ఏపీ రాజధానిలో.. టీడీపీ జాతీయ కార్యాలయం..
ఏపీ రాజధానిలో టీడీపీ జాతీయ కార్యాలయం శుక్రవారం ప్రారంభంకానుంది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో మూడు అంతస్థులతో ఈ ఆఫీస్ను నిర్మించారు. ఈ నేపథ్యంలో గురువారం నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు కార్యాలయంలో పూజలు చేపట్టారు. శృంగేరీ శారదాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వర్యంలో తొలుత గణపతి పూజ.. అనంతరం సుదర్శన హోమం , గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం 10.03 నిమిషాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు […]
ఏపీ రాజధానిలో టీడీపీ జాతీయ కార్యాలయం శుక్రవారం ప్రారంభంకానుంది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో మూడు అంతస్థులతో ఈ ఆఫీస్ను నిర్మించారు. ఈ నేపథ్యంలో గురువారం నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు కార్యాలయంలో పూజలు చేపట్టారు. శృంగేరీ శారదాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వర్యంలో తొలుత గణపతి పూజ.. అనంతరం సుదర్శన హోమం , గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం 10.03 నిమిషాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభంకానుంది. ఈ ప్రారంభోత్సవానికి.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు హాజరుకానున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించాం. (1/2) pic.twitter.com/pqPRC1mKql
— Lokesh Nara (@naralokesh) December 5, 2019
శృంగేరీ శారదాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వర్యంలో ముందుగా గణపతి, పూజ అనంతరం సుదర్శన హోమం , గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్నాము (2/2) pic.twitter.com/BTuDKpHTmn
— Lokesh Nara (@naralokesh) December 5, 2019