ఐటీ – టెక్నాలజీ రంగంలో గ్రాడ్యుయేట్ అయినప్పటికీ ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా 2003లో మీడియా రంగంలోకి అడుగుపెట్టాను. ఈటీవీలో ట్రైనీ రిపోర్టర్ గా మొదలైన ప్రయాణంలో 2004 సార్వత్రిక ఎన్నికల కవరేజ్ తర్వాత క్రైమ్ రిపోర్టింగ్ చేపట్టాను. అక్కడే క్రైమ్ బ్యూరో ఇంఛార్జిగా పదోన్నతి పొంది, ఆ తర్వాత 2007లో NTV లో చేరాను. అక్కడ హైదరాబాద్ క్రైమ్ బ్యూరోతో పాటు విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర రీజనల్ హెడ్ గా పనిచేశాను. ఈ మధ్యలోనే జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. 2010లో టీవీ9లో క్రైమ్ బ్యూరో హెడ్గా ప్రయాణం మొదలుపెట్టి 2012లో ఢిల్లీ బ్యూరోకి మారాను. 2014 నుంచి సీనియర్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ర్యాంక్లో ‘ఢిల్లీ బ్యూరో హెడ్’గా బాధ్యతలు చేపట్టి 2023 నుంచి ‘అసోసియేట్ ఎడిటర్’గా కొనసాగుతున్నాను. 2013లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో జపాన్, థాయిలాండ్ దేశాల పర్యటనతో మొదలుపెట్టి అదే ఏడాది ఉత్తరాఖండ్ ను కుదిపేసిన కేదార్నాథ్ జలప్రళయం, 2015లో నేపాల్ను కుదిపేసిన భారీ భూకంపం, కాశ్మీర్ లోయ, ఈశాన్య రాష్ట్రాల్లో చోటుచేసుకునే హింసాత్మక ఘటనలు, హిమాలయ రాష్ట్రాల్లో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు సహా 2022లో మొదలైన “ఉక్రెయిన్ – రష్యా యుద్ధం” కవరేజ్ వరకు నిత్యం వివిధ రాష్ట్రాలు, దేశాలు పర్యటిస్తూ గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాను.
IMD Warns: భారత్లో ఇక భగభగలే.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తీవ్ర వడగాలులు.. హెచ్చరించిన ఐఎండీ
IMD Warns:సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో భారత్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. తెల్లటి మంచు దుప్పటి కప్పుకునే హిమగిరులు సైతం కరిగి పచ్చని పచ్చిక బయటపడుతుంది. ఇది ప్రతి వేసవిలో సర్వ సాధారణమే. కానీ.. ఈ ఏడాది అలా కాదు అంటున్నారు భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు..
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Mar 31, 2025
- 9:40 pm
Nidhi Tewari: ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి.. ఇంతకీ ఎవరీ అధికారి?
చిన్న వయస్సుల్లోనే ప్రధాని కార్యాలయంలో కీలక బాధ్యతల్ని చేపట్టనున్నారు 2014 బ్యాచ్ 'ఇండియన్ ఫారిన్ సర్వీసెస్' (IFS) అధికారిణి నిధి తివారి. ఆమెను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీ (PS)గా నియమిస్తూ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ACC) మెమో జారీ చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ యువ ఐఎఫ్ఎస్ అధికారిణిపై పడింది. ఇంతకీ నిధి తివారీ ఎవరు? ఇక్కడ చూద్దాం..
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Mar 31, 2025
- 4:48 pm
‘డంకీ’లు కొట్టించి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు.. అసలింతకీ ‘డంకీ’ మార్గం అంటే ఏంటో తెలుసా?
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అక్రమ మార్గాల్లో విదేశాలకు భారతీయులను తరలిస్తున్న 'డంకీ' ముఠాల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. అమెరికా నుండి వెనక్కి పంపిన 636 మంది భారతీయుల విషయంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. వీరు అక్రమంగా భారత్ నుంచి అమెరికాకు ఎలా చేరుకున్నారు? దీని వెనుకున్న డంకీ ముఠాలపై ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సిండికేట్ను NIA గుర్తించింది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Mar 31, 2025
- 2:03 pm
Myanmar: మయన్మార్ భూకంపానికి కారణం అదేనా.? అందుకే ఇంత విధ్వంసమా.?
భూకంపాలకు భూమ్మీద తేలియాడుతున్నట్టుగా ఉండే 'టెక్టానిక్' ఫలకాల కదలికలే కారణమని ఎవరిని అడిగినా చెబుతారు. తుఫాన్లు, వరదలు, వర్షాభావ పరిస్థితులు సహా ప్రకృతికి సంబంధించి ఎన్నో విషయాలను ముందుగానే పసిగట్టే పరిజ్ఞానం మానవాళికి సొంతమైనప్పటికీ.. భూకంపాల విషయంలో ముందుగా పసిగట్టే పరిజ్ఞానం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Mar 30, 2025
- 7:13 am
దౌత్య సంబంధాలతో విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు విముక్తి!
విదేశీ జైళ్ళలో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను విడుదల చేయడంలో మోదీ ప్రభుత్వం గణనీయమైన విజయం సాధించింది. దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, అరబ్ దేశాలతో సహకారం ద్వారా చిన్న చిన్న నేరాలకు శిక్ష అనుభవిస్తున్నవారి విడుదలకు కృషి చేసింది. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Mar 29, 2025
- 10:22 am
తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..? ఏం చేయాల్సి ఉంటుంది..
సమాజంలో తప్పు చేసినవారికి న్యాయమూర్తులు శిక్ష విధిస్తారు. మరి ఆ న్యాయమూర్తే తప్పు చేస్తే? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశవ్యాప్తంగా పలువురి మదిలో మెదులుతోంది. ఇందుక్కారణం దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో కరెన్సీ కట్టల వ్యవహారం.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Mar 26, 2025
- 10:25 am
బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ జాతీయ నాయకత్వం వైఖరేంటి..? కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచిన నిర్ణయంపై బీజేపీ వైఖరి అస్పష్టంగా ఉంది. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నదీ ఇదేనని, బీసీలకు కీడే చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్రం ఈ పెంపును ఆమోదించే అవకాశం తక్కువగా ఉంది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Mar 20, 2025
- 9:48 pm
BJP Chief: బీజేపీ జాతీయాధ్యక్షుడిపై కమలదళం కసరత్తు.. ప్రకటన ఎప్పడంటే..!
పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, విద్యార్థి దశ నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు, కార్యకర్తలకు మధ్య సమన్వయలోపం పెద్ద సమస్యగా మారింది. ఇది చివరకు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలకు ఆస్కారం కల్గించిందని కూడా పార్టీ అధినాయకత్వం, ఆర్ఎస్ఎస్ అంచనా వేసింది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Mar 19, 2025
- 2:48 pm
పదమూడేళ్ల ప్రాయం.. మసస్తత్వం, మనోవికాసంపై పుస్తకం! ఎవరా అమ్మాయి? ఏమా కథ?
13 ఏళ్ల తెలుగు అమ్మాయి శ్రేష్ట కోదాటి "YOU-NIVERSE" అనే స్వయం సహాయక పుస్తకాన్ని రాసి అమెజాన్లో బెస్ట్ సెల్లర్గా నిలిచింది. హైదరాబాద్ మూలాలతో ఖతార్లో నివసిస్తున్న శ్రేష్ట, రచనతో పాటు క్రీడలు, ఇతర రంగాలలోనూ ప్రతిభ చాటుతోంది. ఆమె పుస్తకం ప్రజల్లో చైతన్యం తీసుకురావడంపై దృష్టి సారిస్తుంది. భారత పార్లమెంట్లో ఎంపీలను కలిసి తన పుస్తకాన్ని అందజేసింది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Mar 19, 2025
- 2:20 pm
స్టూడెంట్ వీసా రద్దు.. అగ్రరాజ్యం నుంచి వెనక్కి.. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి..?
అక్రమ వలసదారులను వెతికి మరీ వెనక్కి పంపిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. తాజాగా ఓ విద్యార్థిని వీసాను రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. భారతీయ విద్యార్థి రజనీ శ్రీనివాసన్ వీసాను అమెరికా రద్దు చేసింది. కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఈ భారతీయ విద్యార్థి హమాస్కు మద్దతు ఇస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Mar 15, 2025
- 1:10 pm
ATV: సరిహద్దు గస్తీలో భారత ఆర్మీ కీలక ముందడుగు.. ఇక శత్రు దేశాలకు దబిడి దిబిడే..!
దేశ సరిహద్దుల్లో భారత సేనల గస్తీ మరింత బలోపేతం కానుంది. కొండలు, లోయలు, వాగులు, వంకలు, మంచుతో కప్పేసిన నేలలు.. ఇలాంటి విభిన్న భౌగోళిక పరిస్థితులున్న ప్రాంతాల్లో అన్ని వాహనాలు నడపలేం. అందుకే భారత ఆర్మీ అధునాతన "ఆల్ టెర్రయిన్ వెహికిల్స్ (ATVs)"ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఏటీవీ అంటే ఏంటి? దాని ప్రత్యేకతలేంటి? తెలుసుకుందాం...
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Mar 12, 2025
- 5:09 pm
Lalit Modi: లలిత్ మోడీకి ఎదురుదెబ్బ.. టీవీ9 కథనాలతో మారిన ఆర్థిక నేరగాడి విధి రాత
భారత్లో నేరాలకు పాల్పడి దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోడానికి విదేశాల్లో పుష్కలమైన అవకాశాలున్నాయి. అక్రమార్జనతో దేశం విడిచి వెళ్తే చాలు.. వారిని వెనక్కి తీసుకురావడానికి యుద్ధం చేసినంత శ్రమించాల్సి వస్తోంది. ఆయా దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంటే సరి.. లేదంటే వెనక్కి తీసుకురావడం దాదాపు అసాధ్యంగా మారుతోంది. దీన్నే తనకు అనుకూలంగా మలుచుకున్న లలిత్ మోదీ..
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Mar 10, 2025
- 3:41 pm