AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Biryani: ఛీ..ఛీ.. చికెన్ బిర్యానీలో కప్ప.. మసాలా పట్టించి మరీ ఉడికించారుగా..! ఎక్కడో కాదండోయ్..

ఈనెల 16న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కదంబ మెస్‌లో భోజనం చేస్తుండగా ఓ విద్యార్థికి వడ్డించిన చికెన్‌ బిర్యానీలో కప్ప కనిపించడంతో విద్యార్థులంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. బిర్యానీలో వచ్చిన కప్ప కళేబరాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వేగంగా వైరల్‌ అయింది.

Chicken Biryani: ఛీ..ఛీ.. చికెన్ బిర్యానీలో కప్ప.. మసాలా పట్టించి మరీ ఉడికించారుగా..! ఎక్కడో కాదండోయ్..
Frog In Chicken Biryani
Jyothi Gadda
|

Updated on: Oct 21, 2024 | 7:52 AM

Share

హైదరాబాద్‌ బిర్యానీలో కప్ప ప్రత్యక్షం కావటం కలకలం రేపింది. అవును.. ఈ షాకింగ్‌ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని త్రిపుల్ ఐటి విద్యార్థులకు వడ్డించిన చికెన్‌ బిర్యానీలో కప్ప కనిపించింది. బిర్యానీ తిందామని కూర్చున్న విద్యార్థులు చికెన్‌ బిర్యానీలో ముక్కలతో పాటే కనిపించిన కప్పను చూసి కంగుతిన్నారు. కళ్ల ముందున్న ఆ దృశ్యం చూసి వాళ్లకు కడుపులోంచి దేవినట్లయింది. వెంటనే కప్పతో పాటే ఆ బిర్యానీ ప్లేటును అలాగే తీసుకెళ్లి మెస్ ఇంచార్జ్ కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఆహారం సప్లై చేస్తున్న మెస్‌ నిర్వాహకుల తీరుపై ఆందోళనకు దిగారు.

గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో ఈనెల 16న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కదంబ మెస్‌లో భోజనం చేస్తుండగా ఓ విద్యార్థికి వడ్డించిన చికెన్‌ బిర్యానీలో కప్ప కనిపించడంతో విద్యార్థులంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. బిర్యానీలో వచ్చిన కప్ప కళేబరాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వేగంగా వైరల్‌ అయింది.

మెస్‌లో శుభ్రత పాటించడం లేదనీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు వడ్డించే ఆహారంలో పురుగులు, కప్పలు వస్తున్నాయని వాపోయారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ట్రిపుల్ మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు కూడా విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి