పాడి పంటలు
వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ కోట్లాది కుటుంబాలకు జీవనాధారం కల్పిస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారమైన వ్యవసాయ రంగం కాలానుగుణంగా అనేక మార్పులకు లోనవుతోంది. పెరుగుతున్న సాగు ఖర్చులు, కూలీల కొరత, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఉత్పాదకతను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ విధానం, యంత్రాల వినియోగం, నాణ్యమైన విత్తనాలు, సేంద్రియ ఎరువులు, శాస్త్రీయ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన దిగుబడులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, ఆక్వా, ఫౌల్ట్రీ, గొర్రెలు–మేకల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ రంగాలు రైతులకు అదనపు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఒకే పంటపై ఆధారపడకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను సమన్వయం చేసుకోవడం ద్వారా రైతులు ఆదాయాన్ని విభిన్న మార్గాల్లో పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పశుపోషణను వ్యవసాయంతో అనుసంధానం చేసుకుంటే పంట అవశేషాలను పశువుల మేతగా, పశువుల వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు. దీంతో ఉత్పత్తి ఖర్చులు కొంతవరకు తగ్గడంతో పాటు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంటుంది.
పాడి పరిశ్రమలో నాణ్యమైన పశువుల ఎంపిక, సమతుల్యమైన దాణా, పశువులకు సమయానుకూలంగా టీకాలు, వైద్య సేవలు అందించడం, శుభ్రమైన వాతావరణం కల్పించడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. పాలు, పాల ఉత్పత్తులకు మార్కెట్ డిమాండ్ ఉండటంతో రైతులకు రోజువారీ ఆదాయ వనరుగా పాడి పరిశ్రమ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆక్వా రంగంలో శాస్త్రీయ పద్ధతులను పాటించడం, నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం, సరైన మేత వినియోగం, వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన పిల్లల ఎంపిక వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
ఫౌల్ట్రీ రంగంలోనూ ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. కోళ్లకు సరైన పోషకాహారం, తగిన ఉష్ణోగ్రత, పరిశుభ్రమైన వాతావరణం, వ్యాధుల నివారణకు టీకాలు, శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు పాటించడం ద్వారా నష్టాలను తగ్గించి మంచి ఫలితాలు సాధించవచ్చు. అయితే ఈ రంగాల్లో మార్కెట్ ధరలు, మేత ఖర్చులు, వ్యాధుల వ్యాప్తి, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలు రైతుల ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను అంచనా వేయడం, నిపుణుల సలహాలు తీసుకోవడం, ప్రమాదాలను ముందుగానే గుర్తించడం అవసరం.
ఇంకా చదవండికరువు పరిస్థితుల్లో అండగా నిలిచే సెప్టెంబర్ నెల పంటలు.. తక్కువ నీటితో ఎక్కువ లాభాలు
వర్షాభావ పరిస్థితుల్లో సెప్టెంబర్లో సరైన పంటను ఎంచుకోవడం రైతులకు కీలకం. తక్కువ నీటితో సాగు చేయగల శనగ, పెసర, మినుము పంటలను ఈ సమయంలో పరిగణించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. రైతులు తమ ప్రాంతంలోని నేల స్వభావం, వాతావరణం, నీటి లభ్యత, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 4, 2026
- 12:04 pm
Telangana: ఏడాదికి 9 పంటలు.. రైతులకు కాసుల వర్షం.. కాకతీయుల కోటలో పచ్చటి సిరులు..
రాతి కోట గోడల మధ్య పచ్చని పంటల విప్లవం.. కాకతీయుల శిల్పకళా వైభవానికి నిలయమైన ఖిలా వరంగల్లో ఇప్పుడు సరికొత్త చరిత్ర మొదలైంది. ఏకశిలా తోరణాల సాక్షిగా రైతులు పండిస్తున్న ఆకుకూరల పంటలు అటు పర్యాటకులను కట్టిపడేస్తుంటే.. ఇటు అన్నదాతల ఇళ్లల్లో సిరులు కురిపిస్తున్నాయి. ఆ రాతి కోటలో చిగురిస్తున్న పచ్చదనం కథను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- G Peddeesh Kumar
- Updated on: Sep 2, 2026
- 12:00 pm
రైతన్నా.. క్యాప్సికమ్ సాగుతో ఖతర్నాక్ ఆదాయం.. ఈ టిప్స్ పాటిస్తే ఏడాది పొడవున లక్షల్లో లాభాలు..
సాంప్రదాయ పంటలు వేసి నష్టపోవడం కంటే.. ఆధునిక పద్ధతుల్లో వాణిజ్య పంటలు సాగు చేస్తే కళ్లు చెదిరే లాభాలు ఆర్జించవచ్చని నిరూపిస్తున్నారు కొంతమంది రైతులు. ముఖ్యంగా గ్రీన్హౌస్లో క్యాప్సికమ్ సాగు చేస్తూ ఏడాది పొడవునా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. మార్కెట్లో పచ్చి, ఎరుపు, పసుపు రంగుల క్యాప్సికమ్కు ఉన్న విపరీతమైన డిమాండ్ను సొమ్ము చేసుకుంటూ అధిక దిగుబడి సాధించే పక్కా సాగు మెళకువలు తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Aug 29, 2026
- 12:55 pm
పంటలపై మిడతల దాడిని ఇలా అడ్డుకోండి.. పొలాలు, ఇళ్ల నుంచి తరిమికొట్టే సూపర్ ట్రిక్స్..
నిమిషాల వ్యవధిలోనే ఎకరాల కొద్దీ పచ్చని పంటలను తుడిచిపెట్టేసే మిడతల దండు అన్నదాతల పాలిట పెను శాపంగా మారుతుంది. పొలాల్లో పంటలను నాశనం చేయడమే కాకుండా.. ఊళ్లపై, ఇళ్లపై కూడా విరుచుకుపడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అయితే ఈ మిడతల దాడి నుంచి పంటలను ఎలా రక్షించుకోవాలి? ఇళ్లలోకి రాకుండా వంటింటి చిట్కాలతోనే వాటిని ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- Krishna S
- Updated on: Aug 29, 2026
- 11:59 am
రైతన్నకు మస్త్ పైసల్ ఆదా.. పురుగులు, తెగుళ్లను తరిమికొట్టే మందులను ఇంట్లోనే ఇలా తయారుచేసుకోండి..
వేలకు వేలు పోసి రసాయన పురుగుమందులు కొని అప్పులపాలవుతున్నారా? భూమి సారాన్ని, జేబును గుల్ల చేసే ఆ విషపు మందులకు స్వస్తి పలికే సమయం వచ్చింది. మన పెరట్లో, పల్లెల్లో ఉచితంగా దొరికే వేప, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గోమూత్రంతో ఇంట్లోనే తయారుచేసుకోగల 5 అద్భుత సహజ ద్రావణాలు చీడపురుగులను సమర్థవంతంగా తరిమికొడతాయి. వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Aug 27, 2026
- 2:07 pm
Andhra: రాళ్లలో రతనాలు.. ఒక్కసారి వేస్తే ఇక అంతా రాబడే..
రాళ్లతో నిండిన నేలలోనూ వినూత్న సాగుతో విజయాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు మార్కాపురం మహిళా రైతులు. నీటి అవసరం తక్కువగా ఉండే ఖర్జూరపు చెట్లను ఎకరంలో 110 వరకు నాటి.. రాబోయే రోజుల్లో మంచి ఆదాయం పొందాలనే ఆశతో సాగు చేస్తున్నారు.
- Fairoz Baig
- Updated on: Aug 24, 2026
- 1:11 pm
ఒక ఎకరాలో వరి సాగుకు ఎంత ఖర్చు అవుతుంది..? రైతుకు మిగిలే ఆదాయం ఎంతో తెలుసుకోండి..
ఒక ఎకరం వరి వేయాలంటే రైతు చేతిలో ఎంత డబ్బులు ఉండాలి? పెరుగుతున్న ఎరువుల ధరలు, డీజిల్ రేట్లు, విపరీతమైన కూలీల కొరత నడుమ వరి సాగు రైతులకు సవాలుగా మారింది. ఒక ఎకరం వరి పండించడానికి నేల దుక్కి నుంచి పంట కోత దాకా ఏయే దశల్లో ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? అన్నదాతకు చివరకు మిగిలే లాభమెంత? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Aug 24, 2026
- 1:14 pm
ఏలూరు రైతు రాంబాబు సాగు సీక్రెట్ : వంగ సాగుతో అద్భుత లాభాలు
ఏలూరు జిల్లా రైతు రాంబాబు కూరగాయల సాగులో శాస్త్రీయ పద్ధతులు, సమగ్ర యాజమాన్యం పాటిస్తూ అద్భుతమైన లాభాలు ఆర్జిస్తున్నారు. వంగ, బెండ సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకుంటూ, పలువురికి ఉపాధి కల్పిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన కష్టానికి, తెలివైన సాగు విధానానికి నిదర్శనం.
- Ram Naramaneni
- Updated on: Aug 21, 2026
- 7:40 am
పాడి రైతులకు వరం జింజువా గడ్డి.. 30 రోజులకే కోత
కృష్ణా జిల్లా రైతు ఉప్పల ప్రసాదరావు అనుభవాల ద్వారా, జింజువా గడ్డి పాడి రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలుస్తోంది. ఇది పశువుల పాల ఉత్పత్తిని, పునరుత్పత్తిని పెంచుతూ, ప్రతి 30 రోజులకు కోతకు వస్తుంది. అధిక పోషక విలువలు, 12% ప్రోటీన్తో, ఇది కరువు పరిస్థితులను కూడా తట్టుకుంటుంది. కట్ చేసే అవసరం లేకుండానే పశువులు ఇష్టంగా తింటాయి. ఇది డైరీ రైతులకు నిజమైన వరం.
- Ram Naramaneni
- Updated on: Aug 20, 2026
- 6:53 pm
ఎకరన్నర పొలంలో అద్భుతం చేసిన రైతు.. ఆ క్షేత్రానికి వివిధ దేశాల శాస్త్రవేత్తల క్యూ..
ఏలూరు జిల్లా నాచుగుంటకు చెందిన రైతు జి. వెంకటరత్నం ఇండోనేషియా ‘ఫిష్–ప్యాడీ’ విధానాన్ని అనుసరిస్తూ 1.5 ఎకరాల్లో సమీకృత సాగుతో సిరులు పండిస్తున్నారు. వరి, చేపలు, పండ్ల తోటలు, కూరగాయలను ఒకే క్షేత్రంలో సాగు చేస్తూ ఏటా లక్షల రూపాయల నికర లాభం ఆర్జిస్తున్నారు.
- B Ravi Kumar
- Updated on: Aug 19, 2026
- 3:44 pm