నాగార్జున సాగ‌ర్‌కు కొన‌సాగుతున్న వ‌ర‌ద‌.. 18 గేట్లు ఎత్తివేత‌.. పెరిగి సందర్శకుల తాకిడి..

కర్నూలు జిల్లాలోని సుంకేసుల బ్యారేజ్‌కి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద వచ్చి చేరుతోంది. స్పిల్‌వే ఔట్‌ ఫ్లో 22 గేట్లు ఎత్తిన అధికారులు 93,324 క్యూషక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నాగార్జున సాగ‌ర్‌కు కొన‌సాగుతున్న వ‌ర‌ద‌.. 18 గేట్లు ఎత్తివేత‌.. పెరిగి సందర్శకుల తాకిడి..
Nagarjuna Sagar
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 20, 2024 | 12:10 PM

శ్రీశైలం నుంచి నాగార్జున సాగ‌ర్ వైపు కృష్ణ‌మ్మ ఉర‌క‌లేస్తోంది. దీంతో సాగ‌ర్‌కు భారీగా వ‌ర‌ద నీరు చేరుకుంటోంది. ఈ నేప‌థ్యంలో సాగ‌ర్ 18 గేట్ల‌ను ఎత్తి.. దిగువ‌కు 1.14 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం నీటి నిల్వ సామ‌ర్థ్యం 311.44 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీటినిల్వ సామ‌ర్థ్యం 312 టీఎంసీలు. క్రస్టుగేట్లు కుడి,ఎడమ కాలువల ద్వార మరియు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 1,89,312 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఇవాళ సెల‌వు దినం కావ‌డంతో సాగ‌ర్ అందాల‌ను చూసేందుకు ప‌ర్యాట‌కులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివస్తున్నారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

– ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. వారం రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ ఫ్లో శనివారం మరింత పెరిగింది. 75వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తం 85,356 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

– అటు తుంగభద్ర జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో 8 గేట్లు ఎత్తివేత దిగువకు దాదాపు 60,000 క్యు సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

– కర్నూలు జిల్లాలోని సుంకేసుల బ్యారేజ్‌కి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద వచ్చి చేరుతోంది. స్పిల్‌వే ఔట్‌ ఫ్లో 22 గేట్లు ఎత్తిన అధికారులు 93,324 క్యూషక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

– ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి 84,297 క్యూసెక్కుల నీరు వస్తోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..