AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ఏ ప్రాంతం నుంచి వచ్చావనే దానికంటే.. నితీష్ కూమార్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్విట్..

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నితీశ్ కూమార్ రెడ్డి పేరే వినిపిస్తుంది. నిన్న ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ తెలుగోడు అద్బుతమైన సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నితీశ్‌‌ను దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించాడు.

Pawan Kalyan: ఏ ప్రాంతం నుంచి వచ్చావనే దానికంటే.. నితీష్ కూమార్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్విట్..
Velpula Bharath Rao
|

Updated on: Dec 29, 2024 | 6:05 PM

Share

నితీష్ కుమార్ రెడ్డి టీమిండియా తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్ మ్యాచ్‌కు ప్రాణం పోసింది. నితీశ్‌ కుమార్‌ బ్యాటింగ్‌కు దిగే సమయానికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇంత జరిగినా నితీష్ ఆశ కోల్పోకుండా టీమిండియాను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు పోరాటం చేశాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు వర్షం కురిసింది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం నితీశ్‌ను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.

నితీశ్ కూమార్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందిస్తూ ట్విట్ చేశారు. నితీశ్ కుమార్ మన తెలుగువాడని గర్వంగా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై పవన్ ట్విట్ చేశారు. ఇండియాలోని ఏ ప్లేస్‌ నుంచి నువ్వు వచ్చావనే అనేదానికింటే దేశం గర్వపడేలా ఏం సాధించావు అనేదే ముఖ్యం. ఇలాంటి రికార్డులెన్నో సాధించాలని కోరుకుంటున్నా. ఇదే విధంగా భారత్ జెండాను ఉన్నతస్థాయికి తీసుకెళ్లి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని ఆయన ట్విట్ చేశారు.

ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 369 పరుగులకు ముగిసింది. ఆస్ట్రేలియా 105 పరుగుల బలమైన ఆధిక్యంలో ఉంది. ఈ పరుగుల ముందు ఆడుతూ ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆధిక్యం కుప్పకూలింది. 91 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయింది. దీంతో టీమిండియా విజయంపై ఆశలు పెట్టుకుంది. కానీ యశస్వి జైస్వాల్ పూర్ ఫీల్డింగ్ టీమ్ ఇండియాను దెబ్బతీసింది. మార్నస్ లాబుస్‌చాగ్నే, పాట్ కమ్మిన్స్ క్యాచ్‌లను వదిలివేయడం టీమిండియాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దీంతో ఏడో వికెట్ కోసం టీమిండియా తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. ఏడో వికెట్‌కు 91 పరుగుల నుంచి 148 పరుగుల వరకు. వీరిద్దరూ 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాలుగో రోజు ఆట ముగిసే వరకు వికెట్లు పడలేదు. అంతేకాదు, ఉస్మాన్ ఖవాజ్ క్యాచ్‌ను యశస్వి జైస్వాల్ కూడా ఆదిలోనే వదిలేశాడు. అప్పుడు అతను 2 పరుగుల వద్ద ఆడుతున్నాడు. అయితే ఆ తర్వాత టీమ్ ఇండియా 19 పరుగులకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉస్మాన్ ఖవాజా 21 పరుగుల వద్ద ఔటయ్యాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి