AP CMO Office: విశాఖపట్నం షిఫ్ట్ అయ్యేందుకు చకచకా ఏర్పాట్లు.. భవనాల ఎంపిక కొలిక్కి వచ్చినట్టేనా..?
సీఎంఓ ఆఫీస్ విశాఖపట్నం షిఫ్ట్ అవ్వడానికి చకచకా పనులు జరిగిపోతున్నాయి. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, సీఎం క్యాంప్ ఆఫీస్, సీఎం నివాసం ఇలా.. అన్ని విషయాలపై సీఎం జగన్ పర్యవేక్షణలో కమిటీ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి విధానంలో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విశాఖలో ముఖ్యమంత్రి పర్యవేక్షణ, సమీక్ష సమావేశాలకోసం అవసరమైన భవనాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

సీఎంఓ ఆఫీస్ విశాఖపట్నం షిఫ్ట్ అవ్వడానికి చకచకా పనులు జరిగిపోతున్నాయి. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, సీఎం క్యాంప్ ఆఫీస్, సీఎం నివాసం ఇలా.. అన్ని విషయాలపై సీఎం జగన్ పర్యవేక్షణలో కమిటీ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి విధానంలో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విశాఖలో ముఖ్యమంత్రి పర్యవేక్షణ, సమీక్ష సమావేశాలకోసం అవసరమైన భవనాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు సహా, ఇతర అధికారులు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అవసరమైన భవనాలను గుర్తించామని ఈ సందర్భంగా అధికారుల కమిటీ తెలియజేసింది. దీంతోపాటు విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసుకోసం గుర్తించిన వివిధ భవనాల వివరాలను అధికారులు అందించారు.
విశాఖలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాలు, వాటి కార్యాలయాలు 2,27,287 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్నాయని కమిటీ గుర్తించింది. వీటిలో సీనియర్ అధికారులకు అవసరమైన క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని, వసతి కూడా ఆయా విభాగాల పరిధిలో ఉన్నవాటిని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఐటీ హిల్పై ఉన్న మిలీనియం టవర్లో అందుబాటులో ఉన్న 1,75,516 అడుగుల విస్తీర్ణంలో మిగిలిన సీనియర్ అధికారులు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడించింది. ఇంకా కొంతమంది అధికారులకోసం, వారి కార్యాలయాల కోసం మరికొన్ని ప్రైవేటు భవనాలను గుర్తించామని, 3,98,600 చదరపు అడుగులు విస్తీర్ణాన్ని గుర్తించామని కమిటీ వివరించింది.
ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు కార్యలాపాలు, వారి వసతి కోసం ప్రభుత్వం భవనాలు, ప్రైవేటు భనాల్లో 8,01,403 చదరపు అడుగులు విస్తీర్ణాన్ని గుర్తించామని కమిటీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిపింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, వసతి కోసం ఐదు రకాల భవనాలను గుర్తించినట్టు కమిటీ వెల్లడించింది. ఆంధ్రాయూనివర్శిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ వర్శీటీ బ్లాకులు, సిరిపురంలోని వీఎంఆర్డీఏ భవనాలు, మిలీనియం ఎ-టవర్, మిలీయనం బి- టవర్.. రుషికొండలోని టూరిజం రిసార్టులను గుర్తించామని కమిటీ తెలిపింది.
ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా..
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, వసతి, అధికారులతో సమావేశాలకోసం సరపడా గదులు, భద్రతా సిబ్బంది ఉండేందుకు సదుపాయాలు, ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామన్న కమిటీ… ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా, పౌరులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, ముఖ్యమంత్రికి భద్రత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రాకపోకల సమయంలోకూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ట్రాఫిక్కు ఇబ్బంది రాకుండా, అదే సమయంలో సౌలభ్యతను దృష్టిలో ఉంచుకున్నామని తెలిపారు. ట్రాఫిక్ దృష్ట్యా, యూనివర్శిటీ అకడమిక్ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో యూనివర్శిటీ భవనాలను పరిగణలోకి తీసుకోలేదని కమిటీ వెల్లడించింది.
అలాగే, వీఎంఆర్డీఏ ప్రాంతంలోకూడా పెద్ద ఎత్తున రద్దీ ఉంటుందని, చుట్టూ పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు ఉన్నాయి, భద్రతాపురంగా ఇబ్బంది ఉందని, సీఎం క్యాంపు కార్యాలయం ఇక్కడ పెడితే వారందరికీ ఇబ్బందులు వస్తాయని తెలిపిన అధికారులు. సరైన వసతికూడా దీనికి సమీపంలో లేదని అధికారులు తెలిపారు. అలాగే మిలీనియం టవర్లో ఒక దాంట్లో ఇప్పటికే కొన్ని కంపెనీలు నడుస్తున్నాయని, రెండో టవర్కూడా ఆఫీసుకు సరిపోయినా, సీఎం వసతికి సరిపోదని వివరించారు. పైగా భద్రతా కారణాలవల్ల కూడా అంత అనుకూలత లేదని స్పష్టంచేశారు.
రుషికొండ వద్ద నిర్మించిన రిసార్టులకోసం నిర్మించిన భవనాలు సీఎం క్యాంపు కార్యాలయంకోసం అత్యంత అనుకూలంగా ఉన్నాయన్న అధికారులు.. వీఐపీల రాకపోకల వల్ల పౌరులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా, నగరంలో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఈ భవనాలు ఉన్నాయని వివరించారు. పార్కింగ్, ఆఫీసు, వసతి, భద్రతా సిబ్బందికి, సీఎం సెక్రటరీల కార్యకలాపాలకు, ఈ భవనాలు సరిపోతాయని, అలాగే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన హెలికాపాడ్ కూడా సమీపంలోనే ఉందని వెల్లడించారు. దీనివల్ల నగరంలో ట్రాఫిక్కు ఇబ్బందిలేకుండా, పౌరులకు కూడా ఎలాంటి ఇబ్బందిలేకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నివేదికను ఖరారు చేస్తున్నామని తెలిపారు. అయితే కమిటీ మరోసారి సీఎంతో సమావేశం అయి భవనాలను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు సీఎం జగన్. ఈ క్రమంలో డిసెంబర్ లోపల సీఎం క్యాంప్ ఆఫీస్ వైజాగ్ కు తరలి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
