AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం. నేటి నుంచే..

స్కూళ్లకు వెళ్లే చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జగనన్న గోరు ముద్దు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రతి రోజూ మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం..

Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం. నేటి నుంచే..
Jagananna Gorumudda
Narender Vaitla
|

Updated on: Mar 21, 2023 | 9:34 AM

Share

స్కూళ్లకు వెళ్లే చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జగనన్న గోరు ముద్దు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రతి రోజూ మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మెనులో మరో పోషకాహారం అందించనున్నారు.

44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్ధులకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రూ. 86 కోట్ల అదనపు వ్యయంతో చేపడుతోన్న ఈ కార్యక్రమాన్ని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి  ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో సమూల మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరుతో చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తోంది.

ఇక తాజాగా జోడించిన రాగిజావాను వారానికి మూడు రోజులు అందించనున్నారు. మిగిలిన మూడు రోజుల్లో చిక్కీ ఇవ్వనున్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా వారానికి 15 రకాలు, ఐదు రోజుల పాటు- గుడ్డు, 3 రోజులు చిక్కీ, ఇకపై 3 రోజులు రాగిజావ కూడా ఇవ్వనున్నారు. ఇక జగనన్న గోరు ముద్ద పథకానికి ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.1824 కోట్లు ఖర్చు చేస్తుంది. రాగి జావ కూడా జగనన్న గోరుముద్ద పథకంలో చేరడంతో మరో రూ. 86 కోట్లతో కలిపి మొత్తం జగనన్న గోరుముద్ద పథకం రూ.1910 కోట్లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్