రెండు దశాబ్దాలకు పైగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగం నుంచి ‘ఈనాడు జర్నలిజం స్కూల్’ ద్వారా 2003లో మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. ETVలో ట్రైనీ రిపోర్టర్గా కెరీర్ ప్రారంభించి, 2004 సార్వత్రిక ఎన్నికల కవరేజ్ తర్వాత హైదరాబాద్లో క్రైమ్ రిపోర్టింగ్ బాధ్యతలు చేపట్టి, అనతికాలంలోనే అక్కడ క్రైమ్ బ్యూరో ఇంఛార్జిగా పదోన్నతి పొందారు. 2007లో NTVలో చేరి, హైదరాబాద్ క్రైమ్ బ్యూరోతో పాటు కొన్నాళ్లు విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర రీజనల్ హెడ్గా పనిచేశారు. బ్రాడ్కాస్ట్ జర్నలిజంలో కొనసాగుతూనే.. “మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం”లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 2010లో TV9లో క్రైమ్ బ్యూరో హెడ్గా ప్రయాణం మొదలుపెట్టి అనేక సంచలన నేర వార్తలను వేగంగా ప్రజల ముందుకు చేర్చారు. 2012లో ఢిల్లీ బ్యూరోకి మారి, 2014 నుంచి ‘ఢిల్లీ బ్యూరో హెడ్’గా బాధ్యతలు చేపట్టారు. 2023లో ‘అసోసియేట్ ఎడిటర్’గా పదోన్నతి పొంది, 2025 ఏప్రిల్ వరకు ఢిల్లీలోనే పనిచేశారు.
2013లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో జపాన్, థాయిలాండ్ దేశాల పర్యటనతో మొదలుపెట్టి అదే ఏడాది ఉత్తరాఖండ్ ను కుదిపేసిన కేదార్నాథ్ జలప్రళయం, 2015లో నేపాల్ను కుదిపేసిన భారీ భూకంపం సహా కాశ్మీర్ లోయ, ఈశాన్య రాష్ట్రాల్లో చోటుచేసుకునే హింసాత్మక ఘటనలు, హిమాలయ రాష్ట్రాల్లో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు.. ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రధాన ఘట్టాలను గ్రౌండ్ జీరో నుంచి లైవ్ రిపోర్టింగ్ ద్వారా అందించారు. 2022లో మొదలైన “ఉక్రెయిన్ – రష్యా యుద్ధం” కవరేజి కోసం జర్మనీ, హంగేరీ, పోలాండ్ మీదుగా ఉక్రెయిన్ చేరుకుని, యుద్ధభూమి నుంచి వార్తలు అందించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని TV9 తెలుగు హెడ్క్వార్టర్స్లో పనిచేస్తున్నారు.
అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం.. భారత్, ఇజ్రాయెల్పై ‘మక్కా డీల్’ ప్రభావం ఎంత?
మక్కాలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం పశ్చిమాసియా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఒక దేశంపై దాడిని మూడు దేశాలపై దాడిగా పరిగణించే సూత్రంతో కుదిరిన ఈ ఒప్పందం.. అమెరికా ప్రభావం, ఇరాన్తో సంబంధాలు, భారత్-సౌదీ వ్యూహాత్మక బంధం, ఇజ్రాయెల్ భద్రత వంటి అంశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
- Mahatma Kodiyar
- Updated on: Aug 8, 2026
- 8:29 am
భారత్ మాస్టర్ ప్లాన్.. చైనా, పాకిస్థాన్లకు చెక్ పెట్టేందుకు రఫేల్ జెట్లతో భారీ వ్యూహం..
చైనా, పాకిస్థాన్ల నుంచి పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భారీ రక్షణ వ్యూహానికి శ్రీకారం చుట్టింది. రూ.3.25 లక్షల కోట్ల విలువైన మెగా ఒప్పందం ద్వారా 114 కొత్త రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ ప్రతిపాదన సమర్పించింది. ఇప్పటికే ఉన్న రఫేల్ జెట్లు, నావికాదళం కోసం రానున్న రఫేల్-ఎం విమానాలతో కలిపి భవిష్యత్తులో భారత త్రివిధ దళాల వద్ద 200కుపైగా రఫేల్ యుద్ధ విమానాలు ఉండే అవకాశముంది.
- Mahatma Kodiyar
- Updated on: Aug 7, 2026
- 1:38 pm
ఫత్వా ఆధారంగా తలాక్ డిక్రీ చెల్లదు.. ముస్లిం విడాకులపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
MP High Court on Muslim Divorce and Fatwa: ముస్లిం విడాకులపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫత్వా ఆధారంగా తలాక్ డిక్రీ పొందలేమని స్పష్టం చేసిన కోర్టు.. ముస్లిం పురుషులు కూడా నేరుగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని పేర్కొంది.
- Mahatma Kodiyar
- Updated on: Aug 6, 2026
- 7:35 pm
ఇది సార్ మన రేంజ్..! ఈజిప్ట్ మనసు దోచుకున్న మన ‘పినాకా’..
భారత రక్షణ రంగ తయారీ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. తాజాగా, ఆఫ్రికా-మధ్యప్రాచ్య దేశాల్లో కీలక శక్తిగా ఉన్న ఈజిప్ట్.. తన సుదూర ఆర్టిలరీ సామర్థ్యాన్ని ఆధునీకరించుకునేందుకు భారత్కు చెందిన 'పినాకా' రాకెట్ సిస్టమ్ను పరిశీలిస్తోంది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన 'హిమార్స్' (HIMARS) రాకెట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా..
- Mahatma Kodiyar
- Updated on: Aug 5, 2026
- 6:51 pm
జంతర్మంతర్ టార్గెట్గా ఐఎస్ఐ భారీ ప్లాన్.. టెర్రర్ మోడ్యూల్స్ భగ్నం..!
పంజాబ్ పోలీసుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISIతో సంబంధం ఉన్న రెండు ఉగ్రవాద నెట్వర్క్లను పంజాబ్ పోలీసులు ఛేదించారు. నలుగురు మైనర్లతో సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని రద్దీ ప్రాంతమైన జంతర్మంతర్పై దాడికి కుట్ర పన్నినట్లు విచారణలో తేలడంతో కలకలం రేగింది.
- Mahatma Kodiyar
- Updated on: Aug 5, 2026
- 1:21 pm
UPI Payments: యూపీఐ వాడేవారికి బ్యాడ్న్యూస్.. రూ.2 వేలు దాటితే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం సంచలన నిర్ణయం..
యూపీఐ వాడేవారికి కేంద్రం షాకిచ్చింది. ఎండీఆర్ ఛార్జీలను విధించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే కేంద్ర ఆర్ధిక శాఖ ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. యూపీఐ ఫ్లాట్ఫామ్ నుంచి ఎప్పటినుంచో ఎండీఆర్ ఛార్జీలపై డిమాండ్లు వినిపిస్తున్నాయి.
- Mahatma Kodiyar
- Updated on: Aug 4, 2026
- 5:36 pm
భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్!
ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్ల ముప్పు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. భారత సైన్యం తన రక్షణ వలయాన్ని మరింత పటిష్టం చేసుకుంది. యుద్ధ రంగంలో శత్రు దేశాల డ్రోన్ల దాడులను తిప్పకొట్టేందుకు భారత్ మరో శక్తివంతమైన ఆయుధాన్ని సిద్ధం చేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారైన 'శత్రుంజయ్' (Shatrunjay) యాంటీ-డ్రోన్ వ్యవస్థను సైనిక దళాల అమ్ములపొదిలో చేర్చింది.
- Mahatma Kodiyar
- Updated on: Aug 4, 2026
- 5:12 pm
Cloudburst: జమ్ముకశ్మీర్లో వరుణుడి బీభత్సం.. మెరుపు వరదల్లో 31 మంది మృతి
జమ్మూకశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. దీంతో ఆకస్మిక వరదలు, కొండచరియలతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిది. దీంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కోట్ల రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లింది. దీంతో అక్కడి ప్రజలు భయంతో వణుకుతున్నారు. ఈ వివరాలు చూస్తే..
- Mahatma Kodiyar
- Updated on: Aug 4, 2026
- 5:11 pm
బాంకీపూర్ ఉపఎన్నికలో బీజేపీ కోట బద్దలు.. ప్రశాంత్ కిషోర్ ఘన విజయం.. ఓటమిపై కమలం మేథోమథనం
బిహార్లోని బాంకీపూర్ ఉపఎన్నికలో బీజేపీకి ఎదురైన అనూహ్య ఓటమిపై పార్టీ అంతర్గతంగా సమీక్ష ప్రారంభించింది. ఆర్జేడీ-ప్రశాంత్ కిశోర్ మధ్య ఓట్ల బదిలీ జరిగిందనే అనుమానం, అభ్యర్థి మార్పు, కోర్ ఓటర్ల అసంతృప్తి, తక్కువ పోలింగ్ వంటి అంశాలే పరాజయానికి ప్రధాన కారణాలని బీజేపీ నేతలు ప్రాథమికంగా భావిస్తున్నారు.
- Mahatma Kodiyar
- Updated on: Aug 3, 2026
- 6:17 pm
యుద్ధంలో AI తంత్రం.. చైనా భీకర వార్ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుద్ధ సాంకేతికతలో చైనా కొత్త 'AI-ఎనేబుల్డ్ ఇంటెలిజెంట్ స్ట్రైక్-ప్లానింగ్ సిస్టమ్'ను ప్రదర్శించింది. ఒకేసారి వందకు పైగా సైనిక యూనిట్లను సమన్వయం చేస్తూ వేగంగా దాడుల ప్రణాళిక రూపొందించే ఈ వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో భారత్ కూడా 'ఆకాశ్తీర్' విజయంతో పాటు 129 రక్షణ AI ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తూ, నెట్వర్క్-సెంట్రిక్ వార్ఫేర్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తోంది.
- Mahatma Kodiyar
- Updated on: Aug 3, 2026
- 11:49 am
పాక్ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే?
పాకిస్థాన్లో ఉగ్రవాదం విలయతాండవం చేస్తోంది. సైనిక శిబిరాలు, భద్రతా బలగాలే లక్ష్యంగా దాడులు తీవ్రమవ్వడంతో 2026 జూలై ఒక్క నెలలోనే ఏకంగా 200 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్లో పెరుగుతున్న హింస, వరుస టార్గెట్ కిల్లింగ్స్ ఆ దేశంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
- Mahatma Kodiyar
- Updated on: Aug 2, 2026
- 10:28 pm
భారత రక్షణ రంగంలో సరికొత్త విప్లవం.. రంగంలోకి దిగుతున్న ‘హై-ఆల్టిట్యూడ్ ఎయిర్షిప్’!
రక్షణ రంగంలో సరికొత్త సాంకేతిక సామర్థ్యాలను పెంచుకునే దిశగా భారత్ మరో కీలక అడుగు వేస్తోంది. దీర్ఘకాలిక నిఘా, గూఢచార సేకరణ, సరిహద్దుల పర్యవేక్షణ కోసం స్వదేశీ స్ట్రాటోస్ఫెరిక్ ఎయిర్షిప్లను అభివృద్ధి చేసే భారీ ప్రాజెక్ట్ను భారత ప్రభుత్వం ప్రారంభించినట్లు సమాచారం. ఈ హైటెక్ ప్రాజెక్ట్ విలువ సుమారు రూ.15 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు.
- Mahatma Kodiyar
- Updated on: Jul 14, 2026
- 6:36 pm