షాకింగ్ : అప్పుడే OTTలోకి అజిత్ లేటెస్ట్ మూవీ..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా విదాముయర్చి. తెలుగులో పట్టుదల పేరుతో రిలీజైంది. మేయిళ్ తిరుమేని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటించింది. అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. పోస్టర్స్, సాంగ్స్ , ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. అయితే ఆ తర్వాత క్రమంగా వసూళ్లు పడిపోయాయి. అయినా అజిత్ మేనియాతో సినిమాకు రూ. 130 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. ఇక అజిత్ నటన, యాక్షన్ సీక్వెన్స్లు హైలెట్ గా నిలిచాయి.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్కు రెడీ అయింది.ఎస్ ! థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన అజిత్ పట్టుదల మూవీ అప్పుడే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన 50 రోజులకు అంటే.. మార్చి ఆఖరి వారం లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే థియేట్రికల్ రన్ అనుకున్న విధంగా లేకపోవడంతో ముందుగానే ఈ సినిమా స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. మార్చిమొదటి వారంలోనే అజిత్ సినిమాను స్ట్రీమింగ్కు తీసుకొచ్చేందుకు నెట్ఫ్లిక్స్ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురా వొచ్చని ప్రచారం జరుగుతోంది.
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

