AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రారంభం.. ఒక్కరోజే సమావేశాలు నిర్వహించే యోచనలో జగన్ సర్కార్!
AP Assembly 2021: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేవాలు ఇవాళ ఉదయం మొదలయ్యాయి. ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ తమ్మినేని సీతారం ప్రారంభించారు.

AP Assembly session 2021: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేవాలు ఇవాళ ఉదయం మొదలయ్యాయి. ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ తమ్మినేని సీతారం ప్రారంభించారు. ఈ సమావేశాల్లో 14 ఆర్డినెన్స్లను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. మహిళా సాధికారతపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరుగనుంది. ఒక్కరోజే సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీలో అసెంబ్లీ సమావేశాల అజెండా, పనిదినాలపై చర్చించనున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఒక్కరోజే సమావేశం జరిపితే సభను టీడీపీ బహిష్కరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.

Ycp Mla Sudha
