AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ విధ్వంసం.. కొండచరియలు విరిగిపడి కూరుకుపోయిన గ్రామం.. 1000 మంది సజీవ సమాధి!

సూడాన్‌లోని డార్ఫర్ ప్రాంతంలో జరిగిన భారీ కొండచరియలు విరిగిపడటంతో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగాకొండచరియలు విరిగిపడి ఒక గ్రామం మొత్తం నాశనమైంది. మర్రా పర్వత ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం పూర్తిగా బురదలో కూరుకుపోయింది. స్థానిక సంఘాలు సహాయం కోసం ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి చేశాయి. ఇప్పటికే యుద్ధంతో బాధపడుతున్న సూడాన్‌లో ఈ విషాదం మరింత భయంకరంగా మారింది.

భారీ విధ్వంసం.. కొండచరియలు విరిగిపడి కూరుకుపోయిన గ్రామం.. 1000 మంది సజీవ సమాధి!
Sudan Landslides
Balaraju Goud
|

Updated on: Sep 02, 2025 | 8:26 AM

Share

ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తోంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ భూకంపంతో అతలాకుతలమైతే, మరోవైపు ఆఫ్రికన్ దేశమైన సూడాన్‌లో ప్రకృతి తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించింది. సూడాన్‌లో కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం సంభవించింది. సోమవారం (సెప్టెంబర్ 01), సుడాన్ కొండచరియలు విరిగిపడటం వల్ల కనీసం 1,000 మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలోని డార్ఫర్ ప్రాంతంలోని ఒక గ్రామం మొత్తం ధ్వంసమైంది. ఇక్కడ ఒక బిడ్డ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.

సూడాన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని సుడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్, ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. అబ్దేల్‌వాహిద్ మహ్మద్ నూర్ నేతృత్వంలోని బృందం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారీ వర్షాల కారణంగా ఈ కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపింది. ఆగస్టు 31న భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఒక గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పూర్తిగా బురదలో కూరుకుపోయింది. డార్ఫర్ ప్రాంతం ఉద్యమ సంఘం నియంత్రణలో ఉంది. ఈ బృందం ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సహాయ సంస్థల నుండి సహాయం కోరింది. ఈ కొండచరియలో పురుషులు, మహిళలు, పిల్లలు సహా వేలాది మంది మరణించారు.

మృతదేహాలను తొలగించడంలో సహాయం చేయమని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సహాయ సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు. సూడాన్‌లో ఇప్పటికే యుద్ధం జరుగుతోంది. యుద్ధం వల్ల తలెత్తే పరిస్థితులతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఆకలి ముప్పును ఎదుర్కొంటున్నారు. సూడాన్ సైన్యం, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ అంతర్యుద్ధం కారణంగా డార్ఫర్ ప్రాంతం ఇప్పటికే ప్రభావితమైంది. యుద్ధం వల్ల కలిగే నష్టాలను నివారించడానికి, ప్రజలు మర్రా పర్వత ప్రాంతంలో ఆశ్రయం పొందారు. కానీ ప్రకృతి ప్రకోపానికి ఆ ప్రాంతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని సుడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్ ఆర్మీ పేర్కొంది.

ఇదిలావుంటే, సూడాన్‌లో యుద్ధం రెండు సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ దేశ జనాభాలో సగానికి పైగా ఆకలితో అలమటిస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఉత్తర డార్ఫర్ రాజధాని అల్-ఫషీర్‌పై దాడుల పరంపర ఆగడం లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..