ఇరాన్ యుద్దానికి వ్యతిరేకంగా రాజీనామా.. అమెరికా అధికారిపై దేశ ద్రోహం కేసు.. ట్రంప్ సర్కార్ విచారణ..!
ఇరాన్ యుద్ధానికి నిరసనగా రాజీనామా చేయడం, అమెరికా అధికారి జోసెఫ్ అలియాస్ జో కెంట్ మరింత చిక్కుల్లో పడ్డారు. ఉగ్రవాద నిరోధక విభాగం మాజీ అధిపతి అయిన జో కెంట్పై ట్రంప్ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. గూఢచార సమాచారాన్ని లీక్ చేశారన్న ఆరోపణలు ఆయనపై మోపింది ట్రంప్ సర్కార్. అమెరికాలో దీనిని దేశద్రోహంగా పరిగణిస్తారు.

ఇరాన్ యుద్ధానికి నిరసనగా రాజీనామా చేయడం, అమెరికా అధికారి జోసెఫ్ అలియాస్ జో కెంట్ మరింత చిక్కుల్లో పడ్డారు. ఉగ్రవాద నిరోధక విభాగం మాజీ అధిపతి అయిన జో కెంట్పై ట్రంప్ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. గూఢచార సమాచారాన్ని లీక్ చేశారన్న ఆరోపణలు ఆయనపై మోపింది ట్రంప్ సర్కార్. అమెరికాలో దీనిని దేశద్రోహంగా పరిగణిస్తారు. ఈ విచారణ అనంతరం, జోను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈలోగా, కెంట్ తన కొత్త వాదనతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.
ప్రముఖ యూట్యూబర్ టర్కర్ కార్ల్సన్తో ఒక ఇంటర్వ్యూలో, 2025 వరకు ఇరాన్ వద్ద అణ్వాయుధాలు కలిగిన యురేనియం లేదని జో కెంట్ పేర్కొన్నారు. 2004 నుండి ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి ఎటువంటి ముఖ్యమైన ప్రయత్నాలు చేయలేదన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. అయితే తాజాగా ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం సిఫార్సు ఆధారంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) జో కెంట్పై దర్యాప్తు ప్రారంభించింది. యుద్ధ సమయంలో అమెరికా భద్రతకు కీలకమైన గూఢచార సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలను జో కెంట్ ఎదుర్కొంటున్నారు.
యునైటెడ్ స్టేట్స్లో గూఢచార సమాచారాన్ని లీక్ చేయడం ఒక తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై యూఎస్ గూఢచర్య చట్టం (1917) కింద విచారణ జరుపుతారు. నేరం రుజువైతే, వారికి 10-20 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు. చాలా సందర్భాలలో, యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించవచ్చు.
కెంట్ ఏ సమాచారాన్ని లీక్ చేశాడు?
- జో కెంట్ రాజీనామా చేస్తూ యూఎస్ ప్రెసిడెంట్కు రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. “ఒకవేళ ఇరాన్పై దాడి చేయకపోతే, అది అమెరికాపై దాడి చేస్తుందని చెప్పడం తప్పు. ప్రస్తుతం ఇరాన్ వల్ల అమెరికాకు ఎలాంటి ముప్పు లేదు. ఈ యుద్ధం తప్పు, ఈ యుద్ధం నేపథ్యంలో నేను నైతిక కారణాలతో రాజీనామా చేస్తున్నాను.” అని పేర్కొన్నారు
- “ఈ యుద్ధం అమెరికా యుద్ధం కాదు. ఇది ఇజ్రాయెల్ , దాని పలుకుబడిగల లాబీ ఒత్తిడితో ప్రారంభించినది. అయితే అమెరికా నష్టాలను చవిచూస్తుంది. నిజం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.” అంటూ కెంట్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
- 2004లో ఫత్వా జారీ అయినప్పటి నుండి ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడం లేదని కెంట్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని, అవి ప్రపంచానికి ముప్పు కలిగించగలవని చెప్పడం అబద్ధమన్నారు.
- ట్రంప్ విదేశాంగ విధానాన్ని కూడా కెంట్ ప్రశ్నించారు. ఆ విధానం 2016లో ప్రారంభమై 2024లో ప్రచారం చేసిన, ఇరాన్ యుద్ధంతో ముగిసిందని ఆయన వాదించారు. కెంట్ MAGA (మేక్ అమెరికా గ్రేట్) ప్రచారాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
