Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

67 మంది ప్రయాణికులతో నింగిలో విమానం.. హెలికాప్టర్‌ ఢీ.. ఆ భయానక దృశ్యాలు చూస్తే..

ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 67 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు అమెరికా ప్రకటించింది. మానవ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం అనంతరం విమాన శకలాలు పోటోమాక్ నదిలో పడిపోవడంతో మరణాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదంగా చెబుతున్నారు.

67 మంది ప్రయాణికులతో నింగిలో విమానం.. హెలికాప్టర్‌ ఢీ.. ఆ భయానక దృశ్యాలు చూస్తే..
US Plane Crash
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 30, 2025 | 8:03 PM

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యుఎస్‌లోని వాషింగ్టన్ డిసిలో పోటోమాక్ నదిలో విమానం కూలిపోయింది. రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే క్రమంలో హెలికాప్టర్‌ను ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 67 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు అమెరికా ప్రకటించింది. మానవ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం అనంతరం విమాన శకలాలు పోటోమాక్ నదిలో పడిపోవడంతో మరణాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదంగా చెబుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 5342 DC విమానాశ్రయం సమీపంలో బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిందని సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వీడియోలో రెండు విమానాలు ప్రకాశవంతమైన మంటలతో ఢీకొన్నట్లు చూపిస్తుంది.

ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయ కార్యక్రమాలను అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇది కూడా చదవండి: పులి మూత్రం అమ్ముతున్న జూ నిర్వాహకులు.. ఒక్క సీసా ఎంతో తెలుసా..?

ఇది కూడా చదవండి: అంతా మనదే.. ఉద్యోగులకు ఏకంగా రూ. 70 కోట్ల బోనస్.. కానీ ఒక్క కండీషన్

ఇది కూడా చదవండి: బీచ్‌లో వాకింగ్‌ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం..అదేదో చెత్తాచెదారం అనుకుంటే.. 66 మిలియన్ల..!