రెండు దశాబ్దాలకు పైగా మల్టీ ఫార్మాట్ జర్నలిజంలో కొనసాగుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగం నుంచి ‘ఈనాడు జర్నలిజం స్కూల్’ ద్వారా 2003లో మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. ETVలో ట్రైనీ రిపోర్టర్గా కెరీర్ ప్రారంభించి, 2004 సార్వత్రిక ఎన్నికల కవరేజ్ తర్వాత హైదరాబాద్లో క్రైమ్ రిపోర్టింగ్ బాధ్యతలు చేపట్టి, అనతికాలంలోనే అక్కడ క్రైమ్ బ్యూరో ఇంఛార్జిగా పదోన్నతి పొందారు. 2007లో NTVలో చేరి, హైదరాబాద్ క్రైమ్ బ్యూరోతో పాటు కొన్నాళ్లు విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర రీజనల్ హెడ్గా పనిచేశారు. బ్రాడ్కాస్ట్ జర్నలిజంలో కొనసాగుతూనే.. “మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం”లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 2010లో TV9లో క్రైమ్ బ్యూరో హెడ్గా ప్రయాణం మొదలుపెట్టి అనేక సంచలన నేర వార్తలను వేగంగా ప్రజల ముందుకు చేర్చారు. 2012లో ఢిల్లీ బ్యూరోకి మారి, 2014 నుంచి ‘ఢిల్లీ బ్యూరో హెడ్’గా బాధ్యతలు చేపట్టారు. 2023లో ‘అసోసియేట్ ఎడిటర్’గా పదోన్నతి పొంది, 2025 ఏప్రిల్ వరకు ఢిల్లీలోనే పనిచేశారు.
2013లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో జపాన్, థాయిలాండ్ దేశాల పర్యటనతో మొదలుపెట్టి అదే ఏడాది ఉత్తరాఖండ్ ను కుదిపేసిన కేదార్నాథ్ జలప్రళయం, 2015లో నేపాల్ను కుదిపేసిన భారీ భూకంపం సహా కాశ్మీర్ లోయ, ఈశాన్య రాష్ట్రాల్లో చోటుచేసుకునే హింసాత్మక ఘటనలు, హిమాలయ రాష్ట్రాల్లో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు.. ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రధాన ఘట్టాలను గ్రౌండ్ జీరో నుంచి లైవ్ రిపోర్టింగ్ ద్వారా అందించారు. 2022లో మొదలైన “ఉక్రెయిన్ – రష్యా యుద్ధం” కవరేజి కోసం జర్మనీ, హంగేరీ, పోలాండ్ మీదుగా ఉక్రెయిన్ చేరుకుని, యుద్ధభూమి నుంచి వార్తలు అందించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని TV9 తెలుగు హెడ్క్వార్టర్స్లో పనిచేస్తున్నారు.
భారత్-రష్యా రక్షణ ఒప్పందాలు.. పుతిన్ పర్యటన సందర్భంగా కొత్త అధ్యాయం..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో జరుపుతున్న భారత్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతమవుతుందని అధికారిక సమాచారం. 2025 డిసెంబర్ 3న రష్యా పార్లమెంట్లోని లోయర్ హౌస్ రికర్సిప్రొకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ (RELOS) ఒప్పందాన్ని ఆమోదించడంతో ఈ సహకారం కొత్త దిశలో అడుగుపెట్టింది.
- Mahatma Kodiyar
- Updated on: Dec 4, 2025
- 8:13 am
Putin India Tour: పుతిన్ భారత్ పర్యటన.. డిసెంబర్ 4-5న ఢిల్లీలో భారత్-రష్యా శిఖరాగ్ర సదస్సు
Putin India Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్లో అధికారిక పర్యటన నిర్వహించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక అంశాలపై సమగ్ర చర్చలు జరగనున్నాయని..
- Mahatma Kodiyar
- Updated on: Dec 3, 2025
- 9:52 pm
BrahMos: ఇండోనేషియా రక్షణ మంత్రి భారతలో పర్యటన.. “బ్రహ్మోస్” సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఒప్పందం
BrahMos: కేంద్ర రక్షణశాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ఒప్పందం ఇప్పుడు తుది దశలో ఉంది. ఇండోనేషియా చాలా కాలంగా బ్రహ్మోస్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. జనవరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మధ్య జరిగిన..
- Mahatma Kodiyar
- Updated on: Nov 27, 2025
- 12:37 pm
భారతదేశానికి రష్యా మరో బంపర్ ఆఫర్.. పూర్తి సాంకేతికతతో ఫైటర్ జెట్ ప్యాకేజీ!
రష్యాకు చెందిన అత్యాధునిక ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్, Su-75 "చెక్మేట్" కోసం భారతదేశానికి ప్రత్యేక ఆఫర్ ఇచ్చింది. దుబాయ్ ఎయిర్ షో 2025లో, సుఖోయ్ డిజైన్ బ్యూరో ఈ విమానం మొదటి విమానం 2026 ప్రారంభంలో అందించనున్నట్లు ప్రకటించింది. రష్యా భారతదేశానికి పూర్తి సాంకేతిక బదిలీ (ToT), ఇంజిన్ అనుకూలీకరణ, ప్రత్యేక ఎగుమతి హక్కులతో సహా సమగ్ర ప్యాకేజీని అందించింది.
- Mahatma Kodiyar
- Updated on: Nov 25, 2025
- 4:36 pm
డ్రోన్లతో ఉగ్రదాడులకు ప్లాన్.. భయంకర కుట్రను బయటపెట్టిన ఎన్ఐఏ..
ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో సంచనలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హమాస్ తరహాలో దేశంపై డ్రోన్ దాడులకు విద్యావంతులైన ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. సాంకేతిక నిపుణులు, వైద్యులతో కూడిన ఈ నెట్వర్క్ పన్నాగాన్ని దర్యాప్తు అధికారులు బట్టబయలు చేశారు.
- Mahatma Kodiyar
- Updated on: Nov 18, 2025
- 4:39 pm
Delhi Car Blast: గాల్లోకి ఏ డ్రోన్ ఎగిరినా భయపడాల్సిందేనా?.. NIA దర్యాప్తులో విస్తుపోయే విషయాలు
మనిషి తన సౌలభ్యం కోసం నిత్యం అనేక ఆవిష్కరణలు చేస్తుంటాడు. ఆ క్రమంలో వచ్చిన డ్రోన్లు మానవాళికి ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అయితే అవే ఆవిష్కరణలు ఇప్పుడు విధ్వంసాలకు, నేరాలకు సైతం ఉపయోగపడుతున్నాయి. గనుల్లో కార్మికుల కష్టాన్ని తగ్గించాలి అన్న సదుద్దేశంతో డైనమైట్ వంటి పేలుడు పదార్థాల ఆవిష్కరణ జరిగితే, ఆ తర్వాతి కాలంలో బాంబుల తయారీకి ఈ ఆవిష్కరణ మార్గం చూపింది. డ్రోన్ల విషయంలోనూ అదే జరుగుతోంది. యుద్ధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటి మానవాళికి హానిచేసే పనుల్లోనూ డ్రోన్లను విరివిగా వినియోగిస్తున్నారు.
- Mahatma Kodiyar
- Updated on: Nov 17, 2025
- 9:47 pm
ఈ మోనో రైల్ చూశారా.. ఆకాశం అంచులను తాకుతూ వెళ్తుంది.. ఎక్కడంటే..!
భారతదేశ సరిహద్దుల్లో భౌగోళికంగా అత్యంత క్లిష్టమైనవి హిమాలయాలే. హిమాలయాలు భారతదేశానికి పొరుగున ఉన్న పాకిస్తాన్, టిబెట్, మయన్మార్ వంటి దేశాల్లోనూ విస్తరించి హద్దులు పంచుకుంటున్నాయి. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో, అత్యంత శీతల వాతావరణంలో ఉన్న ఈ హిమగిరులపై సరిహద్దులు గస్తీ కాయడాన్ని మించిన క్లిష్టమైన పని మరొకటి లేదు.
- Mahatma Kodiyar
- Updated on: Nov 14, 2025
- 8:38 pm
Telugu IPS officer: జైష్-ఇ ఉగ్రకుట్రను భగ్నం చేసింది మన తెలుగు ఐపీఎస్ అధికారే.. ఆయన బ్యాగ్రౌండ్ తెలుసా..?
ఒక చిన్న పోస్టర్ వెనుక పెద్ద ఉగ్రవాద కుట్ర దాగి ఉంది. తెలుగు ఐపీఎస్ అధికారి డా. జీవీ సందీప్ చక్రవర్తి అప్రమత్తతతో జైష్-ఇ-మహమ్మద్ (JeM) మాడ్యూల్ బహిర్గతమైంది. కర్నూల్కి చెందిన ఈ డాక్టర్ కమ్ ఐపీఎస్ ఆఫీసర్... సున్నితమైన నౌగామ్ ప్రాంతంలో వెలిసిన హెచ్చరిక పోస్టర్ను పసిగట్టి, దేశవ్యాప్తంగా విస్తరించిన “వైట్ కోట్ టెర్రర్” నెట్వర్క్ను చేధించాడు.
- Mahatma Kodiyar
- Updated on: Nov 13, 2025
- 9:54 pm
Pahalgam: పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత తొలిసారిగా తెలుగు సినిమా షూటింగ్.. హీరో ఎవరంటే..?
ఉగ్రదాడులతో క్షోభకు గురైన ఆ లోయ మళ్లీ కళల స్వర్గంగా మారుతోంది. పహల్గాం ఘటన తర్వాత మొదటగా అక్కడ అడుగుపెట్టిన సినిమా యూనిట్ కూడా తెలుగుదే కావడం విశేషం. ఉగ్రదాడి మిగిల్చిన గాయాల మధ్య మళ్లీ కెమెరా రోలింగ్ ప్రారంభమవడంతో స్థానిక కశ్మీరీలకు ఉపాధి, పర్యాటక రంగానికి ఊపిరి, లోయకు మరోసారి జీవం లభించింది.
- Mahatma Kodiyar
- Updated on: Nov 6, 2025
- 4:49 pm
Starlink: భారత్లో స్టార్లింక్ సేవలు.. ఇక గ్రామాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్.. ముందుగా ఏ రాష్ట్రంలో అంటే?
బయో-మెట్రిక్ అటెండెన్స్ కోసమో లేక ఆన్లైన్ క్లాసుల కోసమో కొండలు, చెట్లు ఎక్కి మొబైల్ నెట్వర్క్ కోసం తంటాలు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు.. లేక ఇంటర్నెట్ ఆధారిత సేవలు అందుకోవడం కోసం తంటాలు పడుతున్న సామాన్యుల దృశ్యాలు భారత్లో అనేక చోట్ల కనిపిస్తుంటాయి.
- Mahatma Kodiyar
- Updated on: Nov 6, 2025
- 3:48 pm
BrahMos missile: బ్రహ్మోస్ క్షిపణులకు భలే గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు
భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులకు ప్రంపచ మార్కెట్లో డిమాండ్ భారీగా పెరిగింది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్లో వాటి పనితీరును చూసిన యావత్ ప్రపంచం.. ఇప్పుడు వాటిని కొనుగోలు చేసేందుకు క్యూ కట్టాయి. దీంతో మన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణినికి డిమాండ్ బాగా పెరిగింది.
- Mahatma Kodiyar
- Updated on: Nov 5, 2025
- 8:05 pm
భారత్కు రష్యా బంపర్ ఆఫర్.. శత్రు దేశాల గుండెల్లో పరుగెడుతున్న రైళ్లు..!
రక్షణ రంగంలో భారతదేశానికి చిరకాలంగా సహకరిస్తూ వస్తున్న రష్యా.. తాజాగా మరో ఆఫర్ ఇచ్చింది. సుఖోయ్-30MKI ఫైటర్ జెట్లలో ఉపయోగించేందుకు రష్యా తన "Kh-69 స్టెల్త్ ఎయిర్-లాంచ్డ్ క్రూయిజ్" క్షిపణి (ALCM) టెక్నాలజీకి భారత్కు బదిలీ చేసేందుకు ప్రతిపాదించింది. తద్వారా ఈ క్షిపణులను భారతదేశం స్వయంగా తయారుచేసుకుని, తమ యుద్ధ విమానాల్లో ఉపయోగించుకోవచ్చు.
- Mahatma Kodiyar
- Updated on: Nov 5, 2025
- 1:42 pm