సోనియా గాంధీ

సోనియా గాంధీ

సోనియా గాంధీ భారత రాజకీయాలలో ఒక ముఖ్యమైన నాయకురాలు. సోనియా గాంధీ అసలు పేరు ఆంటోనియా అడ్వైజ్ అల్బినా మైనో. ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌కు సుదీర్ఘకాలం పాటు అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె 9 డిసెంబర్ 1946న ఇటలీలోని విసెంజా సమీపంలో ఓ చిన్న గ్రామంలో రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించారు. సోనియా తండ్రి పేరు స్టెఫానో మరియు తల్లి పేరు పావోలా. సోనియా తండ్రి వృత్తి రీత్యా మెకానిక్. సోనియా ఇంగ్లండ్‌లో భాషలను అధ్యయనం చేసేందుకు కేంబ్రిడ్జికి వెళ్లిన సమయంలో రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ 1968లో పెళ్లి చేసుకున్నారు. సోనియా – రాజీవ్‌లకు ఇద్దరు పిల్లలు – రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. భర్త రాజీవ్ గాంధీ హత్యకు గురైన అనంతరం 1991లో రాజకీయాల్లోకి వచ్చిన సోనియా గాంధీ.. 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్రలో అత్యధిక కాలం అధ్యక్షురాలిగా పనిచేసిన ఘనత సోనియాదే. సోనియా కూడా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు యూపీఏ ఛైర్‌పర్సన్‌గానూ ఆమె పనిచేశారు.

ఇంకా చదవండి

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎ వెనుక అసలు కారణం ఏంటి..

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి కమాండర్‌గా మారారా? హైకమాండ్‌ రేవంత్‌ మాటకే ఎక్కువ విలువ ఇస్తోందా? అధిష్టానం అండతో ఎంపీ టిక్కెట్లు అనుచరులకే కట్టుబెట్టుకుంటున్నారా? వయా ఢిల్లీ ఫార్ములాతో మంత్రులకు సైతం చెక్‌ పెడుతున్నారా? ఇంతకీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్‌ స్ట్రాటజీ ఏంటి?

  • Srikar T
  • Updated on: Apr 20, 2024
  • 7:34 am

Telangana: ఈ మూడు సీట్ల ఆలస్యానికి అదే కారణమా.. ఢిల్లీ సీఈసీ మీటింగ్‎లో తుది నిర్ణయం..

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడితే కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల వెతుకులాటలోనే సతమతమవుతోంది. ఇప్పటికే 14 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఇంకో మూడు స్థానాలను పెండింగ్‎లో పెట్టింది. మూడు స్థానాల్లో హైదరాబాద్ స్థానంలో అభ్యర్థిని ప్రకటించడానికి పెద్ద ఇబ్బంది లేకపోయినా మిగతా రెండు స్థానాలపై కాంగ్రెస్ హై కమాండ్ తర్జనభర్జన పడుతోంది. ఖమ్మం, కరీంనగర్ సెగ్మెంట్లలో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలనే విషయంలో హస్తం నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.

‘ప్రధాని మన్మోహన్ నిర్ణయాలను సోనియా మార్చేవారు..‘ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల వేళ 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న  యూపీఏ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలను నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మార్చేవారని వెల్లడించారు. 

PM Modi: ‘సనాతన ధర్మాన్ని అంతం చేయడమే ఇండియా కూటమి లక్ష్యం’.. బిహార్ ప్రచారంలో ప్రధాని మోదీ..

ఇండియా కూటమి అవినీతి, దేశ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్‌లోని నవాడాలో పర్యటించారు ప్రధాని మోదీ.

  • Srikar T
  • Updated on: Apr 7, 2024
  • 6:47 pm

Congress: ‘భారత్ కొద్దిమంది వ్యక్తుల సొత్తు కాదు’.. జైపూర్ సభలో సోనియా ప్రసంగం..

నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభాన్ని పెంపొందించడంలో ఈ ప్రభుత్వం ముందుందని బీజేపీని విమర్శించారు సోనియా గాంధీ. గత 10 సంవత్సరాలుగా దేశం ఏ మాత్రం పురోగతి సాధించలేదన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ జైపూర్ లో పర్యటించారు ఆమె.

  • Srikar T
  • Updated on: Apr 6, 2024
  • 7:52 pm

Congress: ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీలు.. యువరాజుకు భారత్ పట్టం కట్టేనా..

సార్వత్రిక ఎన్నికల పర్వంలో ఇచ్చిపుచ్చుకోవడాలు మొదలైపొయ్యాయి. మేమొస్తే ఏమిస్తామో చెప్పుకుంటూ మేనిఫెస్టోల మేజిక్‌ని జోరుగా షురూ చేశాయి జాతీయ పార్టీలు. ఈ విషయంలో మేమే ఫస్ట్ అంటూ హామీల పుస్తకాన్ని జనం ముందుంచింది హస్తం పార్టీ.

  • Srikar T
  • Updated on: Apr 5, 2024
  • 8:13 pm

Lok Sabha Elections 2024: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా..? అక్కడి నుంచి పోటీకి సుముఖత

జాతీయ స్థాయిలో చాలామంది నేతలు పార్టీని వీడుతున్న సమయంలో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా పొలిటికల్‌ ఎంట్రీకి రెడీ అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని అమేథీ నుంచి పోటీ చేయడానికి తాను సిద్దమని ప్రకటించారు వాద్రా. అమేధీ ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు.

  • Srikar T
  • Updated on: Apr 4, 2024
  • 8:09 pm

Telangana Congress: పార్లమెంట్‌ ఎన్నికలపై కాంగ్రెస్‌ స్పెషల్‌ ఫోకస్.. ఆ స్థానంలో అభ్యర్థి మార్పు!

పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా టీ.కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. దశలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ కనీసం 14 స్థానాల్లోనైనా జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తోంది. తాజాగా.. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించింది అధిష్టానం. అటు.. పెండింగ్‌లోనున్న నాలుగు ఎంపీ స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.

INDIA Alliance: ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై విపక్షాల పోరుబాట.. ఢిల్లీ వేదికగా..

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ , కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి సిద్దమయ్యింది ఇండియా కూటమి. దీనిలో భాగంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి.

Congress: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసులు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్‌కు మరోసారి ఐటీ నుంచి నోటీసులు అందాయి. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీతో సహా దాదాపు రూ.1700 కోట్ల నోటీసును ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అందజేసిందని కాంగ్రెస్ పార్టీ గురువారం (మార్చి 29) సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. నాలుగు అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి..

Congress: ఫిరాయింపులు సహజమే.. కానీ కాంగ్రెస్ ఇల్లు ఎందుకు ఖాళీ అవుతోంది..?

రాజకీయాల్లో నేతలు పార్టీలు మారడం కొత్త విషయమేమీ కాదు. ఎన్నికల వేళ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఫిరాయింపులు జరుగుతుంటాయి. ఈ మధ్య ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఫిరాయింపులు ఎక్కువే జరుగుతున్నాయి. ఏదేమైనా నేతల ఫిరాయింపులకు గతంలో మాదిరిగా సైద్ధాంతిక విబేధాలతో, అగ్రనాయకత్వంతో స్పర్థలో కారణం కాదు.. పదవులు, అధికారమే పరమావధిగా ఈ గోడ దూకడాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Congress: ఆకాంక్షలు ఒకటి.. అజెండా మరొకటి.. అనిశ్చిత భవిష్యత్తు దిశగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ.. ఎందుకిలా

ఎన్నికల రాజకీయాల్లో ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించి, తాము అధికారం చేపట్టాలనే కోరుకుంటుంది. గెలుపు మీద ఆశ, గెలవాలన్న ఆకాంక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఈ క్రమంలో అధికారంలో ఉన్నవారిని దించేసి తమను ఎన్నుకోవాలని ప్రజల్ని కోరుతుంటారు. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదు. కానీ ప్రజలు కేవలం ఈ మాటలకే కన్విన్స్ అవుతారా? అధికారంలో ఉన్న పార్టీ విస్మరించిన అంశాలేంటి..

Rahul Jodo Yatra: యూపీలో రాహుల్ జోడో యాత్ర.. పోటీగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సభ

ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరోజు విరామం తరువాత భారత్‌ జోడో యాత్రను ప్రారంభించారు రాహుల్‌గాంధీ. ప్రయాగ్‌రాజ్‌లో యాత్ర కొనసాగింది. ఈనెల రాయ్‌బరేలిలో భారత్‌ జోడో యాత్రలో ప్రియాంకాగాంధీ కూడా పాల్గొంటారు. సోమవారం అమేథీలో పర్యటిస్తారు రాహుల్‌. ఇదే సమయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా అమేధీలో సభ నిర్వహిస్తున్నారు.

Rahul Dog Biscuit Row: కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కుక్క బిస్కెట్ల లొల్లి.. రాహుల్ ఏం సమాధానం ఇచ్చారంటే..?

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ, బీజేపీ నేతల మధ్య కుక్క బిస్కెట్ల గొడవ రాజుకుంది. జార్ఖండ్‌ జోడో యాత్రలో రాహుల్‌ కుక్కలు తినే బిస్కెట్లను కార్యకర్తతో తిన్పించారని బీజేపీ ఆరోపించింది. కుక్కలంటే బీజేపీ నేతలకు ఎందుకు అంత భయం అని రాహుల్‌ ఎదురుదాడికి దిగారు.

Sonia Gandhi: కాంగ్రెస్ వ్యూహాత్మక నిర్ణయం.. తెలంగాణలో సోనియా గాంధీ కోసం రిజర్వ్ చేసిన స్థానాలేంటి..?

టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ తీర్మానం చేసింది. గతంలో ఇంధిరా గాంధీ మాదిరిగా ఈసారి సోనియా గాంధీని కూడా దక్షిణాది నుంచి పోటీ చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ నుంచి సోనియాగాంధీ ఎంపీగా పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్‌ తో రాష్ట్రంలో మరిన్ని ఎంపీ సీట్లు గెలవొచ్చని కాంగ్రెస్‌ నేతలు ఆశిస్తున్నారు.

Latest Articles