వంటల పోటీల్లో జడ్జీలకు దిమ్మ దిరిగే షాక్.. బిర్యానీ తో వచ్చిన మహిళ చేసిన పనికి..

మహిళ సమాధానంతో అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయ నిర్ణేతలు.. ఆమెను అక్కడ్నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు. దానికి ఆమె స్పందిస్తూ.. తాను కష్టపడి బిర్యానీ తీసుకువచ్చానని, ఖచ్చితంగా రుచి చూడాల్సిందేనని పట్టుబట్టింది.

వంటల పోటీల్లో జడ్జీలకు దిమ్మ దిరిగే షాక్.. బిర్యానీ తో వచ్చిన మహిళ చేసిన పనికి..
Pakistani Cooking Show
Follow us

|

Updated on: Feb 28, 2023 | 3:39 PM

ఇటీవలి కాలంలో వంటలకు సంబంధించిన కార్యక్రమాలు అనేక వస్తున్నాయి. వివిధ రకాల వంటలకాలకు సంబంధించి పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. అలాంటి కుక్కింగ్‌ షోస్‌కి వినియోగదారుల నుండి కూడా చాలా రెస్పాన్స్ వస్తోంది. అయితే కొన్ని పోటీలకు ముందుగా జరిగే ఆడిషన్లు ఒక్కోసారి ఆశ్చర్యంగానూ, వినోదాత్మకంగానూ అనిపిస్తాయి. అలాంటిదే పాకిస్థానీ కుకింగ్ షోకి సంబంధించిన ఒక ఆడిషన్ క్లిప్ నెట్టింట వైరల్‌ అవుతోంది.. అందులో ఓ మహిళ చేసిన పనికి, జడ్జీలతో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇస్లామాబాద్ పాకిస్థాన్ కుకింగ్ షో ది కిచెన్ మాస్టర్ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోయారు. పాకిస్థానీ కుకింగ్ షో ది కిచెన్ మాస్టర్ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

సాధారణంగా వంటల పోటీలో పాల్గొనే పోటీదారులు తమ వంటకాలను చూడడానికి అందంగా ఉండాలన్న ఉద్దేశంతో తాము చేసిన రెసిపీని సర్వింగ్‌ బౌల్ లో వేసి, దానికి మరింత డెకరేషన్ చేస్తుంటారు. అయితే, ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో మాత్రం.. ఒక మహిళ తన వంటకానికి ఏ చిన్నపాటి డెకరేషన్ కూడా లేకుండా తను తెచ్చిన బిర్యానీని ఓ మామూలు బాక్స్ లో తీసుకొచ్చి జడ్జీల ముందుపెట్టింది.. దాంతో వారు ఇదేంటి ఇలా తీసుకొచ్చారెందుకు అని ఆ మహిళను జడ్జీలు అడుగుతారు. దానికి ఆమె సమాధానంగా.. తాను బిర్యానీ తీసుకుని రెస్టారెంట్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చానని చెప్పింది.. తమ ప్రాంతంలో ఇదే బెస్ట్ బిర్యానీ అని కూడా చెప్పింది. సదరు మహిళ చెప్పిన మాట విన్న జడ్జీలు కంగుతిన్నారు.

ఇవి కూడా చదవండి

మహిళ సమాధానానికి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తులు..నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత తేరుకున్నాక మీరు స్వయంగా చేసి తీసుకురావాలి కదా..రెస్టారెంట్ నుంచి కొనుక్కురావడం ఏంటీ అని ప్రశ్నించారు. అయితే స్వయంగా చేసుకొని రావాలని తనకు చెప్పలేదని ఆ మహిళ స్పష్టం చేసింది. మహిళ సమాధానంతో అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయ నిర్ణేతలు.. ఆమెను అక్కడ్నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు. దానికి ఆమె స్పందిస్తూ.. తాను కష్టపడి బిర్యానీ తీసుకువచ్చానని, ఖచ్చితంగా రుచి చూడాల్సిందేనని పట్టుబట్టింది. న్యాయమూర్తులతో గొడవకు దిగింది. దీంతో జడ్జిలలో ఒకరు ఆగ్రహంతో సెట్ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. టీఆర్పీ కోసమే ఇదంతా చేశారంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..
కొర్టాలమ్‌ జలపాతానికి ఆకస్మిక వరద..భయంతో పరుగులు తీసిన సందర్శకులు
కొర్టాలమ్‌ జలపాతానికి ఆకస్మిక వరద..భయంతో పరుగులు తీసిన సందర్శకులు