వైఎస్సార్ పేరు కలిసేలా.. ‘రైతు భరోసా కేంద్రాల’ పేరు మార్పు
ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు భరోసా కేంద్రాల పేరు మారనుంది. ఈ కేంద్రాలను దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు భరోసా కేంద్రాల పేరు మారనుంది. ఈ కేంద్రాలను దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇకపై రైతు భరోసా కేంద్రాలు ‘డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు’గా మారనున్నాయి. రైతులకు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు గుర్తుగా అయన పేరును ఖరారు చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే వైఎస్సార్ జయంతి అయిన జూలై 8న రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు వైఎస్సార్ పేరు కలిసేలా ఇప్పటికే పలు పథకాలను జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.