Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

సోనియా గాంధీ భారత రాజకీయాలలో ఒక ముఖ్యమైన నాయకురాలు. సోనియా గాంధీ అసలు పేరు ఆంటోనియా అడ్వైజ్ అల్బినా మైనో. ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌కు సుదీర్ఘకాలం పాటు అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె 9 డిసెంబర్ 1946న ఇటలీలోని విసెంజా సమీపంలో ఓ చిన్న గ్రామంలో రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించారు. సోనియా తండ్రి పేరు స్టెఫానో మరియు తల్లి పేరు పావోలా. సోనియా తండ్రి వృత్తి రీత్యా మెకానిక్. సోనియా ఇంగ్లండ్‌లో భాషలను అధ్యయనం చేసేందుకు కేంబ్రిడ్జికి వెళ్లిన సమయంలో రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ 1968లో పెళ్లి చేసుకున్నారు. సోనియా – రాజీవ్‌లకు ఇద్దరు పిల్లలు – రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. భర్త రాజీవ్ గాంధీ హత్యకు గురైన అనంతరం 1991లో రాజకీయాల్లోకి వచ్చిన సోనియా గాంధీ.. 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్రలో అత్యధిక కాలం అధ్యక్షురాలిగా పనిచేసిన ఘనత సోనియాదే. సోనియా కూడా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు యూపీఏ ఛైర్‌పర్సన్‌గానూ ఆమె పనిచేశారు.

ఇంకా చదవండి

Sonia Gandhi: అస్వస్థతకు గురైన సోనియా గాంధీ.. ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రికి తరలింపు..!

అనారోగ్య కారణాల వల్ల, సోనియా గాంధీ 2024 డిసెంబర్‌లో కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి హాజరు కాలేదు. 2024 సెప్టెంబర్‌లో కూడా సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. అప్పుడు ఆమెకు తేలికపాటి జ్వరం వచ్చింది. తాజాగా మరోసారి అస్వస్థతకు గురైన ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు.

 Delhi Election 2025 Results Highlights: ఓటమిని అంగీకరించిన కేజ్రీ.. దిల్లీలో అభివృద్ధి గెలిచిందన్న మోదీ

 Delhi Election 2025 Results Highlights: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఢిల్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. 26ఏళ్ల తర్వాత 48శాతం ఓట్‌ షేర్‌తో 45కి పైగా సీట్లు గెలిచింది. ఇటు 43 శాతం ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ 20కి పైగా సీట్లు సాధించగా...7 శాతం ఓట్ షేర్‌తో సున్నా సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్. బీజేపీ విక్టరీ కన్ఫమ్‌ అయ్యింది. ఇక ఇప్పుడు అందరి చూపు సీఎం ఎవరనే దానిపైనే.

Congress Working Committee: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు ఘనం.. ఆచరణలో మాత్రం శూన్యం.. ఎందుకిలా..?

గత పదేళ్లలో దేశంలో 2 పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికలు జరగ్గా, 53 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిలో 28 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ 2 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోగా, 40కి పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. కొన్ని రాష్ట్రాల్లో గెలుపొందినప్పటికీ.. అది కాంగ్రెస్ ఘనత కాదని, అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలపై ఏర్పడ్డ వ్యతిరేకత గెలిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Congress: కష్టాల్లో ఉన్నప్పుడల్లా గాంధీ కుటుంబానికి అండగా దక్షిణ భారతం.. అసలు కారణం అదేనా?

ఉత్తర భారతదేశంలో బీజేపీ రాజకీయ మూలాలు చాలా బలంగా ఉన్నాయి, అయితే దక్షిణాది కాంగ్రెస్‌కు సురక్షితమైన మార్గం లాంటిది.

వాయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ నామినేషన్.. హాజరు కానున్న సోనియా, రాహుల్, సీఎం రేవంత్

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు బుధవారం(అక్టోబర్ 23) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం 11 గంటలకు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం […]

CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఆ అంశాలపై క్లారిటీ రానుందా..

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులందరూ ఢిల్లీలోనే ఉండనున్నారు. నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరి వెళ్లగా.. రెండు రోజులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినలోనే మకాం వేశారు. ఈరోజు సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి‎తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం కానున్నారు.

AP Congress: ఏపీలో ‘వైఎస్ఆర్’ పొలిటికల్ అస్త్రం.. కాంగ్రెస్ వ్యూహం ఇదేనా..

వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అటు ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తల్లి విజయమ్మతో కలిసి నివాళి అర్పించారు. ఆమెతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా పాల్గొన్నారు. ఇక తెలంగాణలోనూ వైఎస్ఆర్ 75వ జయంతి సంబరాలు ఘనంగా, అధికారికంగా నిర్వహించారు.

  • Srikar T
  • Updated on: Jul 8, 2024
  • 12:46 pm

Rahul Gandhi: ‘నా భారత్ జోడోయాత్రకు వైఎస్ఆరే స్పూర్తి’.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్..

వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. వైఎస్ఆర్ అసలైన ప్రజా నాయకుడు అని కొనియాడారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కీర్తించారు. ఆయన మరణం అత్యంత విషాదం అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఏపి ముఖచిత్రం వేరేలా ఉండేదని.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‎కి ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావని తెలిపారు. ఆయన వారసత్వాన్ని షర్మిల సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

  • Srikar T
  • Updated on: Jul 8, 2024
  • 10:57 am

CM Revanth Reddy: ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరమైన అంశాలపై సమావేశాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ కలవనున్నారు. నేడు కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానంతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి పిలుపు అందింది.

  • Srikar T
  • Updated on: Jul 4, 2024
  • 7:48 am

Telangana: బిజీబిజీగా సీఎం రేవంత్.. ఆ సమావేశం తరువాత మరోసారి ఢిల్లీ పెద్దలతో భేటి..

తెలంగాణలో ఈ నెల 4న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జూలై 3న మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపినటప్పటికీ రేపు జరగబోయే భేటీలో ఎవరికి ఏఏశాఖలు కేటాయించాలన్న అంశంపైకూడా తీవ్రమైన కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రేపటి ఢిల్లీ పర్యటనలో మంత్రి పదవులు ఎవరికి కేటాయించాలన్నదానిఫై తుది నిర్ణయం అధికారికంగా వెలువడనుంది.

  • Srikar T
  • Updated on: Jul 2, 2024
  • 9:11 am