AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ‘ఇంగ్లీష్ మీడియం’పై సుప్రీం విచారణ.. ‘స్టే’కు నిరాకరణ

ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది

Breaking: 'ఇంగ్లీష్ మీడియం'పై సుప్రీం విచారణ.. 'స్టే'కు నిరాకరణ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 03, 2020 | 12:00 PM

Share

AP English Medium: ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. కాగా స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం  తీసుకొచ్చిన 81, 85 జీవోలను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15 న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జూన్ 4న  ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ కెఎం జోసెఫ్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ”విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29(2)(ఎఫ్) ప్రకారం సాధ్యమైనంత వరకు మాతృభాషలోనే విద్యాబోధన అని ఉంది. హైకోర్టు ఆ వాదనను పరిగణలోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది” అని తెలిపింది.

ప్రభుత్వం తరఫున విశ్వనాథన్ మాట్లాడుతూ.. ”ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడం తప్పేమీ కాదు. విద్యార్థుల అభివృద్ధి కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధ్యమైనంత వరకు అంటే తప్పనిసరిగా అని కాదు. విద్యాహక్కు చట్టంలో మాతృభాషలోనే బోధన తప్పనిసరి అని ఎక్కడా లేదు. వాస్తవ పరిస్థితులకు అనుగుణమైన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం లేకనే ప్రజలు ప్రభుత్వ పాఠశాలకు దూరం అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ బాగా చాలా ముఖ్యమైనది. ప్రభుత్వం సర్వే నిర్వహించగా అత్యధికులు ఇంగ్లీష్ మీడియంను స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయకపోవడం సమంజసం కాదు. అందుకే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వండి” అని అన్నారు.

మరోవైపు ప్రతివాదుల తరఫున గోపాల్ శంకర్ నారాయణ్ మాట్లాడుతూ.. ”ఇక్కడ విద్యార్థులకు ఛాయిస్ లేకపోవడాన్నే మేం ప్రశ్నిస్తున్నాం. తెలుగు మీడియం స్కూళ్లన్నీ ఇంగ్లీష్‌ మీడియంగా మారుతున్నాయి. నిజానికి మాతృభాషను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహించాలి. అందుకే ఈ అంశంపై స్టే ఇవ్వడం సరికాదని” తెలిపారు. వాదోపవాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. కానీ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేమని వివరించింది. అలాగే తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

Read More:

ఐరాసలో పాకిస్థాన్ పన్నాగం.,తిప్పికొట్టిన భద్రతా మండలి

తెలంగాణలో ఎదురుకాల్పులు.. ఓ మావోయిస్టు మృతి

Follow Us
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా