AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: రక్షించండి మహాప్రభో…! గాయపడిన కోడితో పోలీస్‌ స్టేషన్‌ చేరిన దంపతులు…

దంపతుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని ఒప్పించి ఇంటికి పంపించి వేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి ప్రసాద్ సిన్హా తెలిపారు.

Viral News: రక్షించండి మహాప్రభో...! గాయపడిన కోడితో పోలీస్‌ స్టేషన్‌ చేరిన దంపతులు...
Attempt To Kill A Chicken
Jyothi Gadda
|

Updated on: Feb 28, 2023 | 6:39 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. తన కోడిని చంపేందుకు ప్రయత్నించారని ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ గాయపడిన కోడితో సహా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తమ ఇరుగుపొరుగు వారే కోడిని దొంగిలించి చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇరుగుపొరుగు వారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేసింది. ఈ ఫిర్యాదు విని పోలీసులే ఆశ్చర్యపోయారు. రతన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిల్దాహా గ్రామానికి చెందిన జాంకీబాయి బింజ్వార్ ఈ కంప్లైట్‌ చేసింది. తాను కోళ్లను పెంచుతుంటానని, ఆ కోళ్లు వారి ఇంటి పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుంటాయని చెప్పింది. ఆ మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె కోళ్లలో ఒకదానిని చంపేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారని ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

తన ఇంటికి ఇరుగుపొరుగు వారే తన కోడిని చంపి తినేయాలని చూస్తున్నారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మహిళతో పాటు ఆమె భర్త మలిక్రం కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. కోడిపిల్లను దొంగిలించి చంపేందుకు ప్రయత్నించిన కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని దంపతులు డిమాండ్ చేశారు. అయితే, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఇంతకు ముందు పక్కింటి వారు కూడా ఇలాగే కోడిని దొంగిలించారని, ఈ విషయమై ఇరువురికి వాగ్వాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు తనను చంపుతామని బెదిరించారని కూడా వారు పోలీసులకు వివరించారు.

గాయపడిన కోడిని చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చిన దంపతుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని ఒప్పించి ఇంటికి పంపించి వేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి ప్రసాద్ సిన్హా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్