AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35

ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 190 అణు వార్‌హెడ్లు ఉన్నాయి. వీటిలో 160 అణు వార్‌హెడ్లు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు ఆపరేషనల్ లాంచర్లతో పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 30 అణు వార్‌హెడ్లు కొత్త క్షిపణుల కోసం ప్రస్తుతం తయారీ దశలో ఉన్నాయి. భారత్ అణ్వాయుధ శక్తి క్రమంగా పెరుగుతోందని అమెరికా పరిశోధనా సంస్థ వెల్లడించింది. 'ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్' డైరెక్టర్ హాన్స్ క్రిస్టెన్సెన్ శాటిలైట్ ఫొటోలు, పబ్లిక్ డేటాను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చారు.   

భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
India May Have 190 Nuclear Warheads
Sharada V
|

Updated on: Sep 11, 2026 | 5:44 PM

Share

గాలి, నేల, సముద్రం – ఈ మూడు మార్గాల ద్వారా ఒకేసారి అణ్వాయుధాలను ప్రయోగించగల ‘న్యూక్లియర్ ట్రయాడ్’ వ్యవస్థలను భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తోందని హాన్స్ క్రిస్టెన్సెన్ అన్నారు. 2026 ప్రారంభం నాటికి భారత్ వద్ద సుమారు 730 కిలోల వెపన్- గ్రేడ్ ప్లుటోనియం ఉన్నట్లు అంచనా వేశారు. ఒక్కో వార్‌హెడ్‌కు 4 కిలోల ప్లుటోనియం అవసరం అనుకున్నా ఈ నిల్వలు 140 నుంచి 225 వార్‌హెడ్ల తయారీకి సరిపోతాయని తెలిపారు. అయితే భారత్ తన వద్ద ఉన్న ప్లుటోనియం మొత్తాన్ని ఆయుధాల తయారీకే వాడకపోవచ్చని, కొంత రిజర్వ్‌గా ఉంచుకునే అవకాశం ఉందని తెలిపారు.

భారత్ వద్ద ప్లుటోనియం నిల్వలు ఎంత?

2026 ప్రారంభం నాటికి భారత్ వద్ద సుమారు 730 కిలోల వెపన్-గ్రేడ్ ప్లుటోనియం ఉన్నట్లు అంచనా వేశారు. ఒక్కో వార్‌హెడ్‌ తయారీకి సుమారు 4 కిలోల ప్లుటోనియం అవసరమని భావిస్తే, ఈ నిల్వలు భవిష్యత్తులో 140 నుండి 225 అణు వార్‌హెడ్‌లను తయారు చేయడానికి సరిపోతాయి. అయితే, భారత్ తన వద్ద ఉన్న మొత్తం ప్లుటోనియాన్ని కేవలం ఆయుధాల తయారీకే పూర్తిగా ఉపయోగించకపోవచ్చని, భవిష్యత్తు అవసరాల కోసం కొంత భాగాన్ని రిజర్వ్‌గా ఉంచుకునే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు.

ఆయుధ సంపత్తిని క్రమంగా పెంచుకుంటున్నప్పటికీ, భారత్ తన ప్రాథమిక విదేశాంగ, రక్షణ విధానాలకు మాత్రం ఎప్పుడూ కట్టుబడి ఉంది. 1998లో నిర్వహించిన పోఖ్రాన్- అణుపరీక్షల తర్వాత భారత్ అధికారికంగా ‘నో ఫస్ట్ యూజ్’ (ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోం) సిద్ధాంతాన్ని ప్రకటించింది. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం శత్రు దేశాల దాడులను నిలువరించడానికి  మాత్రమే ఉపయోగపడతాయని భారత ప్రభుత్వం పార్లమెంటు వేదికగా అనేకసార్లు స్పష్టం చేసింది.  ప్రస్తుతం మరికొన్ని నూతన క్షిపణి వ్యవస్థలు వివిధ దశల్లో అభివృద్ధిలో ఉన్నందున, రాబోయే రోజుల్లో భారత్ అణ్వాయుధాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అణ్వాయుధాలు ఉన్న దేశాలు తొమ్మిది

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, యుద్ధ వాతావరణం కారణంగా ఇటీవలి కాలంలో చాలా దేశాలు తమ సైనిక సామర్థ్యాలను  బలోపేతం చేసుకుంటున్నాయి.  ప్రధాన అణు శక్తి దేశాలన్నీ తమ ఆయుధ సంపత్తిని, క్షిపణి వ్యవస్థలను ఆధునీకరించుకునే పనిలో నిమగ్నమయ్యాయి.  అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల జాబితాలో అమెరికా, రష్యా  తొలి రెండు స్థానాల్లో  కొనసాగుతున్నాయి.

స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (SIPRI) నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు మొత్తం తొమ్మిది మాత్రమే ఉన్నాయి. ఈ తొమ్మిది దేశాల వద్ద కలిపి 12 వేలకు పైగా అణ్వాయుధాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం ఏడాది  వ్యవధిలో భారత్ మరో 10 వార్‌హెడ్లను అదనంగా సమకూర్చుకుని తన ఆయుధాగారాన్ని బలోపేతం చేసుకుంది. చైనా విషయానికి వస్తే, ఆ దేశం వద్ద ఏకంగా 620 అణ్వాయుధాలు ఉన్నట్లు సిప్రి  నివేదికలో వెల్లడించింది.

Follow Us