AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Smuggling: ఏపీ వ్యాప్తంగా కస్టమ్స్ అధికారుల సోదాలు.. భారీగా పట్టుబడిన బంగారం, నగదు..

గోల్డ్‌ స్మగ్లర్లు.. కస్టమ్స్ అధికారుల ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు ఆలోచిస్తూ బంగారాన్ని తరలిస్తున్నారు. అయినప్పటికీ..

Gold Smuggling: ఏపీ వ్యాప్తంగా కస్టమ్స్ అధికారుల సోదాలు.. భారీగా పట్టుబడిన బంగారం, నగదు..
Gold And Money Seized
Shiva Prajapati
|

Updated on: Oct 20, 2022 | 8:43 PM

Share

గోల్డ్‌ స్మగ్లర్లు.. కస్టమ్స్ అధికారుల ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు ఆలోచిస్తూ బంగారాన్ని తరలిస్తున్నారు. అయినప్పటికీ అడ్డంగా దొరికేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ మొత్తంలో బంగారం, నగదు స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డారు స్మగ్లర్లు. 13.189 కేజీల బంగారం, రూ. 4.24 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురువారం నాడు కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కేవలం ఒకే రోజులో 13.189కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 6.7 కోట్లుగా గుర్తించారు. బంగారంతో పాటు 4.24 కోట్ల నగదును సీజ్‌ చేశారు అధికారులు. అటు ఈ సోదాల్లో నలుగురిని అరెస్ట్‌ చేశారు.

అయితే ఏపీ వ్యాప్తంగా సోదాలు చేపట్టిన కస్టమ్స్‌ అధికారులు.. విశాఖ, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, సూళ్లూరుపేట, చిలకలూరిపేటలో భారీగా గోల్డ్ స్మగ్లింగ్‌ జరుగుతున్నట్లు గుర్తించారు. మొత్తం 100 మంది కస్టమ్స్ అధికారులు, 20 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు చేశారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, కార్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పట్టుబడిన బంగారం, నగదును చూసి అధికారులే ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..