AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UNO Employees: యెమెన్‌లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి ఉద్యోగుల కిడ్నాప్.. విడిపించేందుకు అధికారుల ప్రయత్నం!

దక్షిణ యెమెన్‌లో ఐదుగురు ఐక్యరాజ్యసమితి ఉద్యోగులను అల్ ఖైదా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. యెమెన్‌ అధికారులు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు.

UNO Employees: యెమెన్‌లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి ఉద్యోగుల కిడ్నాప్.. విడిపించేందుకు అధికారుల ప్రయత్నం!
United Nations Employees
Balaraju Goud
|

Updated on: Feb 13, 2022 | 11:12 AM

Share

UNO Employees Kidnap in Yemen:  దక్షిణ యెమెన్‌లో ఐదుగురు ఐక్యరాజ్యసమితి(United Nation Organasation) ఉద్యోగులను అల్ ఖైదా ఉగ్రవాదులు(Al Qaeda Terrorists) కిడ్నాప్ చేశారు. యెమెన్‌(Yemen) అధికారులు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. కార్మికులను అపహరించి శుక్రవారం అర్థరాత్రి దక్షిణ ప్రావిన్స్ అబ్యాన్‌లోని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. వీరిలో నలుగురు యెమెన్‌లు, ఒక విదేశీ పౌరుడు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. మరోవైపు, వారిని సురక్షితంగా విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కిడ్నాప్‌కు సంబంధించి UN ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందించేందుకు నిరాకరించారు. అదే సమయంలో ఉద్యోగుల విడుదల కోసం కిడ్నాపర్లతో చర్చలు జరుపుతున్నామని దేశ గిరిజన నేతలు తెలిపారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వంచే జైలులో ఉన్న కొంతమంది ఉగ్రవాదులను విడుదల చేయాలని హైజాకర్లు డిమాండ్ చేశారని వారు అన్నారు.

UN భద్రత రక్షణ శాఖ సిబ్బందిని గుర్తుతెలియని సాయుధ వ్యక్తులు అపహరించినట్లు యెమెన్ ప్రభుత్వం ధృవీకరించింది. యెమెన్‌ను హౌతీ తిరుగుబాటుదారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు, దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభుత్వం అధికారంలో లేదు. హౌతీలు దేశంలోని అనేక ప్రాంతాలను ఆక్రమించారు. దీని కారణంగా అనేక ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా ఇక్కడ తమ పాదాలను విస్తరించాయి. ప్రజలను కిడ్నాప్ చేస్తూ నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

యెమెన్‌లో సౌదీ నేతృత్వంలోని మిలటరీ కూటమి 2015 నుంచి ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులతో యుద్ధం చేస్తోంది. 2015లో యెమెన్‌లో జరుగుతున్న యుద్ధంలో ఈ కూటమి జోక్యం చేసుకుంది. అప్పుడు హౌతీలు రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించారు. ఈ యుద్ధంలో వేలాది మంది మరణించారు. లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. దీని కారణంగా యెమెన్‌లో పెద్ద మానవతా విపత్తు ఏర్పడింది. ప్రజలకు తినడానికి డబ్బు లేదు, ఉపాధి లేదు. వారు ఇతర దేశాలలో ఆశ్రయం పొందవలసి ఉంటుంది. ఇలాంటి దీనస్థితిని అనుభవిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొంది.