ఐటీ – టెక్నాలజీ రంగంలో గ్రాడ్యుయేట్ అయినప్పటికీ ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా 2003లో మీడియా రంగంలోకి అడుగుపెట్టాను. ఈటీవీలో ట్రైనీ రిపోర్టర్ గా మొదలైన ప్రయాణంలో 2004 సార్వత్రిక ఎన్నికల కవరేజ్ తర్వాత క్రైమ్ రిపోర్టింగ్ చేపట్టాను. అక్కడే క్రైమ్ బ్యూరో ఇంఛార్జిగా పదోన్నతి పొంది, ఆ తర్వాత 2007లో NTV లో చేరాను. అక్కడ హైదరాబాద్ క్రైమ్ బ్యూరోతో పాటు విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర రీజనల్ హెడ్ గా పనిచేశాను. ఈ మధ్యలోనే జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. 2010లో టీవీ9లో క్రైమ్ బ్యూరో హెడ్గా ప్రయాణం మొదలుపెట్టి 2012లో ఢిల్లీ బ్యూరోకి మారాను. 2014 నుంచి సీనియర్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ర్యాంక్లో ‘ఢిల్లీ బ్యూరో హెడ్’గా బాధ్యతలు చేపట్టి 2023 నుంచి ‘అసోసియేట్ ఎడిటర్’గా కొనసాగుతున్నాను. 2013లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో జపాన్, థాయిలాండ్ దేశాల పర్యటనతో మొదలుపెట్టి అదే ఏడాది ఉత్తరాఖండ్ ను కుదిపేసిన కేదార్నాథ్ జలప్రళయం, 2015లో నేపాల్ను కుదిపేసిన భారీ భూకంపం, కాశ్మీర్ లోయ, ఈశాన్య రాష్ట్రాల్లో చోటుచేసుకునే హింసాత్మక ఘటనలు, హిమాలయ రాష్ట్రాల్లో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు సహా 2022లో మొదలైన “ఉక్రెయిన్ – రష్యా యుద్ధం” కవరేజ్ వరకు నిత్యం వివిధ రాష్ట్రాలు, దేశాలు పర్యటిస్తూ గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాను.
Union Budget 2024: ఉపాధి కల్పనే లక్ష్యం.. నైపుణ్య శిక్షణే మార్గం.. కేంద్రం ఏకంగా రూ. 2 లక్షల కోట్లతో కొత్త పథకం
యువ రక్తంతో నిండిన భారతదేశం మాత్రమే కాదు, నిరుద్యోగ సమస్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను వేధిస్తోంది. విద్యావకాశాలు పెరగడంతో యూనివర్సిటీల నుంచి పట్టభద్రులు కుప్పలుతెప్పలుగా బయటికొస్తున్నారు. అయితే చాలామంది చేతిలో డిగ్రీ పట్టాలు ఉంటున్నాయి కానీ ఏదైనా ఉద్యోగం చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేయడంలో ఇది కూడా ఒక కీలకాంశంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని కొత్త పథకాలను ప్రతిపాదించింది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 25, 2024
- 8:20 pm
Health Survey: దేశంలో పెరిగిన ఊబకాయం.. అధిక బరువు సమస్య. కారణం అదేనా?
"భారతీయులు తెగ తినేస్తున్నారు" అంటూ అప్పట్లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహర పదార్థాల కొరత ఏర్పడ్డ నేపథ్యంలో భారత్, చైనా దేశాలు అత్యధికంగా ఆహారపదార్థాలను వినియోగిస్తున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తమైంది. అయితే ఈ మాట ఇప్పుడు అన్వయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును.. భారతదేశంలో ఊబకాయం పెరిగిపోతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS-5)లో గణాంకాలు చూస్తే మతిపోతుంది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 22, 2024
- 2:28 pm
హడలెత్తిస్తున్న నిపా వైరస్, కేంద్రం అప్రమత్తం, కేరళకు వైద్య బృందం
కేరళలో ఓ 14 ఏళ్ల బాలుడి ప్రాణాలు బలితీసుకున్న 'నిపా' వైరస్పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ మరణం నిపా వైరస్ కారణంగానే సంభవించిందని ధృవీకరించుకున్న వెంటనే కేరళకు వైద్య బృందాన్ని పంపించింది. ప్రాణాంతకంగా మారిన ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. కేరళ రాష్ట్రానికి ఆ మేరకు సూచనలు జారీ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 22, 2024
- 7:35 am
హైదరాబాద్లో మినరల్ ఎక్స్ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో
ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకునేందుకు సృజనాత్మక విధానంలో ముందుకెళ్లడం, అంతర్జాతీయంగా అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అలవర్చుకోవడం తదితర అంశాల ద్వారా మైనింగ్ రంగంలో మరింత అభివృద్ధి సాధించే లక్ష్యంతో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లోని బేగంపేటలో మినరల్ ఎక్స్ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్షో జరగనుంది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 19, 2024
- 8:13 pm
బొగ్గు దిగుమతులు తగ్గించుకునే దిశగా దృష్టిపెట్టాలి..
బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని.. ఈ విషయంలో మరింత సానుకూల ఫలితాలు సాధించేందుకు బొగ్గు దిగుమతుల మీద ఆధారపడకుండా.. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు కృషిచేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 19, 2024
- 7:37 pm
New Drug Test Kit: త్వరలో నార్కో- డ్రగ్ టెస్టుల కోసం సరికొత్త ఆయుధం.. ఈజీగా దొరికిపోతారు..!
దేశంలో గ్రామ గ్రామానికి విస్తరిస్తున్న విష సంస్కృతి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. డ్రగ్స్ను కట్టడి చేసే క్రమంలో అనుమానితుల వద్ద సేకరించిన శాంపిళ్లను పరీక్షించడమే ఓ పెద్ద పనిగా మారడం కేసుల నమోదు ప్రక్రియను ఆలస్యం చేస్తోంది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 19, 2024
- 10:30 am
Supreme Court: ఒక పరీక్ష.. అనేక వివాదాలు.. నీట్-యూజీ లీక్పై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) లీకేజి వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. శనివారం (జులై 20) మధ్యాహ్నం గం. 12.00 వరకు అభ్యర్థుల మార్కులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. నగరాలు, పరీక్ష కేంద్రాల వారిగా ఈ మార్కుల వివరాలను పొందుపరుస్తూనే.. విద్యార్థుల ఐడెంటిటీని మాత్రం బయటపెట్టవద్దని స్పష్టం చేసింది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 18, 2024
- 11:50 pm
BJP: ఆ 10 కారణాలే యూపీలో బీజేపీ కొంప ముంచాయా..
లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) కేవలం 240 స్థానాలకే పరిమితం కావడంలో ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో తగిలిన ఎదురుదెబ్బలే కారణం. మహారాష్ట్ర సంగతెలా ఉన్నా.. కమలదళానికి కంచుకోటలా మారిందని భావించిన ఉత్తర్ప్రదేశ్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం ఆ పార్టీ అధినేతలను తీవ్రంగా కలచివేసింది. ఢిల్లీ పీఠంపై కూర్చోవాలంటే ముందు యూపీ గడ్డపై గెలవాలి అన్నది దేశ రాజకీయాల్లో ఉన్న నానుడి.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 18, 2024
- 9:36 pm
Indian Passports: భారత పోస్పోర్టులు సరెండ్ చేస్తున్న గోవా వాసులు.. కారణమేంటంటే?
ప్రపంచ చిత్రపటంపై భారతీయ వృత్తి నిపుణులు వేసిన ముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు అమెరికా, కెనడా, యూకే వంటి ఆంగ్లం మాట్లాడే దేశాలకే ఎక్కువగా మన నిపుణులు వలస పోయేవారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ ఖండంలో, ఏ దేశంలో చూసినా భారతీయ ఇంజనీర్లు, వైద్యులు, ఇతర సాంకేతిక నిపుణులు కనిపిస్తున్నారు.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 17, 2024
- 1:42 pm
Donald Trump 2.0: ట్రంప్ పునరాగమనం భారత్కు లాభమా.. నష్టమా?
డొనాల్డ్ ట్రంప్ - నరేంద్ర మోదీ మధ్య మంచి స్నేహ బంధం ఉండడం, గత ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం మోదీ ప్రచారం కూడా చేయడంతో.. దేశంలోని మోదీ అభిమానులు ట్రంప్ అనుకూల వైఖరిని వ్యక్తం చేస్తున్నారు. కానీ ట్రంప్ గతంలో అనుసరించిన విధానాలు, ఇప్పుడు ప్రకటిస్తున్న విధానాలు ఏవీ కూడా భారతదేశానికి అంత అనుకూలం కాదని స్పష్టమవుతోంది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 16, 2024
- 10:26 am
Delhi CM: కేజ్రీవాల్ బరువుపై వివాదం.. జైలు అధికారులు ఏం చెబుతున్నారంటే?
రాజకీయ నాయకుల 'బరువు' సైతం వార్తాంశంగా మారి వివాదం సృష్టిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఇదే జరుగుతోంది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టయి ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఏకంగా 8.5 కేజీల బరువు తగ్గిపోయారని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 15, 2024
- 8:50 pm
వారానికి ఒక్క రోజే పని.. 6 రోజులు విశ్రాంతి.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు!
వారానికి ఒక్క రోజు విశ్రాంతి దొరకడమే గగనంగా మారిన రోజులు ఇవి. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, కొన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, ఐటీ పరిశ్రమలో మాత్రమే వారానికి 2 రోజుల విరామం ఉంటుంది. మరికొన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఇంకో అడుగు ముందుకేసి వారంలో 4 రోజులు పని, 3 రోజుల విరామం అందిస్తున్నాయి. ఇంతకు మించి ప్రపంచంలో మరెక్కడా విరామం వెసులుబాటు లేదు.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 12, 2024
- 7:10 pm