AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇదేంది సామీ.. ఆస్తికోసం మృతదేహం వద్దే పంచాయితీ పెట్టిన కుటుంబ సభ్యులు..

అతను అనారోగ్యంతో మృతి చెందాడు. కానీ రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే అంత్యక్రియలు చెయ్యకుండా ఆస్తి కోసం మృతదేహం వద్ద వాగ్వాదానికి దిగడం కలకలం రేపింది. ఆస్తి పంపకాల విషయం తేలితేనె అంత్యక్రియలు అంటు తెగేసి చెప్పి మృతదేహం వద్ద ఆస్తి పంచాయతి జరగడడాన్ని చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఈ ఘటన నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉండే చిన్న వెంకటేశ్వర్లు రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.

Andhra Pradesh: ఇదేంది సామీ.. ఆస్తికోసం మృతదేహం వద్దే పంచాయితీ పెట్టిన కుటుంబ సభ్యులు..
Death
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Aug 27, 2023 | 10:42 AM

Share

నంద్యాల జిల్లా న్యూస్, ఆగస్టు 27: అతను అనారోగ్యంతో మృతి చెందాడు. కానీ రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే అంత్యక్రియలు చెయ్యకుండా ఆస్తి కోసం మృతదేహం వద్ద వాగ్వాదానికి దిగడం కలకలం రేపింది. ఆస్తి పంపకాల విషయం తేలితేనె అంత్యక్రియలు అంటు తెగేసి చెప్పి మృతదేహం వద్ద ఆస్తి పంచాయతి జరగడడాన్ని చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఈ ఘటన నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉండే చిన్న వెంకటేశ్వర్లు రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయనకు ముగ్గురు భార్యలు,ఆరుగురు సంతానం. మొదటి భార్య వెంకట సుబ్బమ్మ. ఆమెకు మల్లికార్జున, పుల్లయ్య అనే ఇద్దరు కొడుకులు. ఇక రెండవ భార్య బొజ్జమ్మకు లక్షేశ్వరి,సుబ్బమ్మ అనే ఇద్దరు కూమార్తెలు. మూడవ భార్య లక్షీదేవికి వరలక్షీ, ప్రసాద్ అనే ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

రెండవ భార్య బొజ్జమ్మకు రెండవ సంతానం కలిగిన మూడు నెలలకే ఆమె మృతి చెందింది. ఇద్దరు ఆడపిల్లల బాగోగులు కూడా మృతుడు చిన్న వెంకటేశ్వర్లు చూసుకొనేవాడు. చిన్న వెంకటేశ్వర్లు మొదటి భార్య వెంకట సుబ్బమ్మ.. భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా భర్తకు దూరంగా ఉంటు జీవనం సాగిస్తూ ఉండేది. ఇక రెండవ భార్య బొజ్జమ్మ మృతి చెందడంతో చిన్న వెంకటేశ్వర్లు మూడవ వివాహం చేసుకున్నాడు. మూడవ పెళ్లి చేసుకున్న రెండవ భార్య,మూడవ భార్య పిల్లల బాగోగులు, వివాహాలు అన్ని చిన్న వెంకటేశ్వర్లు సక్రమంగా నిర్వహించాడు. ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఆస్తి విషయంలో తరుచు పెద్ద భార్య, రెండవ భార్య పిల్లల మధ్య ఎలాంటి వివాదం జరగలేదు. అయితే అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత ఆస్తి కోసం రక్త సంబంధం పక్కన పెట్టి మృతదేహం వద్ద వాగ్వాదానికి దిగడం అందరిని కలచి వేస్తోంది.

ఇవి కూడా చదవండి

పట్టణంలో ప్రముఖ రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉండటంతో పాటు కుల సంఘంలో కూడా పెద్ద మనిషిగా చెలామణి అయ్యేవాడు చిన్న వెంకటేశ్వర్లు. ఎన్నో పంచాయతీలకు పెద్ద మనిషిగా వ్యవహరించి సమస్యలు పరిష్కరించేవాడు. అనారోగ్యంతో చనిపోవడంతో తన ఇంటి సమస్య, ఆస్తుల సమస్య తీర్చే వాళ్ళు లేక మృతదేహం రోడ్డు పైనే పడి ఉండటం అందరిని కలచి వేసింది. మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు మొదటి భార్య వెంకట సుబ్బమ్మ, ఆమె ఇద్దరు కొడుకులు వాళ్ళ వారసులతో పాటు రెండవ భార్య ఇద్దరు పిల్లలు మృతదేహం వద్దకు చేరుకున్నారు. మూడవ భార్య లక్షీదేవి అమె కూతురు,కొడుకు పేరుపై ఆస్తులు ఉండటంతో మృతదేహం ముందే పంచాయతి జరగాలంటు గొడవకు దిగారు.

Chinna Venkateshwarlu

Chinna Venkateshwarlu

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి