AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి, 23 మందికి గాయాలు

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ప్రయాణిస్తున్నట్లు మేరీల్యాండ్ స్టేట్ పోలీసులు తెలిపారు. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఉదయం 6 గంటలకు హార్ఫోర్డ్ కౌంటీలోని I-95లో అదుపు తప్పి గార్డ్‌రైల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన డ్రైవర్‌తో పాటు మరో 22 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు.

నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి, 23 మందికి గాయాలు
Maryland Bus Crash
Surya Kala
|

Updated on: May 06, 2024 | 11:13 AM

Share

అమెరికాలోని నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇంటర్‌స్టేట్ 95లో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో మరో 23 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ప్రయాణిస్తున్నట్లు మేరీల్యాండ్ స్టేట్ పోలీసులు తెలిపారు. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఉదయం 6 గంటలకు హార్ఫోర్డ్ కౌంటీలోని I-95లో అదుపు తప్పి గార్డ్‌రైల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన డ్రైవర్‌తో పాటు మరో 22 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు.

విచారణ కోసం రహదారి మూసివేత

విచారణ కోసం I-95 నార్త్‌బౌండ్ లేన్‌లు మూసివేశారు. అయితే కొంత సేపటి తర్వాత తిరిగి తెరవబడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని పేర్కొన్నారు. మేరీల్యాండ్ స్టేట్ పోలీస్ క్రాష్ టీమ్ విచారణకు నాయకత్వం వహిస్తోంది. బస్సు ఎక్కచి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతోంది అనే అంశాలతో పాటు ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాల్టిమోర్‌కు ఉత్తరాన దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో హార్‌ఫోర్డ్ కౌంటీ ఉంది.

ఏప్రిల్ 27న ముగ్గురు మహిళల మరణం

అమెరికాలో వరుసగా భారతీయులు వివిధ కారణాలతో మరణిస్తూనే ఉన్నారు. ఏప్రిల్ 27న అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు భారతీయ మహిళలు మరణించారు. సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురు మహిళలు గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందినవారు. మృతులను రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్‌గా గుర్తించారు. ముగ్గురు మహిళలు ఎస్‌యూవీలో అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
"పేదవారితో ఇళ్లు వేయించి కబ్జా చేస్తున్న వారిని పట్టుకోరా?:"
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!