Kadapa: పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఆ కారులో వ్యక్తులు.. చెక్ చేయగా
కడప జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. ఎర్రగుంట్ల వద్ద వాహనాల తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2.52 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అమ్మకానికి సంబంధించిన సరైన బిల్లులు చూపించలేకపోవడంతో నగదుతోపాటు కారును సీజ్ చేసి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

కడప జిల్లాలో రెండున్నర కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. ఎర్రగుంట్ల దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న రెండు కోట్ల 52 లక్షల రూపాయలను పట్టుకున్నారు పోలీసులు. నగదుకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో సీజ్ చేసి పోలీస్స్టేషన్కి తరలించారు. వైట్ కలర్ కారుపై అనుమానం రావడంతో తనిఖీలు చేసినట్టు తెలిపారు ఎర్రగుంట్ల సీఐ. నగదుతోపాటు కారును సీజ్చేసి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రొద్దుటూరులోని నగల దుకాణం యజమాని మీరావలి దగ్గర పనిచేస్తు్న్నట్టు చెప్పిన ఇద్దరు యువకులు.. బంగారాన్ని అమ్మి నగదు తీసుకొస్తున్నట్టు చెప్పారు. మీరావలి స్నేహితుడు శంకర్ నాయక్ ద్వారా గుంతకల్లులో గోల్డ్ను విక్రయించినట్టు తెలిపారు. అయితే, నగదుకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో.. కోర్టు ముందు పెడతామని ఎర్రగుంట్ల సీఐ చెప్పారు.
