AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్-ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధానికి సిద్ధం.. పాక్ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న పాకిస్తాన్‌లో ఆందోళనను మరింత పెంచింది. ఢిల్లీ ఉగ్రవాద దాడి తర్వాత, ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు సంభవించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా మరోసారి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. రెండవ రౌండ్‌లో కూడా ఆయన మాకు సహాయం చేస్తాడు అంటూ ఖవాజా హెచ్చరించారు.

భారత్-ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధానికి సిద్ధం.. పాక్ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు
Pakistan Defence Minister Khawaja
Balaraju Goud
|

Updated on: Nov 13, 2025 | 4:32 PM

Share

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న పాకిస్తాన్‌లో ఆందోళనను మరింత పెంచింది. ఢిల్లీ ఉగ్రవాద దాడి తర్వాత, ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు సంభవించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా మరోసారి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఇస్లామాబాద్ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ప్రకటించినప్పటికీ, ఇద్దరు నాయకులు భారతదేశంపై దృష్టి సారించారు.

ఢిల్లీ ఉగ్రదాడి గురించి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “నిన్నటి వరకు ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు. ఇప్పుడు దీనిని విదేశీ కుట్రగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు” అని అన్నారు. భారతదేశం ఎప్పుడైనా పాకిస్తాన్‌ను నిందించవచ్చాలని చూస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే భారతదేశాన్ని మరోసారి బెదిరించేందుకు ప్రయత్నించారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. “పాకిస్తాన్ రెండు వైపులా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. తూర్పు-పశ్చిమ సరిహద్దులలో రెండు వైపులా పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాము. మొదటి రౌండ్‌లో అల్లాహ్ మాకు సహాయం చేశాడు. రెండవ రౌండ్‌లో కూడా ఆయన మాకు సహాయం చేస్తాడు.” అంటూ ఖవాజా హెచ్చరించారు.

పాకిస్తాన్ తన తూర్పు సరిహద్దును భారతదేశంతో పంచుకుంటుంది. పశ్చిమ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్‌తో ఉంది. దీనిపై రక్షణ మంత్రి ఖాళీ బెదిరింపులు జారీ చేస్తున్నారు. అయితే, పాకిస్తాన్ ఆందోళన సమర్థనీయమే. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత , భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దోషులను వదిలిపెట్టబోమని ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపారు. దీని తర్వాత, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఇంతలో, ఢిల్లీ బాంబు దాడుల తర్వాత, దోషులు ఎవరైనా తప్పించుకోబోరని ప్రధానమంత్రి మోదీ భూటాన్ నుండి ప్రపంచానికి సందేశం పంపారు.

ఇలాంటి పరిస్థితిలో, భారతదేశం తదుపరి ఏమి చేయవచ్చో పాకిస్తాన్ ఇప్పటికే గ్రహించింది. ఆపరేషన్ సిందూర్ చేసిన గాయాలను పాకిస్తాన్ ఇంకా మరచిపోలేదు. కాబట్టి ఈ సంఘటన పాకిస్తాన్ నేల నుండి మళ్ళీ జరిగితే, అది ఇబ్బందుల్లో పడుతుంది. ఈ మొత్తం వాతావరణంలో, ఆపరేషన్ సిందూర్ భయంకరమైన దృశ్యాలను పాకిస్తాన్ గుర్తుంచుకుని ఉండాలి. అందుకే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు పాకిస్తాన్ నాయకులు.

ఆఫ్ఘనిస్తాన్ గురించి, ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో వార్నింగ్ ఇచ్చారు. “కాబూల్‌లోని ప్రభుత్వం పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని ఆపగలదు. కానీ ఈ యుద్ధాన్ని ఇస్లామాబాద్‌ దాకా తీసుకువచ్చారు. దీనికి పాకిస్తాన్‌కు ప్రతిస్పందించడానికి పూర్తి సిద్ధంగా ఉంది.” అని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఈ రకంగా ఆఫ్ఘనిస్తాన్‌ను బెదిరిస్తూనే ఉంది. అమెరికాపై దాడులు చేయడానికి ఆఫ్ఘన్ మట్టిని ఉపయోగిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.

అయితే, TTP ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వానికి తన స్థానాన్ని వెల్లడిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో, ఒక TTP సభ్యుడు పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వాన్ని క్రూరంగా అభివర్ణించాడు. ముజాహిదీన్‌లపై యుద్ధం చేసే సామర్థ్యం వారికి లేదని పేర్కొన్నాడు. TTP సభ్యుడు పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం పతనం దగ్గరలోనే ఉందంటూ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో, TTP సభ్యులు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్నారని తెలిపారు. ఈ ప్రకటన పాకిస్తాన్ నిఘా సంస్థలను నేరుగా సవాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..