AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కోటీశ్వరుడి కావడానికి 21ఏళ్లుగా అన్నం మాత్రమే తింటున్న వ్యక్తి.. ఎక్కడంటే

జపాన్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి చాలా డబ్బు సంపాదించాలని.. వీలైనంత త్వరగా లక్షాధికారి కావాలని కోరుకున్నాడు. అందుకోసం తాను తినే ఆహారం, పానీయాల విషయంలో కూడా రాజీ పడ్డాడు. అయితే ఆ జపనీస్ వ్యక్తి పేరు వెల్లడించలేదు.. అతని వయస్సు దాదాపు 45 సంవత్సరాలని.. అతను ముందుగా ఉద్యోగ విరమణ చేయడానికి డబ్బును ఓ రేంజ్ లో ఆదా చేస్తున్నాడు.

Viral News: కోటీశ్వరుడి కావడానికి 21ఏళ్లుగా అన్నం మాత్రమే తింటున్న వ్యక్తి.. ఎక్కడంటే
Miserable JapanImage Credit source: unsplash
Surya Kala
|

Updated on: Jul 25, 2024 | 5:53 PM

Share

సాధారణంగా ప్రజలు డబ్బు సంపాదించి తద్వారా తమ జీవితం సుఖంగా సాగాలను కోరుకుంటారు. అయితే కొంతమంది మాత్రం డబ్బు సంపాదించాలనే తపనతోనే ఉంటారు. దీని కోసం వారు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాడు. వాస్తవానికి జపాన్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి చాలా డబ్బు సంపాదించాలని.. వీలైనంత త్వరగా లక్షాధికారి కావాలని కోరుకున్నాడు. అందుకోసం తాను తినే ఆహారం, పానీయాల విషయంలో కూడా రాజీ పడ్డాడు.

అయితే ఆ జపనీస్ వ్యక్తి పేరు వెల్లడించలేదు.. అతని వయస్సు దాదాపు 45 సంవత్సరాలని.. అతను ముందుగా ఉద్యోగ విరమణ చేయడానికి డబ్బును ఓ రేంజ్ లో ఆదా చేస్తున్నాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆ వ్యక్తి 2000ల ప్రారంభంలో స్థిరమైన ఉద్యోగాన్ని ఎంతో కష్టం మీద సంపాదించుకున్నాడు. దీంతో అతను డబ్బులు ఎలాగైనా దాచాలని భావించాడు. అప్పుడు తన పొదుపు వ్యూహాన్ని ప్రారంభించాడు. అతను పని చేస్తున్న కంపెనీ తన ఉద్యోగులపై మరింత ఎక్కువ పని చేయాలని ఒత్తిడి తెచ్చింది. భవిష్యత్తులో సంతోషంగా ఉండాలంటే కష్టపడి పనిచేయడం, ఓవర్‌టైమ్‌ ద్వారానే సాధించవచ్చని కంపెనీ తెలిపింది.

20 ఏళ్లుగా కంపెనీ హాస్టల్‌లో ఉంటున్న ఉద్యోగి

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం ఆ వ్యక్తి వార్షిక జీతం దాదాపు 5 మిలియన్ యెన్లు అంటే దాదాపు రూ. 27 లక్షల 20 వేలు. అతను వీలైనంత త్వరగా 100 మిలియన్ యెన్‌లను ఆదా చేసి ముందస్తు రిటైర్‌మెంట్ తీసుకోవడానికి వ్యూహాన్ని రూపొందించాడు. అతను తన ఆహార పదార్థాలను తినే విషయంలో కూడా పొదుపు చేయడం ప్రారంభించాడు. అతను ఉచితంగా లభించే ఒక గిన్నె అన్నం, కొన్ని సాల్టెడ్ కూరగాయలు, ఎనర్జీ డ్రింక్ తాగేవాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతను 20 సంవత్సరాలకు పైగా తన కంపెనీ హాస్టల్‌లో నివసిస్తున్నాడు. ఈ సమయంలో అతను ప్రతి నెల 30 వేల యెన్‌లు అంటే సుమారు 16 వేల రూపాయలు అద్దెగా చెల్లించాడు. ఫర్నిచర్, సామగ్రి కోసం డబ్బును స్వయంగా సేకరించాడు.

7 కోట్లు ఆదా అయింది

కొన్నిసార్లు రాత్రి భోజనానికి బిస్కెట్లు మాత్రమే తిని కోలా తాగేవాడు. కొన్నిసార్లు ఎనర్జీ డ్రింక్ తాగి నిద్రపోయేవాడు. చాలా సార్లు వేసవి రోజులలో అతను తన సహోద్యోగి కారు విండ్‌స్క్రీన్‌పై ఏదో వండుకుని తినేవాడు. అదే కంపెనీలో 20 ఏళ్ల 10 నెలలు పనిచేసిన తర్వాత తాను 135 మిలియన్ యెన్లు అంటే రూ.7 కోట్లకు పైగా ఆదా చేసినట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడని నివేదిక పేర్కొంది. ఈ వింత పొడుపు ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశమైంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్