నేపాల్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురుతెన్నులు

ఇండియా పొరుగునున్న నేపాల్ లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. హాస్పిటల్స్ అన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. తమను వెంటనే ఆదుకోవాలని ప్రధాని కె.పి.శర్మ ఓలి ప్రపంచ దేశాలను కోరుతున్నారు.

నేపాల్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురుతెన్నులు
Covid Cases Increase In Nepal
Follow us

| Edited By: Phani CH

Updated on: May 06, 2021 | 6:02 PM

ఇండియా పొరుగునున్న నేపాల్ లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. హాస్పిటల్స్ అన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. తమను వెంటనే ఆదుకోవాలని ప్రధాని కె.పి.శర్మ ఓలి ప్రపంచ దేశాలను కోరుతున్నారు. ప్రతి లక్ష మందికి రోజువారీగా 20 కేసులు నమోదవుతున్నాయని గురువారం ఒక్కరోజే సుమారు 8 వేల కేసులు నమోదయ్యాయని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది. ఇటీవల 44 శాతం కోవిడ్ టెస్టులు పాజిటివ్ గా తేలాయని ఈ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ నేత్ర ప్రసాద్ టిమ్ సినా తెలిపారు. పొరుగునున్న ఇండియాలో ఉన్న పరిస్థితిని చూసే తాము ఆందోళన చెందుతున్నామని, ఇప్పడు తమ దేశంలో కూడా దాదాపు అలాంటి పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. గత రెండో వారం నుంచి ఇక్కడ కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. కేవలం రెండు వారాల్లో ప్రతి లక్ష మందికి రోజువారీ కేసులు ఏడు రెట్లు పెరిగాయి. ఇండియాతో పోల్చినప్పుడు తమ దేశంలో పరిస్థితి మరీ అంత అధ్వాన్నం కాకపోయినా ఇది కోవిద్ సంక్షోభం వైపు అడుగులు వేస్తోందని అంటున్నారు. ఇక్కడ హెల్త్ కేర్ సిస్టం కూడా అంతంత మాత్రంగానే ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్దగా లేదు. పబ్లిక్ ఈవెంట్స్, ఫెస్టివల్స్, పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలమీద ఆంక్షలు లేవు. బహుశా ఇది కూడా కేసుల సంఖ్య పెరగడానికి దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు.

రోజురోజుకీ పరిస్థితి దారుణంగా మారుతోందని, ముందు ముందు ఇది చెయ్యి దాటిపోవచ్చునని నేపాల్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి సమీర్ అధికారి అన్నారు. ఈ దేశంలో ఎంటర్ కావడానికిపాస్ పోర్టులు గానీ ఐడీ కార్డులు గానీ అవసరం లేదని, ఇక్కడ భారతీయులు తమ వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటున్నారని, అలాగే ఇండియాలో కూడా నేపాలీలు బిజినెస్ వంటి కార్యకలాపాల్లో ఉన్నారని ఆయన చెప్పారు. ఏప్రిల్ 10 న నేపాల్ లోని భక్తాపూర్ లో జరిగిన పెద్ద జాతరకు లక్షలాది భక్తులు హాజరయ్యారు. కోవిడ్ ఆంక్షల ఊసేలేదు. కాగా గత నెల ఒక్కరోజే ఖాట్మండులో సుమారు 5 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ రాజధానిలో రెండు వారాలు లాక్ డౌన్ విధించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: కరోనా భయం.. విటమిన్ ట్యాబ్లెట్లకు పెరిగిన డిమాండ్.. పండ్లు, కూరగాయలే బెస్ట్..

CM YS Jagan: కోవిడ్‌ పేషెంట్లకు పూర్తి ఉచిత వైద్య సేవలు.. అసవరమైన బెడ్లను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం

ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్