AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంద్రాగస్టున ఉగ్రదాడులకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర… ఆక్రమిత కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు..

భారత స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) నాడు ఉగ్రదాడులకు పాల్పడాలని పాక్ ఐఎస్ఐ కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అప్పుడే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ సంస్థ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.

పంద్రాగస్టున ఉగ్రదాడులకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర... ఆక్రమిత కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు..
Pakistan Isi Plan
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 02, 2021 | 12:19 PM

Share

భారత స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) నాడు ఉగ్రదాడులకు పాల్పడాలని పాక్ ఐఎస్ఐ కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అప్పుడే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ సంస్థ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. రహస్యంగా వాస్తవాదీనరేఖ ద్వారా జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడేందుకు 8 కొత్త రూట్లను గుర్తించినట్టు తెలిసింది. ఇందుకు వివిధ టెర్రరిస్టు బృందాల మధ్య జోరుగా సమావేశాలు జరుగుతున్నాయని, నిషిద్ధ జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, ఆల్-బదర్ తో బాటు ముజఫరాబాద్ లోని కొత్త బెలా బందీ అనే ఉగ్రవాద సంస్థ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నట్టు గూఢాఛార వర్గాలు వెల్లడించాయి. ఐఎస్ఐ గుర్తించిన ఎనిమిది రూట్లను ఈ వర్గాలు స్ఫష్టం చేశాయి.. సరిహద్దుల్లోకొత్తగా 27 టెర్రరిస్టు పాడ్లను ఈ సంస్థ యాక్టివేట్ చేసింది. ఈ నెల 15 కి ముందే ఈ రూట్ల ద్వారా కాశ్మీర్ లోకి చొరబడాలన్నది వీరి ప్లాన్ .

గత జూన్ నుంచే సుమారు 146 మంది ఉగ్రవాదులు వివిధ లాంచ్ పాడ్ల వద్ద మోహరించినట్టు సమాచారం. ఇదే సమయంలో జమ్మూ ప్రాంతంలో ఎగురుతున్న నాలుగు డ్రోన్ల వంటి వస్తువులను గుర్తించారు. ఈ నెల 1 వ తేదీ రాత్రి మూడు వస్తువుల తాలూకు వీడియోలను స్థానికులు తమ మొబైల్స్ లో చిత్రీకరించారు. ఈ సమాచారాన్ని భద్రతా దళాలకు తెలిపారు. అయితే సెక్యూరిటీ దళాలు సెర్చ్ చేసినా ఫలితం లేకపోయింది. ఈ కారణాల దృష్ట్యా మొత్తం జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: అస్సాం.. మిజోరాం మళ్ళీ ‘భాయీ-భాయీ’.. ఒకరిపై ఒకరు కేసుల ఉపసంహరణ.. కొలిక్కి వస్తున్న సరిహద్దు వివాదం

Tokyo Olympics 2020 Live: మూడుసార్లు ఒలింపిక్స్ విజేత ఆస్టేలియాను ఓడించి సెమిస్ లో అడుగు పెట్టిన భారత విమెన్ హాకీ టీమ్