AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ తాగుబోతు చేష్టలు..! తప్పతాగి పట్టాలపై పడుకున్నాడు.. మీద నుంచి దూసుకెళ్లిన రైలు..షాకింగ్ వీడియో వైరల్‌..

ఓ తాగుబోతు ఫుల్లుగా తాగేసి రైలు పట్టాలపై పడుకున్నాడు. అయితే, అతని పై నుంచి రైలు వేగంగా దూసుకెళ్లింది.. ఇక అతడు కన్ఫామ్‌గా చనిపోయి ఉంటాడని భయపడిపోయిన లోకో పైలట్‌ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ కనిపించిన సీన్‌ చూసి కంగుతిన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

వార్నీ తాగుబోతు చేష్టలు..! తప్పతాగి పట్టాలపై పడుకున్నాడు.. మీద నుంచి దూసుకెళ్లిన రైలు..షాకింగ్ వీడియో వైరల్‌..
Drunk Man Sleeping On Railway Track
Jyothi Gadda
|

Updated on: Aug 08, 2024 | 9:27 PM

Share

మందుబాబుల వింత చేష్టలు మామూలుగా ఉండవు.. ఒక్కోక్కడిది ఒక్కో టాలెంట్‌.. మనల్నేవడ్రా అపేది అన్నట్టుగా ఎవరికైనా ఎదురుగా వెళ్తుంటారు. కాలనాగును కూడా కరకర నమిలేస్తుంటారు. తాగిన మైకంలో ఒకడు హై ఓల్టేజ్‌ టవర్‌ ఎక్కి నిద్రపోతే, మరొకడు.. ఫుల్లుగా తాగి రైల్వే ట్రాక్ పై పడుకున్నాడు. తాను ఎక్కడ పడుకున్నానో కూడా తెలియకుండా ఆ పట్టాలపైనే హాయిగా నిద్రపోయాడు. అయితే అదే సమయంలో ఓ ట్రైన్ అటు వైపు నుంచి దూసుకొచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ తాగుబోతు ఫుల్లుగా తాగేసి రైలు పట్టాలపై పడుకున్నాడు. అయితే, అతని పై నుంచి రైలు వేగంగా దూసుకెళ్లింది.. ఇక అతడు కన్ఫామ్‌గా చనిపోయి ఉంటాడని భయపడిపోయిన లోకో పైలట్‌ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ కనిపించిన సీన్‌ చూసి కంగుతిన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పట్టాలపై పడుకుని ఉండగా, మీద నుంచి రైలు దూసుకెళ్లింది.. కానీ అదృష్టవశాత్తు అతడు తప్పించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో బిజ్నోర్ నగరంలోని అడంపూర్ రైల్వే క్రాసింగ్ వద్ద ఒక వ్యక్తిని రైలు ఢీకొని ఉండవచ్చని లోకోపైలట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పట్టాలపై పడివున్న అతడు సురక్షితంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అతన్ని నిద్రలేపి ఆరా తీయగా, సదరు తాగుబోతు నేపాల్‌కు చెందిన అమర్ బహదూర్‌గా తెలిసింది. తాగిన మైకంలో అతడు రైలు పట్టాలపైనే నిద్రపోయినట్టుగా చెప్పాడు. రైలు మీద నుంచి వెళ్లినా అదృష్టవశాత్తూ అమర్ బహదూర్ బతికే ఉన్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే ఆ వ్యక్తి ట్రాక్‌పై నుంచి లేవడం వీడియోలో కనిపిస్తోంది. ముస్సోరీ ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లినా అతడికి ఎలాంటి గాయం కాకుండా సురక్షితంగా పైకి లేచాడు. ఆ తర్వాత బహదూర్‌ని నార్మల్‌ చెకప్‌ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌