AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahatma Kodiyar

Mahatma Kodiyar

Associate Editor - TV9 Telugu

mahatma.kodiyar@tv9.com

రెండు దశాబ్దాలకు పైగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగం నుంచి ‘ఈనాడు జర్నలిజం స్కూల్’ ద్వారా 2003లో మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. ETVలో ట్రైనీ రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించి, 2004 సార్వత్రిక ఎన్నికల కవరేజ్ తర్వాత హైదరాబాద్‌లో క్రైమ్ రిపోర్టింగ్ బాధ్యతలు చేపట్టి, అనతికాలంలోనే అక్కడ క్రైమ్ బ్యూరో ఇంఛార్జిగా పదోన్నతి పొందారు. 2007లో NTVలో చేరి, హైదరాబాద్ క్రైమ్ బ్యూరోతో పాటు కొన్నాళ్లు విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర రీజనల్ హెడ్‍‌గా పనిచేశారు. బ్రాడ్‌కాస్ట్ జర్నలిజంలో కొనసాగుతూనే.. “మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం”లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 2010లో TV9లో క్రైమ్ బ్యూరో హెడ్‌గా ప్రయాణం మొదలుపెట్టి అనేక సంచలన నేర వార్తలను వేగంగా ప్రజల ముందుకు చేర్చారు. 2012లో ఢిల్లీ బ్యూరోకి మారి, 2014 నుంచి ‘ఢిల్లీ బ్యూరో హెడ్‌’గా బాధ్యతలు చేపట్టారు. 2023లో ‘అసోసియేట్ ఎడిటర్‌’గా పదోన్నతి పొంది, 2025 ఏప్రిల్ వరకు ఢిల్లీలోనే పనిచేశారు.

2013లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో జపాన్, థాయిలాండ్ దేశాల పర్యటనతో మొదలుపెట్టి అదే ఏడాది ఉత్తరాఖండ్ ను కుదిపేసిన కేదార్‌నాథ్ జలప్రళయం, 2015లో నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం సహా కాశ్మీర్ లోయ, ఈశాన్య రాష్ట్రాల్లో చోటుచేసుకునే హింసాత్మక ఘటనలు, హిమాలయ రాష్ట్రాల్లో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు.. ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రధాన ఘట్టాలను గ్రౌండ్ జీరో నుంచి లైవ్ రిపోర్టింగ్ ద్వారా అందించారు. 2022లో మొదలైన “ఉక్రెయిన్ – రష్యా యుద్ధం” కవరేజి కోసం జర్మనీ, హంగేరీ, పోలాండ్ మీదుగా ఉక్రెయిన్ చేరుకుని, యుద్ధభూమి నుంచి వార్తలు అందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని TV9 తెలుగు హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు.

Read More
Follow On:
పాక్, బంగ్లా సరిహద్దుల్లో పహారా మరింత పటిష్టం.. కేంద్రం కీలక నిర్ణయం..

పాక్, బంగ్లా సరిహద్దుల్లో పహారా మరింత పటిష్టం.. కేంద్రం కీలక నిర్ణయం..

భారత్ - పాకిస్తాన్ సరిహద్దులతో పాటు భారత్ - బంగ్లా సరిహద్దుల్లో పహారా బాధ్యతలు నిర్వర్తించే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)ను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ వివరాలు

పాక్‌కు చెక్‌ పెట్టేందుకు సరిహద్దుల్లో భారత్‌ అధునాతన జామర్లు.. ఇవి దేనికి ఉపయోగిస్తారు.. ఏలా పనిచేస్తాయి!

పాక్‌కు చెక్‌ పెట్టేందుకు సరిహద్దుల్లో భారత్‌ అధునాతన జామర్లు.. ఇవి దేనికి ఉపయోగిస్తారు.. ఏలా పనిచేస్తాయి!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉగ్రదాదిలో భారత్‌కు చెందిన 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో.. ఈ ఉగ్రదాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంతో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాక్‌ ఆర్మీ కాశ్మీర్‌ సహద్దుల వద్ద కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. ఇక పాక్‌ ఎత్తుడగలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్‌ త్రివిద దళాలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ మేరకు భారత్ తన పశ్చిమ సరిహద్దుల్లో అధునాతన జామర్ వ్యవస్థలను మోహరించింది. పాకిస్థాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) సిగ్నల్‌లను అడ్డుకోకునేందుకు జామర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

Lightning Strikes: అద్భుతం.. డ్రోన్‌తో మేఘాల్లో మెరుపులు.. ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు

Lightning Strikes: అద్భుతం.. డ్రోన్‌తో మేఘాల్లో మెరుపులు.. ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు

జపాన్‌కు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఎన్‌టీటీ కార్పొరేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్‌ను ఉపయోగించి మెరుపులను సృష్టించి, వాటిని నియంత్రించడంలో విజయం సాధించింది. ఈ ప్రయోగం ద్వారా సహజసిద్ధంగా మెరుపు ఏర్పడే పరిస్థితుల్లో డ్రోన్‌లను మేఘాల్లోకి పంపి విద్యుత్ క్షేత్ర ఆధారిత మెరుపును సృష్టిస్తారు. అదే సమయంలో ఏర్పడ్డ విద్యుత్తును సురక్షిత మార్గంలో భూమ్మీదకు చేర్చి ఇతర అవసరాలకు వినియోగిస్తారు.

దేశ భద్రత కోసం స్పైవేర్ ఉపయోగిస్తే తప్పేంటి?.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో సరికొత్త చర్చ..!

దేశ భద్రత కోసం స్పైవేర్ ఉపయోగిస్తే తప్పేంటి?.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో సరికొత్త చర్చ..!

భారతదేశంలో వివాదాస్పదమైన 'పెగాసస్' స్పైవేర్ (నిఘా సాఫ్ట్‌వేర్) తయారు చేసింది కూడా ఈ దేశమే. నిఘా సంస్థలకు బలమైన ఆయుధంగా మారిన ఈ స్పైవేర్‌ను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) తన రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, యాక్టివిస్టులపై ప్రయోగిస్తుంది అంటూ నాలుగేళ్ల క్రితం దేశంలో నానా రచ్చ జరిగింది. కొందరు దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించగా.. అది ఇప్పుడు తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.

సింధు నీటి ప్రవాహం ఎంత? నదీజలాలను పూర్తిగా ఆపగలమా? ఎప్పటికి సాధ్యం?

సింధు నీటి ప్రవాహం ఎంత? నదీజలాలను పూర్తిగా ఆపగలమా? ఎప్పటికి సాధ్యం?

పహల్గామ్‌ దాడి తర్వాత పాక్‌కి ఊహించని షాకిచ్చింది భారత్‌. గన్నులతో కాదు...వాటర్‌తో వేసేస్తాం అంటూ పాక్‌ని షేక్‌ చేసింది ఇండియా. డైరెక్ట్‌గా అటాక్‌ చేయకుండానే పాపిస్తాన్‌కు పరోక్షంగా బుద్ధొచ్చేలా చేసింది. సింధు నదీజలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత, 65 ఏళ్ల క్రితం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది భారత్‌.

ఇండో-పాక్ ఉద్రిక్తతల నడుమ త్రివిధ దళాల ఉమ్మడి వ్యూహం.. భారత సైన్యం అప్రమత్తం!

ఇండో-పాక్ ఉద్రిక్తతల నడుమ త్రివిధ దళాల ఉమ్మడి వ్యూహం.. భారత సైన్యం అప్రమత్తం!

భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భారత త్రివిధ దళాలు.. సైన్యం, వైమానిక దళం, నావికాదళం.. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)తో పాటు వ్యూహాత్మక ప్రాంతాల్లో తమ సన్నద్ధతను మరింత బలోపేతం చేశాయి. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సున్నితమైన భద్రతా పరిస్థితుల్లో భారత సాయుధ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఆయుధాలు, వ్యూహాలను కఠినతరం చేస్తున్నాయి.

ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్నే ఎందుకు టార్గెట్ చేశారు.? వారి హిట్‌లిస్టు యాత్రికులే..

ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్నే ఎందుకు టార్గెట్ చేశారు.? వారి హిట్‌లిస్టు యాత్రికులే..

కాశ్మీర్‌ను భూలోక స్వర్గంగా కీర్తిస్తాం. ఎత్తైన హిమగిరుల మధ్య కొలువైన అందమైన లోయలో కాశ్మీర్ విస్తరించి ఉంది. అక్కడ ఎటు చూసినా అందమైన దృశ్యాలే కనువిందు చేస్తాయి. అందుకే దేశ విదేశాల నుంచి యాత్రికులు ఆ లోయను సందర్శిస్తుంటారు. లోయలో యాత్రికులను అమితంగా ఆకట్టుకునే ప్రదేశాలు కూడా ఉన్నాయి.

కర్ణాటక కుల గణనపై గందరగోళం.. రాహుల్ గాంధీ వ్యూహం బెడిసికొట్టిందా?

కర్ణాటక కుల గణనపై గందరగోళం.. రాహుల్ గాంధీ వ్యూహం బెడిసికొట్టిందా?

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కుల గణన రాజకీయంగా ఇబ్బందులను కలిగిస్తోంది. 'జిత్నీ ఆబాదీ ఉత్నా హక్' నినాదంతో రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన ఈ వ్యూహం, వొక్కలిగ, లింగాయత్ వంటి ప్రభావవంతమైన కులాల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ నివేదిక అమలు లేదా నిలిపివేత రెండూ కాంగ్రెస్‌కు రాజకీయ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. బీజేపీ ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటోంది.

NASA: చంద్రుడిపై 50 ఏళ్ల నాటి మానవ మలం.. రీసైకిల్ చేయడానికి నాసా ఎంత ఆఫర్ చేసింది తెల్సా,,

NASA: చంద్రుడిపై 50 ఏళ్ల నాటి మానవ మలం.. రీసైకిల్ చేయడానికి నాసా ఎంత ఆఫర్ చేసింది తెల్సా,,

నదులు, మైదానాలు, పర్వతాలు, సముద్రాలు, ఎడారులు.. మనిషి స్వార్థానికి బలికానిదేదీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం భూగోళమే మనిషి నింపుతున్న చెత్త, వ్యర్థాలతో నిండిపోతోంది. ఆ మనిషి భూమినే కాదు.. అంతరిక్షాన్ని సైతం విడిచిపెట్టలేదు. భూమి చుట్టూ ఉపగ్రహాలు (శాటిలైట్లు) రూపంలో ఇప్పటికే చెత్త పేరుకుపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది చాలదన్నట్టు భూమి చుట్టూ తిరిగే చంద్రుణ్ణి సైతం వదిలిపెట్టలేదు. అక్కడ కూడా ఏకంగా 96 సంచుల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇప్పుడు ఈ అంతరిక్ష వ్యర్థాలే శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతున్నాయి. భూమ్మీద అంటే వాటిని ఎలాగోలా రీసైకిల్ చేయవచ్చు. కానీ భూమి తరహా వాతావరణం లేని అంతరిక్షంలో వాటిని రీసైకిల్ చేయడం ఎలా అన్నదే వారికి అంతుచిక్కడం లేదు. అందుకే ఎవరైనా బ్రహ్మాండమైన ఆలోచనతో ముందుకొస్తే.. ఆ ఆలోచన నిజమైన పరిష్కారాన్ని చూపితే వారికి భారీ బహుమతి ఇస్తామంటూ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) ప్రకటించింది.

Tamil Nadu: బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు తమిళ రాజకీయ పరిణామాలను సమూలంగా మార్చేస్తుందా..?

Tamil Nadu: బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు తమిళ రాజకీయ పరిణామాలను సమూలంగా మార్చేస్తుందా..?

నీట్, త్రిభాషా సూత్రం సహా అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ (BJP), అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) మధ్య 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పడిన పొత్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పొత్తు రాష్ట్ర రాజకీయ పరిణామాలను సమూలంగా మార్చబోతుంది. ఎందుకంటే ఇది రెండు భిన్నమైన రాజకీయ శక్తుల సమ్మేళనం. ఒకటి జాతీయ స్థాయిలో హిందుత్వ ఆదరణతో ఉన్న బీజేపీ కాగా, మరొకటి ద్రవిడవాదంతో ఊపిరిపోసుకుని, తమిళ జాతీయవాదంపై ఆధారపడిన అన్నాడీఎంకే.

Governors Case Verdict: రాష్ట్రపతి మూడు నెలల్లో బిల్లులపై నిర్ణయం తీసుకోవాలి: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Governors Case Verdict: రాష్ట్రపతి మూడు నెలల్లో బిల్లులపై నిర్ణయం తీసుకోవాలి: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రాష్ట్ర శాసనసభల నుంచి గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భారత సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కాలపరిమితిలోకా నిర్ణయం తీసుకోకపోతే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రపతి చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ‘తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ తమిళనాడు గవర్నర్’ కేసులో జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం ఈ చారిత్రక తీర్పును వెలువరించింది.

ఢిల్లీకి విమానంలో వెళ్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే..!

ఢిల్లీకి విమానంలో వెళ్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే..!

ఢిల్లీకి ఏదైనా పని ఉండి వెళ్తున్నారా? వీసా ఇంటర్వ్యూకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే. ఢిల్లీకి రాకపోకలు సాగించే విమాన సర్వీసులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులే స్వయంగా ప్రకటించారు. ఇదేదో ఒకట్రెండు రోజుల సమస్య కాదు. ఏకంగా 4 నెలల పాటు ఈ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.