AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahatma Kodiyar

Mahatma Kodiyar

Associate Editor - TV9 Telugu

mahatma.kodiyar@tv9.com

రెండు దశాబ్దాలకు పైగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగం నుంచి ‘ఈనాడు జర్నలిజం స్కూల్’ ద్వారా 2003లో మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. ETVలో ట్రైనీ రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించి, 2004 సార్వత్రిక ఎన్నికల కవరేజ్ తర్వాత హైదరాబాద్‌లో క్రైమ్ రిపోర్టింగ్ బాధ్యతలు చేపట్టి, అనతికాలంలోనే అక్కడ క్రైమ్ బ్యూరో ఇంఛార్జిగా పదోన్నతి పొందారు. 2007లో NTVలో చేరి, హైదరాబాద్ క్రైమ్ బ్యూరోతో పాటు కొన్నాళ్లు విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర రీజనల్ హెడ్‍‌గా పనిచేశారు. బ్రాడ్‌కాస్ట్ జర్నలిజంలో కొనసాగుతూనే.. “మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం”లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 2010లో TV9లో క్రైమ్ బ్యూరో హెడ్‌గా ప్రయాణం మొదలుపెట్టి అనేక సంచలన నేర వార్తలను వేగంగా ప్రజల ముందుకు చేర్చారు. 2012లో ఢిల్లీ బ్యూరోకి మారి, 2014 నుంచి ‘ఢిల్లీ బ్యూరో హెడ్‌’గా బాధ్యతలు చేపట్టారు. 2023లో ‘అసోసియేట్ ఎడిటర్‌’గా పదోన్నతి పొంది, 2025 ఏప్రిల్ వరకు ఢిల్లీలోనే పనిచేశారు.

2013లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో జపాన్, థాయిలాండ్ దేశాల పర్యటనతో మొదలుపెట్టి అదే ఏడాది ఉత్తరాఖండ్ ను కుదిపేసిన కేదార్‌నాథ్ జలప్రళయం, 2015లో నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం సహా కాశ్మీర్ లోయ, ఈశాన్య రాష్ట్రాల్లో చోటుచేసుకునే హింసాత్మక ఘటనలు, హిమాలయ రాష్ట్రాల్లో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు.. ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రధాన ఘట్టాలను గ్రౌండ్ జీరో నుంచి లైవ్ రిపోర్టింగ్ ద్వారా అందించారు. 2022లో మొదలైన “ఉక్రెయిన్ – రష్యా యుద్ధం” కవరేజి కోసం జర్మనీ, హంగేరీ, పోలాండ్ మీదుగా ఉక్రెయిన్ చేరుకుని, యుద్ధభూమి నుంచి వార్తలు అందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని TV9 తెలుగు హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు.

Read More
Follow On:
భారత రక్షణ రంగంలో సరికొత్త విప్లవం.. రంగంలోకి దిగుతున్న ‘హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్’!

భారత రక్షణ రంగంలో సరికొత్త విప్లవం.. రంగంలోకి దిగుతున్న ‘హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్’!

రక్షణ రంగంలో సరికొత్త సాంకేతిక సామర్థ్యాలను పెంచుకునే దిశగా భారత్ మరో కీలక అడుగు వేస్తోంది. దీర్ఘకాలిక నిఘా, గూఢచార సేకరణ, సరిహద్దుల పర్యవేక్షణ కోసం స్వదేశీ స్ట్రాటోస్ఫెరిక్ ఎయిర్‌షిప్‌లను అభివృద్ధి చేసే భారీ ప్రాజెక్ట్‌ను భారత ప్రభుత్వం ప్రారంభించినట్లు సమాచారం. ఈ హైటెక్ ప్రాజెక్ట్ విలువ సుమారు రూ.15 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు.

కాశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షల మోత.. ఆ నాలుగు చోట్ల క్యాంపింగ్, ఆఫ్-రోడింగ్‌పై నిషేధం!

కాశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షల మోత.. ఆ నాలుగు చోట్ల క్యాంపింగ్, ఆఫ్-రోడింగ్‌పై నిషేధం!

కాశ్మీర్‌లో పెరుగుతున్న పర్యాటకుల రద్దీ కారణంగా దెబ్బతింటున్న అటవీ ప్రాంతాలను కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు ప్రాంతాల్లో క్యాంపింగ్, ఆఫ్-రోడింగ్, బోన్‌ఫైర్లు, ప్లాస్టిక్ వినియోగంపై తక్షణమే నిషేధం విధించింది. ఈ ప్రాంతాలను 'జీరో వేస్ట్ జోన్లుగా' అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అటవీ శాఖ, యాంటీ-పాలిథీన్ చెక్‌పోస్టులు, వారాంత పారిశుద్ధ్య కార్యక్రమాలు, పర్యావరణహిత వ్యర్థాల నిర్వహణ వంటి చర్యలను చేపట్టనుంది.

జల వివాదాలకు చెక్.. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపుతున్న మోదీ సర్కార్..

జల వివాదాలకు చెక్.. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపుతున్న మోదీ సర్కార్..

దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదాలకు కేంద్ర ప్రభుత్వం పరిష్కార మార్గం చూపుతోంది. యమునా, నర్మదా, సోన్, కృష్ణా జలాల పంపిణీపై రాష్ట్రాల మధ్య అలాగే, కావేరి వివాదంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్యలతో సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం కావడంతో పాటు రైతులకు నీటి భద్రత, ప్రజలకు తాగునీటి సౌకర్యం మెరుగుపడనుంది.

Chabahar Port: అమెరికా దాడులు.. ఇరాన్‌లో భారత వ్యూహాత్మక ప్రాజెక్టుపై నీలినీడలు..

Chabahar Port: అమెరికా దాడులు.. ఇరాన్‌లో భారత వ్యూహాత్మక ప్రాజెక్టుపై నీలినీడలు..

US Iran War Updates: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఇరాన్‌లోని చబహార్ పోర్టు (Chabahar Port) ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. పోర్టు సమీపంలో అమెరికా జరిపిన వైమానిక దాడులు భారత్ మధ్య ఆసియా వాణిజ్యానికి కీలకమైన ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంటోంది.

షిరిడీ ఆలయ నిధులకు పటిష్ట భద్రత.. ఎలా కాపాడుతున్నారో తెలుసా?

షిరిడీ ఆలయ నిధులకు పటిష్ట భద్రత.. ఎలా కాపాడుతున్నారో తెలుసా?

అయోధ్య రామాలయంలో భక్తుల కానుకలు, విరాళాల చోరీ దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. దేశంలోని ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులు సమర్పించే కానుకలకు ఏ మేరకు భద్రత ఉందన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా, సిద్ధి వినాయక ఆలయాల్లో భక్తులు సమర్పించే కానుకలకు మెరుగైన భద్రత, పారదర్శక లెక్కల విధానాలు అమలు అవుతోంది. అక్కడ భక్తుల కానుకలు ఎలా భద్రపరుస్తారో తెలుసుకోండి.

భారత్‌కు జపాన్ ప్రధాని.. మోదీతో కీలక చర్చలు.. ప్రపంచ దేశాల స్పెషల్ ఫోకస్..

భారత్‌కు జపాన్ ప్రధాని.. మోదీతో కీలక చర్చలు.. ప్రపంచ దేశాల స్పెషల్ ఫోకస్..

జపాన్ ప్రధాని సనాయే తకైచీ జూలై 1 నుంచి భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెకు ఇదే తొలి భారత పర్యటన కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆమె నిర్వహించబోయే 16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంపై ఇప్పుడు ప్రపంచ దేశాల కళ్లు పడ్డాయి.

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్.. ‘నీటి కటకట’తో ఉలిక్కి పడుతున్న ఇస్లామాబాద్!

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్.. ‘నీటి కటకట’తో ఉలిక్కి పడుతున్న ఇస్లామాబాద్!

సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి నీటి కోసం యుద్ధానికైనా సిద్ధమని వ్యాఖ్యానించగా, భారత్ మాత్రం ఉగ్రవాదం ఆగే వరకు తన వైఖరిలో మార్పు ఉండదని స్పష్టం చేసింది.

ప్రాంతీయ పార్టీల ‘చీలిక’.. కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా? జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలివే!

ప్రాంతీయ పార్టీల ‘చీలిక’.. కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా? జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలివే!

భారత రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రాంతీయ పార్టీల చుట్టూనే చర్చ జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్లో తలెత్తుతున్న అసమ్మతి, చీలికలు జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు ఏ మేరకు లాభం చేస్తాయి? బీజేపీకి ఉన్న అవకాశాలేంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దేశవ్యాప్తంగా దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ!

దేశవ్యాప్తంగా దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ!

దేశంలో నకిలీ, ప్రమాదకరమైన మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాల్లో కఫ్ సిరప్‌ల (దగ్గు మందు) అమ్మకాలపై ఇప్పటివరకు ఉన్న మినహాయింపులను పూర్తిగా రద్దు చేసింది. ఇకపై ఎంతటి చిన్న పల్లెటూరైనా సరే.. సరైన డ్రగ్ లైసెన్స్ లేని దుకాణాల్లో కఫ్ సిరప్‌లను విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

సాగర గర్భంలో భారత్ ‘సైలెంట్ కిల్లర్’.. డ్రాగన్ గుండెల్లో మొదలై వణుకు..!

సాగర గర్భంలో భారత్ ‘సైలెంట్ కిల్లర్’.. డ్రాగన్ గుండెల్లో మొదలై వణుకు..!

భారతదేశ రక్షణ రంగ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం మొదలైంది. హిందూ మహాసముద్రంలో చైనా, పాకిస్థాన్ వంటి శత్రు దేశాల సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ తన అమ్ములపొదిలో నాలుగవ అణు క్షిపణి జలాంతర్గామిని (SSBN) సిద్ధం చేస్తోంది. 'అరిహంత్ క్లాస్' ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకున్న 'INS అరిసూదన్' (S4) ప్రస్తుతం సముద్ర గర్భంలో తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకునే తుది దశ పరీక్షల్లో నిమగ్నమై ఉంది.

న్యాయం దక్కక అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. పోలీసులు నిర్లక్ష్యంతో భగ్గుమన్న స్థానికులు.. ఏం చేశారంటే

న్యాయం దక్కక అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. పోలీసులు నిర్లక్ష్యంతో భగ్గుమన్న స్థానికులు.. ఏం చేశారంటే

రాజస్థాన్ అట్టుడుకుతోంది.జోధ్‌పూర్‌లోని ఖేరపా ప్రాంతంలో కేవలం రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. గ్యాంగ్‌రేప్ నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు, నిందితుల నుంచి ఎదురైన నిరంతర బెదిరింపులు జోధ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అసలు ఆ ఇద్దరు మహిళల ఆత్మహత్యలకు కారణమేంటో.. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఉగ్రవాద ఆలోచనలతో పాక్ నుంచి వచ్చి.. భారత్‌లో బట్టతలకు ట్రీట్మెంట్..

ఉగ్రవాద ఆలోచనలతో పాక్ నుంచి వచ్చి.. భారత్‌లో బట్టతలకు ట్రీట్మెంట్..

పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఉస్మాన్ జట్ అలియాస్ ‘చిని’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాశ్మీర్‌లో స్లీపర్ సెల్ నెట్‌వర్క్ బలోపేతానికి భారత్‌లోకి చొరబడిన అతడు, తన గుర్తింపును మార్చుకునేందుకు శ్రీనగర్‌లో రహస్యంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవడం దర్యాప్తు సంస్థలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఓజీడబ్ల్యూ నెట్‌వర్క్ సహాయంతో క్లినిక్‌లో చికిత్స పొందిన అతడు, తర్వాత నకిలీ పత్రాలతో విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది.