Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నితీష్ కుమార్ రెడ్డి

నితీష్ కుమార్ రెడ్డి

టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం. కుడిచేతి వాటం బ్యాటరైన నితీశ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి తన మెరుపు బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత టీమిండియా తలుపు తట్టాడు. 2024 అక్టోబర్ 6న బంగ్లాదేశ్ పై టీ20 అరంగేట్రం చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా పెర్త్‌ టెస్టులో 2024 నవంబర్ 2024న టెస్ట్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. బీజీటీ-2024లో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన నాలుగో టెస్టులో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగి శతకం బాది చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో నితీశ్ కు ఇది మొదటి సెంచరీ కావడం విశేషం.

ఇక నితీష్‌ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 లక్షలతో ఈ వైజాగ్ కుర్రోడిని సొంతం చేసుకుంది. 2024 సీజన్ లో అద్బుతంగా రాణించడంతో 2025 మెగా వేలానికి ముందు రూ. 6 కోట్లతో తిరిగి నితీశ్ ను రిటైన్ చేసుకుంది.

ఇంకా చదవండి

Nitish Kumar Reddy: నాన్నకు ప్రేమతో.. తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి

నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ కెరీర్ కోసం తన ఉద్యోగాన్ని, జీవితాన్ని సైతం వదులుకున్నాడు ఆయన తండ్రి ముత్యాల రెడ్డి. ఈ క్రమంలో తన తండ్రి త్యాగానికి గుర్తుగా ఆయనకు ఒక మరుపు రాని బహుమతి ఇచ్చాడు టీమిండియా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి.

Nitish Kumar Reddy: ‘మరిన్ని సెంచరీలు కొట్టాలి’.. నితీశ్‌కు రూ. 25 లక్షల చెక్ అందజేసిన సీఎం చంద్రబాబు

ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. భవిష్యత్ లో అతను మరిన్ని సెంచరీలు కొట్టాలని సీఎం ఆకాంక్షించారు. నితీశ్ కుమార్ రెడ్డి వెంట అతని తండ్రి ముత్యాల రెడ్డి కూడా ఉన్నారు.

Team India: మోకాళ్లపై తిరుమల మెట్లెక్కి మొక్కు తీర్చుకున్న టీమిండియా యంగ్ క్రికెటర్.. వీడియో ఇదిగో

టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ సడెన్ గా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని విశాఖ పట్నానికి వచ్చిన ఈ యంగ్ క్రికెటర్ తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

Pawan Kalyan: ఏ ప్రాంతం నుంచి వచ్చావనే దానికంటే.. నితీష్ కూమార్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్విట్..

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నితీశ్ కూమార్ రెడ్డి పేరే వినిపిస్తుంది. నిన్న ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ తెలుగోడు అద్బుతమైన సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నితీశ్‌‌ను దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించాడు.

Nitish Kumar Reddy:సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. కళ్లు చెమర్చే వీడియో

మెల్ బోర్న్ టెస్ట్ మూడో రోజు ఆట ముగిసిన తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు నితీశ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా అందరినీ హత్తుకుంటూ ఎమోషనల్ అయ్యాడీ యంగ్ క్రికెటర్. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

Nitish Kumar Reddy: ఇది తెలుగోడి బ్రాండ్ అంటే.. ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి

ఇది సెంచరీ కాదు పుష్పా.. అంతకుమించి.. ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ ఫైర్ బ్యాటింగ్‌ పవర్‌ ఇది. హాఫ్‌ సెంచరీ తర్వాత పుష్ప స్టయిల్‌లో తగ్గేదే లేదంటూ సెలబ్రేషన్స్‌ చేసుకున్న నితీశ్‌ కుమార్‌ రెడ్డి... సెంచరీ చేశాక...సలార్‌లో ప్రభాస్‌ని ఇమిటేట్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు

Nitish Reddy: సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు

Ind vs Aus 4th Test Match: బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియాకు మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ లో తెలుగు యువకుడు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సెంచరీతో అదరగొట్టాడు. ఆసిస్ గడ్డపై అతి పిన్న వయసులో సెంచిరీ చేసిన మూడో భారతీయ ఆటగాడిగా ఘనత సాధించాడు. 105 పరుగులతో అజేయంగా నిలిచి నాలుగో టెస్ట్‌లో భారత్‌ను ఓటమి అంచుల నుంచి గట్టెక్కించాడు.

IND vs AUS: ముగిసిన మూడో రోజు.. నితీష్, సుందర్‌ల వీరోచిత ఇన్నింగ్స్.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం

India vs Australia 4th Test Day 3 Highlights: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో నితీష్ రెడ్డి సెంచరీ ఆధారంగా భారత్ ఆస్ట్రేలియాపై పునరాగమనం చేసింది. ఓ దశలో ఫాలో ఆన్ ప్రమాదంలో పడిన భారత జట్టును.. కేవలం 116 పరుగుల వెనుకంజలో నిలిచేలా చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది.

Video: ఇది సెంచరీ కాదు పుష్పా.. అంతకుమించి.. ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ ఫైర్ సెలబ్రేషన్స్‌ చూశారా?

Nitish Kumar Reddy Wild Celebrations: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన నితీష్ కుమార్ రెడ్డి.. టీమిండియాను కాపాడాడు. ఫాలో ఆన్ నుంచే కాదు.. భారీ ఓటమి నుంచి తప్పించాడు. తొలి సెంచరీతో ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి తెలుగోడి పవర్ చూపించాడు. వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత కంగారులను టెన్షన్ పెట్టాడు. దీంతో మెల్‌బోర్న్ టెస్ట్ ఫలితం ఆసక్తికరంగా మారింది.

Nitish Kumar Reddy: సెంచరీతో చెలరేగిన తెలుగబ్బాయ్.. కంగారుల బెండ్ తీసిన కావ్యమారన్ కుర్రాడు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పునరాగమనం చేస్తోంది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 354 పరుగులు చేసింది. జట్టు 120 పరుగుల వెనుకబడి ఉంది. నితీష్ రెడ్డి క్రీజులో ఉన్నాడు. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!
చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!
ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉంటే దరిద్రమే.. వెంటనే తీసేయ్యండి!
ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉంటే దరిద్రమే.. వెంటనే తీసేయ్యండి!
అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడానికి కారణం ఎంటి..?
అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడానికి కారణం ఎంటి..?
చెట్టు లేదా ముఖం ఆధారంగా మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోండి..
చెట్టు లేదా ముఖం ఆధారంగా మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోండి..
బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో స్ట్రీమింగ్
బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో స్ట్రీమింగ్
స్త్రీలకు బెస్ట్ ఆసనాలు ఇవే గర్భాశయ బలంతో సహా ఎన్ని ప్రయోజనాలంటే
స్త్రీలకు బెస్ట్ ఆసనాలు ఇవే గర్భాశయ బలంతో సహా ఎన్ని ప్రయోజనాలంటే
ఇంటర్‌ పాసైన వారికి భలేచాన్స్.. ICF ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాలు!
ఇంటర్‌ పాసైన వారికి భలేచాన్స్.. ICF ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాలు!
లార్డ్స్ టెస్ట్ ఓటమి.. డబ్యూటీసీలో భారత్ బెండుతీసిన ఇంగ్లాండ్..
లార్డ్స్ టెస్ట్ ఓటమి.. డబ్యూటీసీలో భారత్ బెండుతీసిన ఇంగ్లాండ్..
ఇవి ట్యాబ్లెట్స్ కాదు.. ప్రాణాలు తీసే కిల్లర్స్.. ఎంత డేంజరో
ఇవి ట్యాబ్లెట్స్ కాదు.. ప్రాణాలు తీసే కిల్లర్స్.. ఎంత డేంజరో