AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahatma Kodiyar

Mahatma Kodiyar

Associate Editor - TV9 Telugu

mahatma.kodiyar@tv9.com

రెండు దశాబ్దాలకు పైగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగం నుంచి ‘ఈనాడు జర్నలిజం స్కూల్’ ద్వారా 2003లో మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. ETVలో ట్రైనీ రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించి, 2004 సార్వత్రిక ఎన్నికల కవరేజ్ తర్వాత హైదరాబాద్‌లో క్రైమ్ రిపోర్టింగ్ బాధ్యతలు చేపట్టి, అనతికాలంలోనే అక్కడ క్రైమ్ బ్యూరో ఇంఛార్జిగా పదోన్నతి పొందారు. 2007లో NTVలో చేరి, హైదరాబాద్ క్రైమ్ బ్యూరోతో పాటు కొన్నాళ్లు విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర రీజనల్ హెడ్‍‌గా పనిచేశారు. బ్రాడ్‌కాస్ట్ జర్నలిజంలో కొనసాగుతూనే.. “మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం”లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 2010లో TV9లో క్రైమ్ బ్యూరో హెడ్‌గా ప్రయాణం మొదలుపెట్టి అనేక సంచలన నేర వార్తలను వేగంగా ప్రజల ముందుకు చేర్చారు. 2012లో ఢిల్లీ బ్యూరోకి మారి, 2014 నుంచి ‘ఢిల్లీ బ్యూరో హెడ్‌’గా బాధ్యతలు చేపట్టారు. 2023లో ‘అసోసియేట్ ఎడిటర్‌’గా పదోన్నతి పొంది, 2025 ఏప్రిల్ వరకు ఢిల్లీలోనే పనిచేశారు.

2013లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో జపాన్, థాయిలాండ్ దేశాల పర్యటనతో మొదలుపెట్టి అదే ఏడాది ఉత్తరాఖండ్ ను కుదిపేసిన కేదార్‌నాథ్ జలప్రళయం, 2015లో నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం సహా కాశ్మీర్ లోయ, ఈశాన్య రాష్ట్రాల్లో చోటుచేసుకునే హింసాత్మక ఘటనలు, హిమాలయ రాష్ట్రాల్లో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు.. ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రధాన ఘట్టాలను గ్రౌండ్ జీరో నుంచి లైవ్ రిపోర్టింగ్ ద్వారా అందించారు. 2022లో మొదలైన “ఉక్రెయిన్ – రష్యా యుద్ధం” కవరేజి కోసం జర్మనీ, హంగేరీ, పోలాండ్ మీదుగా ఉక్రెయిన్ చేరుకుని, యుద్ధభూమి నుంచి వార్తలు అందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని TV9 తెలుగు హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు.

Read More
Follow On:
సాగర గర్భంలో భారత్ ‘సైలెంట్ కిల్లర్’.. డ్రాగన్ గుండెల్లో మొదలై వణుకు..!

సాగర గర్భంలో భారత్ ‘సైలెంట్ కిల్లర్’.. డ్రాగన్ గుండెల్లో మొదలై వణుకు..!

భారతదేశ రక్షణ రంగ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం మొదలైంది. హిందూ మహాసముద్రంలో చైనా, పాకిస్థాన్ వంటి శత్రు దేశాల సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ తన అమ్ములపొదిలో నాలుగవ అణు క్షిపణి జలాంతర్గామిని (SSBN) సిద్ధం చేస్తోంది. 'అరిహంత్ క్లాస్' ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకున్న 'INS అరిసూదన్' (S4) ప్రస్తుతం సముద్ర గర్భంలో తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకునే తుది దశ పరీక్షల్లో నిమగ్నమై ఉంది.

న్యాయం దక్కక అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. పోలీసులు నిర్లక్ష్యంతో భగ్గుమన్న స్థానికులు.. ఏం చేశారంటే

న్యాయం దక్కక అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. పోలీసులు నిర్లక్ష్యంతో భగ్గుమన్న స్థానికులు.. ఏం చేశారంటే

రాజస్థాన్ అట్టుడుకుతోంది.జోధ్‌పూర్‌లోని ఖేరపా ప్రాంతంలో కేవలం రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. గ్యాంగ్‌రేప్ నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు, నిందితుల నుంచి ఎదురైన నిరంతర బెదిరింపులు జోధ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అసలు ఆ ఇద్దరు మహిళల ఆత్మహత్యలకు కారణమేంటో.. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఉగ్రవాద ఆలోచనలతో పాక్ నుంచి వచ్చి.. భారత్‌లో బట్టతలకు ట్రీట్మెంట్..

ఉగ్రవాద ఆలోచనలతో పాక్ నుంచి వచ్చి.. భారత్‌లో బట్టతలకు ట్రీట్మెంట్..

పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఉస్మాన్ జట్ అలియాస్ ‘చిని’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాశ్మీర్‌లో స్లీపర్ సెల్ నెట్‌వర్క్ బలోపేతానికి భారత్‌లోకి చొరబడిన అతడు, తన గుర్తింపును మార్చుకునేందుకు శ్రీనగర్‌లో రహస్యంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవడం దర్యాప్తు సంస్థలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఓజీడబ్ల్యూ నెట్‌వర్క్ సహాయంతో క్లినిక్‌లో చికిత్స పొందిన అతడు, తర్వాత నకిలీ పత్రాలతో విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది.

శాంతి నెపంతో కొనసాగుతున్న మారణహోమం.. మూల్యం చెల్లించుకుంటున్న యావత్ ప్రపంచం..!

శాంతి నెపంతో కొనసాగుతున్న మారణహోమం.. మూల్యం చెల్లించుకుంటున్న యావత్ ప్రపంచం..!

మనం.. (భారతీయులు మాత్రమే కాదు) కోరుకున్నది కాదు. అయినా సరే అందరం మూల్యం చెల్లించుకుంటున్నాం. 'కరోనా'ను మించిన ఒక విపత్కర సంక్షోభంలోకి మెల్లమెల్లగా అడుగుపెడుతున్నాం. గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం, పర్యవసానాలను యావత్ ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తోంది.

భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని బయటపెట్టిన నివేదిక..

భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని బయటపెట్టిన నివేదిక..

చైనా బంగ్లాదేశ్‌లో సైనిక స్థావరాలు నిర్మిస్తూ భారత్‌కు పెను ముప్పుగా మారింది. లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరం, జలాంతర్గామి యార్డు, మోంగ్లా పోర్టు విస్తరణతో భారత్ సరిహద్దు భద్రత ప్రమాదంలో పడుతోంది. ముఖ్యంగా కీలకమైన చికెన్ నెక్ కారిడార్‌పై చైనా నిఘా, నియంత్రణ పెరిగే అవకాశం భారత రక్షణ నిపుణులను ఆందోళన చెందిస్తోంది.

Indian Navy: భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే!

Indian Navy: భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే!

భారత నావికాదళం తన సముద్ర యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. డిసెంబర్ 17న గోవాలోని INS హంసా నావల్ ఎయిర్ స్టేషన్‌లో MH-60R ‘రోమియో’ సీహాక్ మల్టీ-రోల్ హెలికాప్టర్ 2వ స్క్వాడ్రన్ INAS 335 ‘ఓస్ప్రీస్’ను అధికారికంగా కమిషన్ జరిగింది. నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.

భారత్-రష్యా రక్షణ ఒప్పందాలు.. పుతిన్ పర్యటన సందర్భంగా కొత్త అధ్యాయం..!

భారత్-రష్యా రక్షణ ఒప్పందాలు.. పుతిన్ పర్యటన సందర్భంగా కొత్త అధ్యాయం..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో జరుపుతున్న భారత్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతమవుతుందని అధికారిక సమాచారం. 2025 డిసెంబర్ 3న రష్యా పార్లమెంట్‌లోని లోయర్ హౌస్ రికర్సిప్రొకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ (RELOS) ఒప్పందాన్ని ఆమోదించడంతో ఈ సహకారం కొత్త దిశలో అడుగుపెట్టింది.

Putin India Tour: పుతిన్ భారత్ పర్యటన.. డిసెంబర్ 4-5న ఢిల్లీలో భారత్-రష్యా శిఖరాగ్ర సదస్సు

Putin India Tour: పుతిన్ భారత్ పర్యటన.. డిసెంబర్ 4-5న ఢిల్లీలో భారత్-రష్యా శిఖరాగ్ర సదస్సు

Putin India Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో అధికారిక పర్యటన నిర్వహించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక అంశాలపై సమగ్ర చర్చలు జరగనున్నాయని..

BrahMos: ఇండోనేషియా రక్షణ మంత్రి భారతలో పర్యటన.. “బ్రహ్మోస్” సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఒప్పందం

BrahMos: ఇండోనేషియా రక్షణ మంత్రి భారతలో పర్యటన.. “బ్రహ్మోస్” సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఒప్పందం

BrahMos: కేంద్ర రక్షణశాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ఒప్పందం ఇప్పుడు తుది దశలో ఉంది. ఇండోనేషియా చాలా కాలంగా బ్రహ్మోస్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. జనవరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మధ్య జరిగిన..

భారతదేశానికి రష్యా మరో బంపర్ ఆఫర్.. పూర్తి సాంకేతికతతో ఫైటర్ జెట్ ప్యాకేజీ!

భారతదేశానికి రష్యా మరో బంపర్ ఆఫర్.. పూర్తి సాంకేతికతతో ఫైటర్ జెట్ ప్యాకేజీ!

రష్యాకు చెందిన అత్యాధునిక ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్, Su-75 "చెక్‌మేట్" కోసం భారతదేశానికి ప్రత్యేక ఆఫర్ ఇచ్చింది. దుబాయ్ ఎయిర్ షో 2025లో, సుఖోయ్ డిజైన్ బ్యూరో ఈ విమానం మొదటి విమానం 2026 ప్రారంభంలో అందించనున్నట్లు ప్రకటించింది. రష్యా భారతదేశానికి పూర్తి సాంకేతిక బదిలీ (ToT), ఇంజిన్ అనుకూలీకరణ, ప్రత్యేక ఎగుమతి హక్కులతో సహా సమగ్ర ప్యాకేజీని అందించింది.

డ్రోన్లతో ఉగ్రదాడులకు ప్లాన్.. భయంకర కుట్రను బయటపెట్టిన ఎన్ఐఏ..

డ్రోన్లతో ఉగ్రదాడులకు ప్లాన్.. భయంకర కుట్రను బయటపెట్టిన ఎన్ఐఏ..

ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో సంచనలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హమాస్ తరహాలో దేశంపై డ్రోన్ దాడులకు విద్యావంతులైన ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. సాంకేతిక నిపుణులు, వైద్యులతో కూడిన ఈ నెట్‌వర్క్‌ పన్నాగాన్ని దర్యాప్తు అధికారులు బట్టబయలు చేశారు.

Delhi Car Blast: గాల్లోకి ఏ డ్రోన్ ఎగిరినా భయపడాల్సిందేనా?.. NIA దర్యాప్తులో విస్తుపోయే విషయాలు

Delhi Car Blast: గాల్లోకి ఏ డ్రోన్ ఎగిరినా భయపడాల్సిందేనా?.. NIA దర్యాప్తులో విస్తుపోయే విషయాలు

మనిషి తన సౌలభ్యం కోసం నిత్యం అనేక ఆవిష్కరణలు చేస్తుంటాడు. ఆ క్రమంలో వచ్చిన డ్రోన్లు మానవాళికి ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అయితే అవే ఆవిష్కరణలు ఇప్పుడు విధ్వంసాలకు, నేరాలకు సైతం ఉపయోగపడుతున్నాయి. గనుల్లో కార్మికుల కష్టాన్ని తగ్గించాలి అన్న సదుద్దేశంతో డైనమైట్ వంటి పేలుడు పదార్థాల ఆవిష్కరణ జరిగితే, ఆ తర్వాతి కాలంలో బాంబుల తయారీకి ఈ ఆవిష్కరణ మార్గం చూపింది. డ్రోన్ల విషయంలోనూ అదే జరుగుతోంది. యుద్ధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటి మానవాళికి హానిచేసే పనుల్లోనూ డ్రోన్లను విరివిగా వినియోగిస్తున్నారు.