AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఏఈ! గుంటూరులో అవినీతి తిమింగళం..

సర్కార్ కొలువు చేస్తూ అవినీతికి అలవాటు పడ్డ భారీ అవినీతి తిమింగళం ఎసీబీ వలకు చిక్కింది. మంజూరైన బిల్లులను ప్రాసెస్‌ చేసేందుకు లంచం తీసుకుంటూఅవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు సదరు ప్రభుత్వ ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు. గుంటూరు ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్‌ స్టోరేజీ (ఎస్‌ఎస్‌) ట్యాంకర్‌కు..

Andhra Pradesh: ఆమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఏఈ! గుంటూరులో అవినీతి తిమింగళం..
AE Officer P Sivaramakrishna
Srilakshmi C
|

Updated on: Mar 02, 2024 | 7:24 AM

Share

నగరంపాలెం, మార్చి 2: సర్కార్ కొలువు చేస్తూ అవినీతికి అలవాటు పడ్డ భారీ అవినీతి తిమింగళం ఎసీబీ వలకు చిక్కింది. మంజూరైన బిల్లులను ప్రాసెస్‌ చేసేందుకు లంచం తీసుకుంటూఅవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు సదరు ప్రభుత్వ ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు. గుంటూరు ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్‌ స్టోరేజీ (ఎస్‌ఎస్‌) ట్యాంకర్‌కు సంబంధించి మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్, ఫెన్సింగ్‌ పనులను ఇటీవల పూర్తి చేశారు. గుంటూరు రూరల్‌ మండల పరిధిలోని నల్లపాడు గ్రామానికి చెందిన శ్యామల రవికిషోర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌ ఈ పనులను పూర్తి చేశారు. అందుకుగాను మూడు బిల్లులకు కలిపి ప్రభుత్వం నుంచి దాదాపు రూ.42 లక్షలు మంజూరయ్యాయి.

అయితే మంజూరైన బిల్లులను ప్రాసెస్‌ చేసేందుకు రూరల్‌ వాటర్‌ సప్లయి/శానిటేషన్‌ గుంటూరు డివిజన్‌ పరిధిలోని పెదకాకాని ఏఈ అధికారి పి శివరామకృష్ణ వద్దకు కాంట్రాక్టర్‌ రవికిషోర్‌రెడ్డి వెళ్లాడు. ఈ క్రమంలో శాంక్షన్‌ అయిన బిల్లుల మొత్తం చేతికి అందాలంటే లంచం ఇచ్చుకోవల్సి ఉంటుందని డిమాండ్‌ చేశారు. రూ.42 లక్షల బిల్లులకు నాలుగు శాతం చొప్పున అంటు రూ.1.68 లక్షలు ఇవ్వాలంటూ ఏఈ శివరామకృష్ణ డిమాండ్‌ చేశారు. దీంతో కాంట్రాక్టర్‌ రవికిషోర్‌రెడ్డి తెలివిగా టోల్‌ఫ్రీ నంబర్‌ 14400ను సంప్రదించి, తనగోడును విన్నవించుకున్నాడు. ఏఈ శివరామకృష్ణను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఏసీబీ అధికారులు పథకం పన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారుల సూచనల మేరకు నగదు ఇవ్వడానికి రవికిషోర్‌రెడ్డి కూడా అంగీకరించాడు. దీంతో జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పీఆర్‌ (ఆర్‌డబ్ల్యూఎస్‌) డివిజన్‌ కార్యాలయం వద్దకు శుక్రవారం సాయంత్రం రావాలని కాంట్రాక్టర్‌కు ఏఈ శివరామకృష్ణ సూచించారు.

ఆ ప్రకారంగానే అక్కడకు వెళ్లిన కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.68 లక్షల లంచం తీసుకుంటున్న శివరామకృష్ణను.. అక్కడే పొంచిఉన్న గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం పలకలూర్‌రోడ్‌లోని ఏఈ నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ దాడిలో డీఎస్పీలు టీవీవీ ప్రతాప్‌ కుమార్, ఎన్‌.సత్యానందం తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?