారు.

విజయదశమి నాటికి అమలు తేదీలు ప్రకటించాలని జగన్ ఆదేశించారు. కాలనీల్లో విద్యుదీకరణకు అవసరమైన సామగ్రి కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇళ్లు కట్టి ఇచ్చే పనులు అక్టోబర్‌ 25 నుంచి ప్రారంభం కావాలన్నారు. జగనన్న కాలనీల్లో ఇంటర్‌నెట్‌ సదుపాయం ఉండాలని అధికారులను ఆదేశించారు. 90 రోజుల్లోగా అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

Read also: Lockers: బ్యాంక్‌ లాకర్ల విషయంలో రూల్స్‌ను పూర్తిగా మార్చేసిన ఆర్‌బీఐ.. ఇప్పడు మరింత ఈజీ