Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్‌ : అప్పుడే OTTలోకి అజిత్ లేటెస్ట్ మూవీ..!

షాకింగ్‌ : అప్పుడే OTTలోకి అజిత్ లేటెస్ట్ మూవీ..!

Samatha J

|

Updated on: Feb 23, 2025 | 7:12 AM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా విదాముయర్చి. తెలుగులో పట్టుదల పేరుతో రిలీజైంది. మేయిళ్ తిరుమేని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటించింది. అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. పోస్టర్స్, సాంగ్స్ , ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. అయితే ఆ తర్వాత క్రమంగా వసూళ్లు పడిపోయాయి. అయినా అజిత్ మేనియాతో సినిమాకు రూ. 130 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. ఇక అజిత్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు హైలెట్ గా నిలిచాయి.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.ఎస్ ! థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన అజిత్ పట్టుదల మూవీ అప్పుడే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన 50 రోజులకు అంటే.. మార్చి ఆఖరి వారం లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే థియేట్రికల్ రన్ అనుకున్న విధంగా లేకపోవడంతో ముందుగానే ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. మార్చిమొదటి వారంలోనే అజిత్ సినిమాను స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురా వొచ్చని ప్రచారం జరుగుతోంది.

Published on: Feb 23, 2025 07:12 AM