పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్ను కూల్చివేసిన ఆఫ్ఘనిస్థాన్.. షాకింగ్ వీడియో వైరల్.. నిజమెంతా?
పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆఫ్ఘన్ మీడియా సంస్థ టోలో న్యూస్ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ఆఫ్ఘన్ దళాలు తమ గగనతలాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్ను కూల్చివేశాయని పేర్కొంది. విమానం కాలిపోతున్న శిథిలాల వీడియోలు ప్రసారం చేసింది.

పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆఫ్ఘన్ మీడియా సంస్థ టోలో న్యూస్ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ఆఫ్ఘన్ దళాలు తమ గగనతలాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్ను కూల్చివేశాయని పేర్కొంది. విమానం కాలిపోతున్న శిథిలాల వీడియోలు ప్రసారం చేసింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఒక వీడియోలో ఒక పాకిస్తానీ సైనికుడిని పట్టుకున్నట్లు కూడా ఉంది. శుక్రవారం (ఫిబ్రవరి 27) తెల్లవారుజామున, కాబూల్, కాందహార్, పాక్టికాలో పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడులు రెండు ఆఫ్ఘన్ ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేశాయని పాకిస్తాన్ భద్రతా అధికారులు పేర్కొన్నారు. కాబూల్లో కనీసం మూడు పెద్ద పేలుళ్లు సంభవించాయి. ఇది స్థానిక నివాసితులలో భయాందోళనలకు కారణమైంది.
🚨 BIG BREAKING NEWS💥
This is a Pakistani military F-16, American-made, that Afghan defensive forces have shot down. pic.twitter.com/7qBAjv89rk
— Afghanistan Defense (@AFGDefense) February 27, 2026
ఇటీవల పాకిస్తాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ చర్యను అభివర్ణించింది. ఆఫ్ఘన్ సైన్యం 19 పాకిస్తానీ పోస్టులను, రెండు సైనిక స్థావరాలను ధ్వంసం చేసిందని ఆఫ్ఘన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. రెండు దేశాల సరిహద్దు ఘర్షణలో 55 మంది పాకిస్తానీ సైనికులు మరణించారని, అనేక మంది సజీవంగా పట్టుబడ్డారని ప్రకటించారు. డ్యూరాండ్ లైన్ సమీపంలోని ప్రాంతాలలో ఆఫ్ఘనిస్తాన్ పెద్ద ఎత్తున దాడి ఆపరేషన్ ప్రారంభించిందని జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు.
Afghans celebrate after a Pakistani fighter plane was shot down.#Pakistan #Afghanistan pic.twitter.com/t3pbSoGMcO
— mr. ᴩᴀᴛʜᴀᴋ (@mr_pathakshiv) February 27, 2026
పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ ఆఫ్ఘనిస్తాన్ వాదనలను తోసిపుచ్చారు. తమ సైనికులలో ఇద్దరు మాత్రమే అమరవీరులయ్యారని అన్నారు. పాకిస్తాన్ ప్రతీకార దాడుల్లో 133 మంది ఆఫ్ఘన్ యోధులు మరణించారని, 200 మందికి పైగా గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి రెచ్చగొట్టని ఆఫ్ఘన్ దాడులనైనా తాము గట్టిగా ప్రతీకారం తీర్చుకున్నామని పాకిస్తాన్ హెచ్చరిస్తోంది.
ఇదిలావుంటే, టోర్ఖామ్ సరిహద్దు సమీపంలోని ఆఫ్ఘన్ శరణార్థి శిబిరాన్ని క్షిపణి ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళలు, పిల్లలు సహా 13 మంది పౌరులు గాయపడ్డారు. మరోవైపు, పౌరుల భద్రతను నిర్ధారించాలని, దౌత్యం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ రెండు దేశాలను కోరారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
