AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం.. బోల్తా పడిన లారీ..

ఫుల్ లోడ్ తో కొండ‌పైకి వెళ్తున్న లారీ నుంచి చక్రాలు విడిపోవడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 10 గంటలు పడుతుండగా..

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం.. బోల్తా పడిన లారీ..
Accident In Tirumala
Surya Kala
|

Updated on: Jul 25, 2024 | 4:06 PM

Share

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమ‌ల రెండో ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్తున్న లాడీ బోల్తా పడి పిట్టగోడను అనుకుని ఆగిపోయింది. ఫుల్ లోడ్ తో కొండ‌పైకి వెళ్తున్న లారీ నుంచి చక్రాలు విడిపోవడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 10 గంటలు పడుతుండగా.. రూ. 300 ప్రత్యేక దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు బుధవారం స్వామి వారిని 73,023 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,942 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి వెంకన్నకు మొక్కు తీర్చుకున్నారు. తీర్చుకున్నారు. రూ.3.98 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం అని టీటీడీ అధికారులు చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..