AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi in Singapore: భారత్‌లో పెట్టుబడులే లక్ష్యం.. ప్రధాని మోదీతో సింగపూర్ వ్యాపారవేత్తల భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్నారు. బుధవారం సింగపూర్ చేరుకున్న ఆయనకు అఖండ స్వాగతం లభించగా, గురువారం సింగపూర్ పార్లమెంట్‌లో కూడా ఘనస్వాగతం లభించింది.

PM Modi in Singapore: భారత్‌లో పెట్టుబడులే లక్ష్యం.. ప్రధాని మోదీతో సింగపూర్ వ్యాపారవేత్తల భేటీ
Pm Modi Mets Singapore Business Leader
Balaraju Goud
|

Updated on: Sep 05, 2024 | 4:09 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్నారు. బుధవారం సింగపూర్ చేరుకున్న ఆయనకు అఖండ స్వాగతం లభించగా, గురువారం సింగపూర్ పార్లమెంట్‌లో కూడా ఘనస్వాగతం లభించింది. అంతకుముందు ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటించారు. ఇక, రెండో రోజు సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌తో ప్రధాని మోదీ ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ఆ తర్వాత సింగపూర్ పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, ఇతర ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమయంలో, సెమీకండక్టర్లకు సంబంధించిన ప్రధాన ఒప్పందంతో సహా రెండు దేశాల మధ్య అనేక ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. డిజిటల్ టెక్నాలజీ, హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాల్లో భారత్, సింగపూర్ మధ్య ఒప్పందాలు కూడా కుదిరాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, లారెన్స్ వాంగ్ నాయకత్వంలో సింగపూర్ మరింత వేగంగా పురోగమిస్తుందని కొనియాడారు. సింగపూర్ ఒక దేశం మాత్రమే కాదు, అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశానికి సింగపూర్ స్ఫూర్తి. భారతదేశంలో కూడా అనేక సింగపూర్‌లను సృష్టించాలనుకుంటున్నామన్నారు ప్రధాని మోదీ. ఈ దిశలో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

భారతదేశం-సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాల 60వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ పర్యటన జరుగుతోంది, ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ సింగపూర్‌లోని వ్యాపారవేత్తలు, పెద్ద కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. దక్షిణ చైనా సముద్రం, మయన్మార్‌ వంటి ప్రాంతీయ అంశాలపై చర్చించారు. సింగపూర్ ASEAN దేశాలలో భారతదేశం అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ప్రపంచంలో భారతదేశం ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. సింగపూర్ భారతదేశానికి ఎఫ్‌డిఐకి ప్రధాన వనరుగా ఉంది. సెమీకండక్టర్ రంగంలో 20 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది.

భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ నిబద్ధతను తెలియజేసేందుకు అనేక ప్రముఖ సింగపూర్ కంపెనీలకు చెందిన టాప్ సీఈవోలు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బ్లాక్‌స్టోన్ సింగపూర్, టెమాసెక్ హోల్డింగ్స్, సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, క్యాపిటా ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్, ST టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మరియు ఇతర ప్రముఖ కంపెనీలకు చెందిన నాయకులు ఉన్నారు. చర్చల సందర్భంగా, తమ ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి, భారతదేశంలోని విభిన్న రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి తమ నిబద్ధతను స్పష్టం చేశారు. ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా భారతదేశంను ఎంచుకుంటున్నట్లు అయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక వృద్ధిని పెంచడానికి చేపట్టిన వ్యూహాత్మక కార్యక్రమాలపై చర్చించారు.

ఈ హై-ప్రొఫైల్ సింగపూర్ సంస్థల నిబద్ధత భారతదేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని భావిస్తున్నారు. పెట్టుబడి రంగాలలో మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ నుండి డేటా సెంటర్లు, విమానయానం వరకు అనేక రకాల రంగాల ప్రతినిధులతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు.

వీడియో చూడండి…

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..