AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahatma Kodiyar

Mahatma Kodiyar

Associate Editor - TV9 Telugu

mahatma.kodiyar@tv9.com

రెండు దశాబ్దాలకు పైగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగం నుంచి ‘ఈనాడు జర్నలిజం స్కూల్’ ద్వారా 2003లో మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. ETVలో ట్రైనీ రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించి, 2004 సార్వత్రిక ఎన్నికల కవరేజ్ తర్వాత హైదరాబాద్‌లో క్రైమ్ రిపోర్టింగ్ బాధ్యతలు చేపట్టి, అనతికాలంలోనే అక్కడ క్రైమ్ బ్యూరో ఇంఛార్జిగా పదోన్నతి పొందారు. 2007లో NTVలో చేరి, హైదరాబాద్ క్రైమ్ బ్యూరోతో పాటు కొన్నాళ్లు విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర రీజనల్ హెడ్‍‌గా పనిచేశారు. బ్రాడ్‌కాస్ట్ జర్నలిజంలో కొనసాగుతూనే.. “మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం”లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 2010లో TV9లో క్రైమ్ బ్యూరో హెడ్‌గా ప్రయాణం మొదలుపెట్టి అనేక సంచలన నేర వార్తలను వేగంగా ప్రజల ముందుకు చేర్చారు. 2012లో ఢిల్లీ బ్యూరోకి మారి, 2014 నుంచి ‘ఢిల్లీ బ్యూరో హెడ్‌’గా బాధ్యతలు చేపట్టారు. 2023లో ‘అసోసియేట్ ఎడిటర్‌’గా పదోన్నతి పొంది, 2025 ఏప్రిల్ వరకు ఢిల్లీలోనే పనిచేశారు.

2013లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో జపాన్, థాయిలాండ్ దేశాల పర్యటనతో మొదలుపెట్టి అదే ఏడాది ఉత్తరాఖండ్ ను కుదిపేసిన కేదార్‌నాథ్ జలప్రళయం, 2015లో నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం సహా కాశ్మీర్ లోయ, ఈశాన్య రాష్ట్రాల్లో చోటుచేసుకునే హింసాత్మక ఘటనలు, హిమాలయ రాష్ట్రాల్లో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు.. ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రధాన ఘట్టాలను గ్రౌండ్ జీరో నుంచి లైవ్ రిపోర్టింగ్ ద్వారా అందించారు. 2022లో మొదలైన “ఉక్రెయిన్ – రష్యా యుద్ధం” కవరేజి కోసం జర్మనీ, హంగేరీ, పోలాండ్ మీదుగా ఉక్రెయిన్ చేరుకుని, యుద్ధభూమి నుంచి వార్తలు అందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని TV9 తెలుగు హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు.

Read More
Follow On:
యూపీ ఎన్నికలకు BJP మాస్టర్ ప్లాన్.. జాతీయ కార్యవర్గంలో అగ్రపీఠం ఆ రాష్ట్రానికే..

యూపీ ఎన్నికలకు BJP మాస్టర్ ప్లాన్.. జాతీయ కార్యవర్గంలో అగ్రపీఠం ఆ రాష్ట్రానికే..

బీజేపీ ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు భారీ ప్రాధాన్యం దక్కింది. కీలక పదవుల్లో యూపీకి చెందిన ఎనిమిది మందికి చోటు కల్పించగా, తెలంగాణ నుంచి ఒక్కరికీ అవకాశం లభించలేదు. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ జాతీయ కార్యవర్గంలో యూపీకి అత్యధిక ప్రాధాన్యత కల్పించినట్లు రాజకీయ విశ్లేషణలు సూచిస్తున్నాయి.

సముద్రంలో భారత్‌కు మరో శక్తివంతమైన ఆయుధం.. 100 కి.మీ దూరంలోని శత్రువు అంతం !

సముద్రంలో భారత్‌కు మరో శక్తివంతమైన ఆయుధం.. 100 కి.మీ దూరంలోని శత్రువు అంతం !

సముద్రంలో భారత నౌకాదళ శక్తిని మరింత పెంచేందుకు అత్యాధునిక మధ్యశ్రేణి సంచార ఆయుధాలను సమకూర్చుకునేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని శత్రు యుద్ధనౌకలు, రాడార్ కేంద్రాలు, తీర ప్రాంత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగల ఈ మానవరహిత ఆయుధాలు ఒకేసారి పది వరకు నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

యూపీలో సరికొత్త రాజకీయ వ్యూహాలు.. ఆ ఓటర్ల వైపే అన్ని పార్టీల చూపు..!

యూపీలో సరికొత్త రాజకీయ వ్యూహాలు.. ఆ ఓటర్ల వైపే అన్ని పార్టీల చూపు..!

Gen Z Voters: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కుల సమీకరణాలు, సంప్రదాయ ఓటు బ్యాంకులతో పాటు ఇప్పుడు జెన్-జీ ఓటర్లపై ప్రధాన పార్టీల దృష్టి పడింది. సోషల్ మీడియా, విద్య, ఉద్యోగ అవకాశాల వంటి అంశాలతో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలు డిజిటల్ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని యువ ఓటర్ల మద్దతు వచ్చే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో, వారిని ప్రసన్నం చేసుకోవడం పార్టీలకు కీలకంగా మారింది.

అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం.. భారత్, ఇజ్రాయెల్‌పై ‘మక్కా డీల్‌’ ప్రభావం ఎంత?

అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం.. భారత్, ఇజ్రాయెల్‌పై ‘మక్కా డీల్‌’ ప్రభావం ఎంత?

మక్కాలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం పశ్చిమాసియా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఒక దేశంపై దాడిని మూడు దేశాలపై దాడిగా పరిగణించే సూత్రంతో కుదిరిన ఈ ఒప్పందం.. అమెరికా ప్రభావం, ఇరాన్‌తో సంబంధాలు, భారత్-సౌదీ వ్యూహాత్మక బంధం, ఇజ్రాయెల్ భద్రత వంటి అంశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

భారత్ మాస్టర్ ప్లాన్.. చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టేందుకు రఫేల్ జెట్లతో భారీ వ్యూహం..

భారత్ మాస్టర్ ప్లాన్.. చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టేందుకు రఫేల్ జెట్లతో భారీ వ్యూహం..

చైనా, పాకిస్థాన్‌ల నుంచి పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భారీ రక్షణ వ్యూహానికి శ్రీకారం చుట్టింది. రూ.3.25 లక్షల కోట్ల విలువైన మెగా ఒప్పందం ద్వారా 114 కొత్త రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ ప్రతిపాదన సమర్పించింది. ఇప్పటికే ఉన్న రఫేల్ జెట్లు, నావికాదళం కోసం రానున్న రఫేల్-ఎం విమానాలతో కలిపి భవిష్యత్తులో భారత త్రివిధ దళాల వద్ద 200కుపైగా రఫేల్ యుద్ధ విమానాలు ఉండే అవకాశముంది.

ఫత్వా ఆధారంగా తలాక్ డిక్రీ చెల్లదు.. ముస్లిం విడాకులపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

ఫత్వా ఆధారంగా తలాక్ డిక్రీ చెల్లదు.. ముస్లిం విడాకులపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

MP High Court on Muslim Divorce and Fatwa: ముస్లిం విడాకులపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫత్వా ఆధారంగా తలాక్ డిక్రీ పొందలేమని స్పష్టం చేసిన కోర్టు.. ముస్లిం పురుషులు కూడా నేరుగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని పేర్కొంది.

ఇది సార్ మన రేంజ్..! ఈజిప్ట్ మనసు దోచుకున్న మన ‘పినాకా’..

ఇది సార్ మన రేంజ్..! ఈజిప్ట్ మనసు దోచుకున్న మన ‘పినాకా’..

భారత రక్షణ రంగ తయారీ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. తాజాగా, ఆఫ్రికా-మధ్యప్రాచ్య దేశాల్లో కీలక శక్తిగా ఉన్న ఈజిప్ట్.. తన సుదూర ఆర్టిలరీ సామర్థ్యాన్ని ఆధునీకరించుకునేందుకు భారత్‌కు చెందిన 'పినాకా' రాకెట్ సిస్టమ్‌ను పరిశీలిస్తోంది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన 'హిమార్స్' (HIMARS) రాకెట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా..

జంతర్‌మంతర్ టార్గెట్‌గా ఐఎస్‌ఐ భారీ ప్లాన్.. టెర్రర్ మోడ్యూల్స్ భగ్నం..!

జంతర్‌మంతర్ టార్గెట్‌గా ఐఎస్‌ఐ భారీ ప్లాన్.. టెర్రర్ మోడ్యూల్స్ భగ్నం..!

పంజాబ్ పోలీసుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISIతో సంబంధం ఉన్న రెండు ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పంజాబ్ పోలీసులు ఛేదించారు. నలుగురు మైనర్లతో సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని రద్దీ ప్రాంతమైన జంతర్‌మంతర్‌పై దాడికి కుట్ర పన్నినట్లు విచారణలో తేలడంతో కలకలం రేగింది.

UPI Payments: యూపీఐ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. రూ.2 వేలు దాటితే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం సంచలన నిర్ణయం..

UPI Payments: యూపీఐ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. రూ.2 వేలు దాటితే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం సంచలన నిర్ణయం..

యూపీఐ వాడేవారికి కేంద్రం షాకిచ్చింది. ఎండీఆర్ ఛార్జీలను విధించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే కేంద్ర ఆర్ధిక శాఖ ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. యూపీఐ ఫ్లాట్‌ఫామ్ నుంచి ఎప్పటినుంచో ఎండీఆర్ ఛార్జీలపై డిమాండ్లు వినిపిస్తున్నాయి.

భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్!

భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్!

ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్ల ముప్పు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. భారత సైన్యం తన రక్షణ వలయాన్ని మరింత పటిష్టం చేసుకుంది. యుద్ధ రంగంలో శత్రు దేశాల డ్రోన్ల దాడులను తిప్పకొట్టేందుకు భారత్ మరో శక్తివంతమైన ఆయుధాన్ని సిద్ధం చేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారైన 'శత్రుంజయ్' (Shatrunjay) యాంటీ-డ్రోన్ వ్యవస్థను సైనిక దళాల అమ్ములపొదిలో చేర్చింది.

Cloudburst: జమ్ముకశ్మీర్‌లో వరుణుడి బీభత్సం.. మెరుపు వరదల్లో 31 మంది మృతి

Cloudburst: జమ్ముకశ్మీర్‌లో వరుణుడి బీభత్సం.. మెరుపు వరదల్లో 31 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. దీంతో ఆకస్మిక వరదలు, కొండచరియలతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిది. దీంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కోట్ల రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లింది. దీంతో అక్కడి ప్రజలు భయంతో వణుకుతున్నారు. ఈ వివరాలు చూస్తే..

బాంకీపూర్ ఉపఎన్నికలో బీజేపీ కోట బద్దలు..  ప్రశాంత్ కిషోర్ ఘన విజయం.. ఓటమిపై కమలం మేథోమథనం

బాంకీపూర్ ఉపఎన్నికలో బీజేపీ కోట బద్దలు.. ప్రశాంత్ కిషోర్ ఘన విజయం.. ఓటమిపై కమలం మేథోమథనం

బిహార్‌లోని బాంకీపూర్ ఉపఎన్నికలో బీజేపీకి ఎదురైన అనూహ్య ఓటమిపై పార్టీ అంతర్గతంగా సమీక్ష ప్రారంభించింది. ఆర్జేడీ-ప్రశాంత్ కిశోర్ మధ్య ఓట్ల బదిలీ జరిగిందనే అనుమానం, అభ్యర్థి మార్పు, కోర్ ఓటర్ల అసంతృప్తి, తక్కువ పోలింగ్ వంటి అంశాలే పరాజయానికి ప్రధాన కారణాలని బీజేపీ నేతలు ప్రాథమికంగా భావిస్తున్నారు.