AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరికొత్త చరిత్రతో తగ్గేదేలే అంటోన్న తెలుగబ్బాయ్.. ఆస్ట్రేలియాలో తొలి భారత క్రికెటర్‌గా నితీష్ రెడ్డి

Nitish Kumar Reddy Sixes Records in Australia: యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు చాలా విజయవంతమయ్యాడు. దాదాపు ప్రతి ఇన్నింగ్స్‌లోనూ పరుగులు సాధిస్తున్నాడు. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా అతను టీమిండియాకు కీలకమైన పరుగులు సాధించి తన పేరు మీద ఓ భారీ రికార్డు సృష్టించాడు.

Venkata Chari
| Edited By: |

Updated on: Dec 28, 2024 | 7:54 PM

Share
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటుతున్నాడు. ఈ సిరీస్‌లో అతను బ్యాట్‌తో ఎంతో కీలకమైన పరుగులు చేశాడు. మెల్‌బోర్న్ టెస్టులో కూడా అలాంటిదే కనిపించింది. మెల్‌బోర్న్ టెస్టులో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగే సమయానికి టీమిండియా 191 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కానీ, లంచ్ సమయానికి అతను టీమ్ ఇండియా స్కోరును 244 పరుగులకు చేర్చగలిగాడు. ఈ సమయంలో తన పేరిట ఒక ప్రత్యేక రికార్డును కూడా సృష్టించాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటుతున్నాడు. ఈ సిరీస్‌లో అతను బ్యాట్‌తో ఎంతో కీలకమైన పరుగులు చేశాడు. మెల్‌బోర్న్ టెస్టులో కూడా అలాంటిదే కనిపించింది. మెల్‌బోర్న్ టెస్టులో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగే సమయానికి టీమిండియా 191 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కానీ, లంచ్ సమయానికి అతను టీమ్ ఇండియా స్కోరును 244 పరుగులకు చేర్చగలిగాడు. ఈ సమయంలో తన పేరిట ఒక ప్రత్యేక రికార్డును కూడా సృష్టించాడు.

1 / 5
మెల్‌బోర్న్ టెస్టులో మూడో రోజు లంచ్ వరకు నితీష్ కుమార్ రెడ్డి 61 బంతుల్లో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఈ సిక్స్ అతనికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్‌లో 8వ సారి సిక్స్ బాదాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్ల సంఖ్యను సమం చేశాడు. అదే సమయంలో, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో ఇన్ని సిక్సర్లు బాదిన భారతదేశం తరపున తొలి బ్యాట్స్‌మెన్‌గా నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు.

మెల్‌బోర్న్ టెస్టులో మూడో రోజు లంచ్ వరకు నితీష్ కుమార్ రెడ్డి 61 బంతుల్లో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఈ సిక్స్ అతనికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్‌లో 8వ సారి సిక్స్ బాదాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్ల సంఖ్యను సమం చేశాడు. అదే సమయంలో, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో ఇన్ని సిక్సర్లు బాదిన భారతదేశం తరపున తొలి బ్యాట్స్‌మెన్‌గా నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు.

2 / 5
నితీష్ కుమార్ రెడ్డి కంటే ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే ఇన్ని సిక్సర్లు కొట్టగలిగారు. 2002-03 యాషెస్ సిరీస్‌లో మైఖేల్ వాన్ 8 సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో, క్రిస్ గేల్ 2009-10 ఆస్ట్రేలియా పర్యటనలో ఒక టెస్ట్ సిరీస్‌లో 8 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో నితీష్ కుమార్ రెడ్డికి మొదటి స్థానం దక్కే అవకాశం ఉంది. అతను ఈ ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలను అధిగమించగలడు.

నితీష్ కుమార్ రెడ్డి కంటే ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే ఇన్ని సిక్సర్లు కొట్టగలిగారు. 2002-03 యాషెస్ సిరీస్‌లో మైఖేల్ వాన్ 8 సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో, క్రిస్ గేల్ 2009-10 ఆస్ట్రేలియా పర్యటనలో ఒక టెస్ట్ సిరీస్‌లో 8 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో నితీష్ కుమార్ రెడ్డికి మొదటి స్థానం దక్కే అవకాశం ఉంది. అతను ఈ ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలను అధిగమించగలడు.

3 / 5
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నితీష్ కుమార్ రెడ్డి 200 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో 200 పరుగుల మార్క్‌ను అందుకున్న మూడో భారతీయుడిగా నిలిచాడు. అతనితో పాటు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మాత్రమే 200+ పరుగులు చేశారు. అదే సమయంలో, ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అతను 5 సార్లు 30+ పరుగులు చేశాడు. టీమిండియా బ్యాటర్లలో 7 లేదా అంతకంటే తక్కువ స్థానంలో ఆడుతూ టెస్ట్ సిరీస్‌లో 5 సార్లు 30+ పరుగులు చేయడం ఇది నాలుగోసారి మాత్రమే.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నితీష్ కుమార్ రెడ్డి 200 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో 200 పరుగుల మార్క్‌ను అందుకున్న మూడో భారతీయుడిగా నిలిచాడు. అతనితో పాటు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మాత్రమే 200+ పరుగులు చేశారు. అదే సమయంలో, ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అతను 5 సార్లు 30+ పరుగులు చేశాడు. టీమిండియా బ్యాటర్లలో 7 లేదా అంతకంటే తక్కువ స్థానంలో ఆడుతూ టెస్ట్ సిరీస్‌లో 5 సార్లు 30+ పరుగులు చేయడం ఇది నాలుగోసారి మాత్రమే.

4 / 5
ప్రస్తుతం వార్త రాసే సమయానికి భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి 77 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 35 పరుగులతో క్రీజులో నిలిచారు. ఈ క్రమంలో నితీష్ రెడ్డి తన టెస్ట్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే, భారత జట్టును ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించాడు.

ప్రస్తుతం వార్త రాసే సమయానికి భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి 77 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 35 పరుగులతో క్రీజులో నిలిచారు. ఈ క్రమంలో నితీష్ రెడ్డి తన టెస్ట్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే, భారత జట్టును ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించాడు.

5 / 5