AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: యావత్‌ దేశాన్ని వణికించిన కుండపోత వర్షాలు, భారీ వరద.. 115 మంది మృతదేహాలు లభ్యం..

ఇప్పటి వరకు115 మంది మృతదేహాలను వెలికి తీశామని, ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు తెలిపారు. ఇంకా వందలాది మంది కనిపించకుండా పోయారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు కొనసాగిస్తు్న్నాయని చెప్పారు. కాగా 2022లో ఆ దేశంలో వచ్చిన వరదలకు 14 లక్షల మంది నిరాశ్రయులు కాగా, 600 మంది చనిపోయారు.

Watch: యావత్‌ దేశాన్ని వణికించిన కుండపోత వర్షాలు, భారీ వరద.. 115 మంది మృతదేహాలు లభ్యం..
Nigeria Floods
Jyothi Gadda
|

Updated on: May 31, 2025 | 8:36 AM

Share

ఆఫ్రికా దేశమైన నైజీరియాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. నైజీరియాలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మిగిలయ్యారు. కాగా, వందలాది మంది వరదల్లో కొట్టుకుపోయారు. నైజర్ రాష్ట్రంలోని నైజర్ నది ఒడ్డున ఉన్న మోక్వా పట్టణంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు115 మంది మృతదేహాలను వెలికి తీశామని, ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు తెలిపారు. ఇంకా వందలాది మంది కనిపించకుండా పోయారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు కొనసాగిస్తు్న్నాయని చెప్పారు. కాగా 2022లో ఆ దేశంలో వచ్చిన వరదలకు 14 లక్షల మంది నిరాశ్రయులు కాగా, 600 మంది చనిపోయారు.

వీడియో ఇక్కడ చూడండి..

గత సెప్టెంబరులో ఇలాంటి సంఘటనే జరిగింది. ఈశాన్య నైజీరియాలోని మైదుగురిలో కుండపోత వర్షాలు కురవడంతో పలు చోట్ల ఇళ్లు, వంతెనలు, ఆనకట్టలు కూలిపోవడం సంభవించింది. అప్పుడు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. బాధితులకు సాయం చేసేందుకు పోలీసులు, సైన్యం రంగంలోకి దిగారు. జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ (NEMA) దీనిని జాతీయ విపత్తుగా గుర్తించాలని అక్కడి ప్రభుత్వం కోరుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..