China Drought: చైనాలో విలయతాండవం చేస్తున్న కరువు.. కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు..

China Drought: గతంలో ఎన్నడూ లేని విధంగా చైనాలో కరువు విలయతాండవం చేస్తోంది. చైనాలోని మూడో అతిపెదద్ ప్రావిన్స్‌ సిచువాన్‌లో ప్రవహించే యాంగ్జీ నదిలో నీరు అడుగంటిపోయింది. సిచువాన్‌లో గతంలో ఎన్నడూ...

China Drought: చైనాలో విలయతాండవం చేస్తున్న కరువు.. కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు..
China Drought
Follow us

|

Updated on: Aug 20, 2022 | 6:50 AM

China Drought: గతంలో ఎన్నడూ లేని విధంగా చైనాలో కరువు విలయతాండవం చేస్తోంది. చైనాలోని మూడో అతిపెదద్ ప్రావిన్స్‌ సిచువాన్‌లో ప్రవహించే యాంగ్జీ నదిలో నీరు అడుగంటిపోయింది. సిచువాన్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరితిపోయాయి. దాదాపు 61 ఏళ్ల తర్వాత అతి తక్కువ వర్షపాతం నమోదుకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఎక్కడ చూసినా నీటి నిల్వలు పూర్తిగా పడిపోయాయి. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని 51 నదులు, 24 రిజర్వాయర్లు పూర్తిగా అడుగంటాయి.

యాంగ్జీ నదిలో నీటి స్థాయిలు పూర్తిగా తగ్గడంతో జలరవాణాను సైతం నిలిపివేశారు. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. అక్కడి ప్రజలు తాగు నీరు లభించక అల్లాడిపోతున్నారు. సిచువాన్‌ ప్రావిన్స్‌లో 80 శాతం విద్యుత్‌ అవసరాలు తీర్చేది యాంగ్జీ నదిలో జనరేట్‌ అయ్యే విద్యుతే. అయితే హైడ్రో పవర్‌ జనరేషన్‌కు అవకాశం లేకపోవడంతో విద్యుత్‌ సంక్షోభం కూడా ముంచుకొస్తుంది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు..

తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో చైనా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కృత్రిమంగా వర్షాలు కురిపించే దిశగా అడుగులు వేస్తున్నారు. యాంగ్జీ నది ప్రవహించే పరిసర ప్రాంతాల్లో క్లౌడ్‌ సీడింగ్ ప్రారంభించారు. ఈ విధానం ద్వారా కొన్ని ప్రత్యేక విమానాలతో మేఘాల్లోకి సిల్వర్‌ అయోడిన్‌ను వదులుతారు. దీంతో ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుంది. సిచువాన్‌తో పాతు హుబే ప్రావిన్స్‌లోనూ ఈ విధానాన్ని చేపట్టేందుకు అధికారులు పూనుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??