సోనియా గాంధీ
సోనియా గాంధీ భారత రాజకీయాలలో ఒక ముఖ్యమైన నాయకురాలు. సోనియా గాంధీ అసలు పేరు ఆంటోనియా అడ్వైజ్ అల్బినా మైనో. ఆమె భారత జాతీయ కాంగ్రెస్కు సుదీర్ఘకాలం పాటు అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె 9 డిసెంబర్ 1946న ఇటలీలోని విసెంజా సమీపంలో ఓ చిన్న గ్రామంలో రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించారు. సోనియా తండ్రి పేరు స్టెఫానో మరియు తల్లి పేరు పావోలా. సోనియా తండ్రి వృత్తి రీత్యా మెకానిక్. సోనియా ఇంగ్లండ్లో భాషలను అధ్యయనం చేసేందుకు కేంబ్రిడ్జికి వెళ్లిన సమయంలో రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ 1968లో పెళ్లి చేసుకున్నారు. సోనియా – రాజీవ్లకు ఇద్దరు పిల్లలు – రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. భర్త రాజీవ్ గాంధీ హత్యకు గురైన అనంతరం 1991లో రాజకీయాల్లోకి వచ్చిన సోనియా గాంధీ.. 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్రలో అత్యధిక కాలం అధ్యక్షురాలిగా పనిచేసిన ఘనత సోనియాదే. సోనియా కూడా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు యూపీఏ ఛైర్పర్సన్గానూ ఆమె పనిచేశారు.
సోనియా గాంధీకి అస్వస్థత.. సిమ్లాలోని ఐజీఎంసీ ఆస్పత్రికి తరలింపు..!
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. సిమ్లాలో ప్రియాంకాగాంధీ కుటుంబంతో కలిసి వేసవి సెలవులు గడిపేందుకు వెళ్లిన సోనియా ఆరోగ్యం క్షిణించింది. దీంతో సిమ్లాలోని ఇందిరగాంధీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. సీనియర్ వైద్యులు సోనియాకు MRI పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు.
- Balaraju Goud
- Updated on: Jun 7, 2025
- 7:01 pm
National Herald Case: విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు.. రాహుల్, సోనియాగాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు..
నేషనల్ హెరాల్డ్ కేసులో ED ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకోవడంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. చార్జిషీట్ దాఖలు అయిన తర్వాత- ఈ కేసులో నిందితులైన సోనియాగాంధీ, రాహుల్గాంధీ, శామ్ పిట్రోడాకు నోటీసులు జారీచేసింది న్యాయస్థానం. ED తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు.
- Shaik Madar Saheb
- Updated on: May 21, 2025
- 1:39 pm
అహ్మదాబాద్ కాంగ్రెస్ వర్కంగ్ కమిటీ సమావేశంలో రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత, ముస్లిం, బ్రాహ్మణుల మధ్య చిక్కుకుపోయామని, ఓబీసీలు మమ్మల్ని విడిచిపెట్టారని రాహుల్ గాంధీ అన్నారు. మనం ముస్లింల గురించి మాట్లాడుకుంటాం. అందుకే మమ్మల్ని తరచుగా ముస్లిం మద్దతుదారులు అని పిలుస్తారు. దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ గాందీ స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Apr 8, 2025
- 9:56 pm
Sonia Gandhi: అస్వస్థతకు గురైన సోనియా గాంధీ.. ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రికి తరలింపు..!
అనారోగ్య కారణాల వల్ల, సోనియా గాంధీ 2024 డిసెంబర్లో కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి హాజరు కాలేదు. 2024 సెప్టెంబర్లో కూడా సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. అప్పుడు ఆమెకు తేలికపాటి జ్వరం వచ్చింది. తాజాగా మరోసారి అస్వస్థతకు గురైన ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు.
- Balaraju Goud
- Updated on: Feb 20, 2025
- 11:23 pm
Delhi Election 2025 Results Highlights: ఓటమిని అంగీకరించిన కేజ్రీ.. దిల్లీలో అభివృద్ధి గెలిచిందన్న మోదీ
Delhi Election 2025 Results Highlights: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఢిల్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. 26ఏళ్ల తర్వాత 48శాతం ఓట్ షేర్తో 45కి పైగా సీట్లు గెలిచింది. ఇటు 43 శాతం ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ 20కి పైగా సీట్లు సాధించగా...7 శాతం ఓట్ షేర్తో సున్నా సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్. బీజేపీ విక్టరీ కన్ఫమ్ అయ్యింది. ఇక ఇప్పుడు అందరి చూపు సీఎం ఎవరనే దానిపైనే.
- Balaraju Goud
- Updated on: Feb 8, 2025
- 6:09 pm
Congress Working Committee: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు ఘనం.. ఆచరణలో మాత్రం శూన్యం.. ఎందుకిలా..?
గత పదేళ్లలో దేశంలో 2 పర్యాయాలు లోక్సభకు ఎన్నికలు జరగ్గా, 53 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిలో 28 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ 2 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోగా, 40కి పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. కొన్ని రాష్ట్రాల్లో గెలుపొందినప్పటికీ.. అది కాంగ్రెస్ ఘనత కాదని, అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలపై ఏర్పడ్డ వ్యతిరేకత గెలిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Mahatma Kodiyar
- Updated on: Dec 29, 2024
- 7:53 pm
Congress: కష్టాల్లో ఉన్నప్పుడల్లా గాంధీ కుటుంబానికి అండగా దక్షిణ భారతం.. అసలు కారణం అదేనా?
ఉత్తర భారతదేశంలో బీజేపీ రాజకీయ మూలాలు చాలా బలంగా ఉన్నాయి, అయితే దక్షిణాది కాంగ్రెస్కు సురక్షితమైన మార్గం లాంటిది.
- Balaraju Goud
- Updated on: Oct 23, 2024
- 6:05 pm
వాయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ నామినేషన్.. హాజరు కానున్న సోనియా, రాహుల్, సీఎం రేవంత్
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికకు బుధవారం(అక్టోబర్ 23) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం 11 గంటలకు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్షో నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం […]
- Balaraju Goud
- Updated on: Oct 22, 2024
- 8:33 pm
CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఆ అంశాలపై క్లారిటీ రానుందా..
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులందరూ ఢిల్లీలోనే ఉండనున్నారు. నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరి వెళ్లగా.. రెండు రోజులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినలోనే మకాం వేశారు. ఈరోజు సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం కానున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Jul 21, 2024
- 9:43 pm
AP Congress: ఏపీలో ‘వైఎస్ఆర్’ పొలిటికల్ అస్త్రం.. కాంగ్రెస్ వ్యూహం ఇదేనా..
వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అటు ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తల్లి విజయమ్మతో కలిసి నివాళి అర్పించారు. ఆమెతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా పాల్గొన్నారు. ఇక తెలంగాణలోనూ వైఎస్ఆర్ 75వ జయంతి సంబరాలు ఘనంగా, అధికారికంగా నిర్వహించారు.
- Srikar T
- Updated on: Jul 8, 2024
- 12:46 pm